ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెండవ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version