బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్.

బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్

మహాదేవపూర్ జూన్5( నేటిధాత్రి )

మంథని నియోజకవర్గంలో అణగారిన వర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత నాయకుడు మెరుగు లక్ష్మణ్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది
ముఖ్యంగా పార్టీకి రాజీనామా చేయడంలో పార్టీలో జరుగుతున్న అనగారిన వర్గాల కార్యకర్తల విషయంపై మంథని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల నాయకులు
పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్యకర్తల పట్ల వివక్ష చూపుతున్నారు కావున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది
ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
కాబట్టి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version