5వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయండి

పలిమల మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ పలిమల మండల కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను(గోడ పత్రికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13 14వ తేదీన రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలు గా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా పలిమల మండలం అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది అన్నారు. పలిమల మండల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. పలిమల మండలంలోని పోడు చేసుకున్న రైతులకు పట్టాలి ఇవ్వాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సిపిఐ 5వ జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, మండల నాయకులు మట్టి సర్వేష్, మట్టి కృష్ణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ అమీలే శ్రీనాధ్, శ్రీకాంత్, అంజి బాబు, మారవేణి వెంకట్, పోడెం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version