రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన.

*ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి

కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట(నేటిదాత్రి).

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో యువతకు మరియు చాలా కుటుంబాలకు ఉపాధిగా ఉన్న ఇసుక రవాణా ప్రభుత్వం నిలిపివేయడం వల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వారికి ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇసుక ట్రాక్టర్లను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండడం వల్ల ఇదే ప్రధాన ఉపాధిగా భావించి చాలామంది ఆ తరువాత ట్రాక్టర్లను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి తమ ఉపాధిని కొనసాగిస్తూ ఉండేవారు అని ఇప్పుడు ఇసుక రవాణా ఆపివేయడం వల్ల వారు ఉపాధి కోల్పోయి వారితో పాటు వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడడం ఫైనాన్స్ లు కట్టలేక వారాంతపు చిట్టీలు కట్టలేక గిరి గిరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ కుటుంబాలకు ఏర్పడ్డదని మహేందర్ రెడ్డి అన్నారు.

గత రెండు రోజుల క్రితం వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయాలని రాజీవ్ యువశక్తి పథకం కింద వీరందరికీ రుణాలు మంజూరు చేసి వారి పరిస్థితికి తగ్గట్టు వ్యాపారం లేదా వేరే పని చేసుకునేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఇదే విషయాన్ని ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి డ్రైవర్లకు ఓనర్లకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని వారిని డిమాండ్ చేశారు లేదంటే వారి తరపున భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రభుత్వంపై పోరాడి వారికి కావలసిన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఎల్లవేళలా పని చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నోసార్లు ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు జిల్లాకు చెందిన మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి వారి బాధలను చెప్పుకున్న వారి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆ విధంగా ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన కార్మికులు నిరాశలో ఉన్నారని వారికి సరియైన హామీ ప్రభుత్వం నుంచి రాకుంటే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు . జాయింట్ కలెక్టర్ డి ఎస్ ఓ సన్న బియ్యం పంపిణీ పై డీలర్ల సమావేశం నిర్వహించారని అధికారులు దిశా నిర్దాశము చేశారని తెలిపారు . వనపర్తి జిల్లా పట్టణంలో ప్రజలకు రేషన్ డీలర్లు ఎవరైనా దొడ్డు బియ్యం సరఫరా చేస్తే కలెక్టర్ కార్యాలయం డీఎస్ఓ కు ఫిర్యాదులు చేయాలని అధికారులు చెప్పారని బచ్చురాం తెలిపారు . ప్రభుత్వం అధికారులు ఆదేశాల ను అమలు చేసి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు . జిల్లాలోని ప్రతి గ్రామంలో వనపర్తి పట్టణంలో రేషన్ డీలర్లు సన్న బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు

ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత.

ప్రమాదాకరంగా ఉన్న ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న ఇనుప కరెంటు స్తంభం ముక్క. నడికూడ నుండి ధర్మారం వరకు రోడ్డు వెడల్పు లో భాగంగా ఇనుప కరెంట్ స్తంభాలను తొలగించగ మిగిలిన ముక్క రోడ్డు మీద ప్రమాదకరంగా ఉండి వాహనాధారులు ప్రమాదానికి గురయ్యేవారు. నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు చొరవ తీసుకుని కటర్, గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో ఇనుప కరెంట్ స్తంభం ముక్కను తొలగించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. దీనితో పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.

 

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఏ.పి రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు తీరని లోటు అని బిషప్ ఎం.ఆదామ్ బెన్ని అన్నారు.పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల నర్సంపేట డివిజన్ పాస్టర్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు పాస్టర్ లాజరు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై యావత్తు క్రైస్తవలోకానికి అనేక అనుమానాలు ఉన్నాయని మరణంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పాస్టర్స్ రేజి జార్జి,మత్తయి,
బోడ రవికుమార్, చిన్నపెల్లి శ్రీధర్, పాల్,క్రాంతి పాల్, పాల్,శ్రీనివాస్, కుమార్ పాల్,అబ్రాహం,సీమోన్, వెంకన్న,విలియం కేరీ, కొమ్మాలు,రూబెన్,సొలొమోను,
యాదగిరి,ఎఫప్రా,సురేష్,పీటర్,రమేష్ కేరీ,క్రైస్తవ నాయకులు
మంద ప్రకాష్,మారేపల్లి అశోక్,ప్రభాకర్,కొమ్ముల నవీన్,రవి
మాదాసి నవీన్,ఈసాక్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు.
ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

నారింజ నీటి కలుషిత కారకులపై చర్యలు తీసుకోవాలి.!

నారింజ నీటి కలుషిత కారకులపై చర్యలు తీసుకోవాలి,,!

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తూర్ గ్రామములో ఉన్నది కానీ అతిపెద్ద సాగు నీటి చెరువు నారింజ ప్రాజెక్టు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ నరోత్తం, మా ట్లాడుతు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు 3000 ఎకరాల ఆయాకట్టును నిర్థారించారు కానీ ప్రభుత్వ అలసత్వం వల్ల కాలువలు బాగాలేనందున ఆయకట్టుకు నిరందడం లేదు ఈ ప్రాజెక్టులో నీటి నిలువల వల్ల చుట్టుప్రక్కల 12 గ్రామాలలో భూగర్భజలాలు పెంపొందినాయి,మొన్న నారింజను పరిశీలిస్తే అందులో ఉన్న నీరంత రంగు మారి కలుషిత మైనట్లు కనిపిస్తున్నది,ఈ నీరు కలుషితానికి కారణం అల్లానా వ్యర్థ జలాలో లేదా పురపాలక డ్రైనేజీ వాటరో కలవడం వల్ల జరిగినట్లు కనిపిస్తున్నది, చుట్టూ ప్రక్కల వాకబు చేయగా పశువుల కూడా ఆ నీరు త్రాగడం లేదని ప్రజలు చేప్పుతున్నారు.ఈ రోజు ఇంత వేసవిలో కూడా ఈ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నాయి.ఈ ప్రాజెక్టులో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది,తక్షణమే కాలుష్యనియంత్రణ అధికారులు ఆ నీటిని పరిశీలించి నీటి కాలుష్యానికి కారణమైన సంబందిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఆ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి లోతును పెంచి ప్రాజెక్టులో నీటి నిలువను పెంపొందించాల్సిందిగా డిమాండ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజ్ , జైపాల్, తదితరులు ఉన్నారు.

ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి.

గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి

జమ్మికుంట :నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

సజావుగా గ్రామసభ నిర్వహణ.

సజావుగా గ్రామసభ నిర్వహణ…..

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచర్యాగడి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. గ్రామంలో వీధిదీపాల సమస్య, మురుగు నీటి నిల్వ, త్రాగునీటి కొరత వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటి యజమాని ఇంటిపన్ను సహా ఇతర పన్నులను చెల్లించాలన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు.!

ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

*నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

*చల్లా రామచంద్రారెడ్డి చల్లా బాబు రెడ్డి..

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 26:

 

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం క్లస్టర్ ఇన్ చా ర్జులు, భూత్ ఇన్ చార్జీ
లు,యూనిట్ ఇన్
చార్జీ ల తో నియోజకవర్గ
స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)
ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ ని కోల్పోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఉన్నారని వారి మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Constituency

గత 20 సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేశారని ఇకమీదట వారి ఆటలు సాగని సాగనివ్వమని హెచ్చరించారు.
పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి అనేకమంది జైలుకు వెళ్లారని అటువంటి వారికి అందరికీ తగిన గుర్తింపు ఇస్తామని గ్రామాలలో మరియు కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పది రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందని అటువంటి వారికే పదవులు వరిస్తాయని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు
భూత్ ఇన్, చార్జులు, యూనిట్ఇన్చార్జులు , క్లస్టర్ ఇన్చార్జులు మరియు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

ట్రైబల్ మ్యూజియం పోస్టర్ ఆవిష్కరణ.

ట్రైబల్ మ్యూజియం పోస్టర్ ఆవిష్కరణ

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా – భద్రాచలం లో* “ట్రైబల్ మ్యూజియం” పోస్టర్ను ఆవిష్కరించిన
తెలంగాణ రాష్ట్ర *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఎంఎల్ఏ స్ తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు మట్ట రగామాయి కోరాం కనకయ్య , రాందాస్ నాయక్ గారు, కాంగ్రెస్ జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ పాల్గొన్నారు…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం అనంత నగర్ 26వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వికృతి భరత్ కుమార్ కి 42500 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్దిమల్ల భాను, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, దళిత నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మకూరు నుండి తపస్ పల్లి డ్యాం కు నీటి విడుదల.

బొమ్మకూరు డ్యాం నుండి తపస్ పల్లి డ్యాం కు నీటి విడుదల

చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న

చేర్యాల నేటిధాత్రి

 

చేర్యాల, కొమురవెల్లి,మండలంలో పలు గ్రామాల చెరువులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నాయని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న జనగామ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి నీళ్లు బొమ్మకూరు డ్యామ్ కు నీటిని విడుదల చేయాలని కోరారు నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలకు కొమురవెల్లి చేర్యాల రైతుల పక్షాన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితో అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముస్లిం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముస్లిం మంత్రిని చేర్చుకోవాలని ప్రభుత్వం నుండి డిమాండ్ మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎల్గోయి గ్రామానికి చెందిన మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సర ఆగడి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా, ప్రభుత్వంపై ముస్లింల ఆందోళనలను తొలగించాలి, ఈ అభిప్రాయాలను శ్రీనగర్ మాజీ ప్రతినిధి హీర్ షేక్ జావేద్ తన పత్రికా ప్రకటనలో వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే లౌకిక పార్టీ అని ఆయన అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద శాసనమండలికి అభ్యర్థుల ఎన్నిక సందర్భంగా, రాష్ట్రం తెలంగాణ ముస్లింలు ఎమ్మెల్సీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని ఎన్నుకుంటారని చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ చివరికి ఫలితం దానికి విరుద్ధంగా మారింది. కాబట్టి, కాంగ్రెస్ హైకమాండ్ మరియు తెలంగాణ ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా దీనిని పరిష్కరించాలి, తద్వారా ముస్లింల సందేహాలు తొలగిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లింలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం అప్పగించారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఎల్లప్పుడూ రాజు పదవిలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను విస్మరించిన రాజకీయ పార్టీని నష్టాలను చవిచూస్తూ అధికారం నుండి తొలగించారని గత చరిత్ర సాక్షిగా ఉందని మైనారిటీ కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .

అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల రమ్యకు.20000.రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందటితిరుపతి యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్మకూరు నాగరాజు ముందటి రమేష్ సంపత్ నక్క రవి గొర్రె రాజు గుండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే

బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నిమ్జ్ లో మరో ముందడుగు…

నిమ్జ్ లో మరో ముందడుగు…

• తాగునీటి పైప్ లైన్కు రూ.10కోట్లు

• పూర్తికావొస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం

• వెమ్, హుండై ఏర్పాటుకు కార్యాచరణ

• ప్రభుత్వ ప్రతిపాదన 12,500 ఎకరాలు

• ఇప్పటి వరకు 3,500 ఎకరాల సేకరణ

• భూముల ధరలకు రెక్కలు

• గ్రామాల్లోనూ వెంచర్ల ఏర్పాటు

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

BT road

 

నిజ్జా (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) పారిశ్రా మిక వాడలో మరో ముందడుగు పడనుంది. జహీరాబాద్ నియో జకవర్గంలో ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు 12,500 ఎకరాల భూమిని సేక రించేందుకు ప్రతిపాదించింది.

అందులో ఇప్పటికే దాదాపు 3,500 ఎకరాలను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది.

అయితే మిగత భూమి సేకరించినందుకు ప్రభుత్వం సంకల్పించినప్ప టికీ ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరే కత వ్యక్తమవడంతో భూ సేకరణలో ఆలస్యం అవుతోంది.

అయితే సేకరించిన నిమ్ భూమిలో మౌలిక సదుపాయాల కోసం అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొం దించగా అందులో భాగంగా తాగునీటి పైప్లాన్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.10,02,98,136 (ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వ్యాల్యూ) మంజూరు చేసింది.

ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న మిషన్ భగీరథ పైప్లాన్ నుంచి నూతనంగా ఏర్పాటు చేయనున్న వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు, హుండై పరిశ్రమకు పైపులైన్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించను న్నారు.

ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికా రులు పనులు చేపట్టేందుకు టెండర్ ఆహ్వానించారు.

వచ్చే నెల 7వ తేదీ వరకు టెండర్ బిడ్లు దాఖలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు.

BT road

ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే ఆ రెండు పరిశ్రమలతో పాటు నిజ్జా పారిశ్రామి కవాడలో కొంతవరకు నీటి వసతి కల్పించినట్లు అవు తుంది.

కాగా ఇప్పటికే కలెక్టర్ వల్లూరి క్రాంతి గతంలో నిమ్డ్ ప్రాంతాన్ని పర్యటించి మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదే శించారు.

అంతర్గత రోడ్ల నిర్మాణానికై పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చాలని కలెక్టర్ ఆదేశించారు.

కాగా జాతీయ రహదారి65 హుగ్గెల్లి చౌరస్తా నుంచి కృష్ణాపూర్, మాచ్నూర్, బర్డీపూర్ గ్రామాల సమీపం నుంచి నిమ్ వరకు రూ.100 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తికావస్తున్నాయి.

100 ఫీట్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల దూరం బీటీరోడ్డు పనులు ఇప్ప టికే పూర్తి చేశారు.

ఈ రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి దానిపై ఇరువైపులా ఎస్ఈడీ లైట్లు బిగించారు.

అలాగే చౌరస్తాల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

అయితే హుగ్గెల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహ దారిని ఇరువైపులా వెడల్పు చేసి రాకపోకలు సాఫీగా జరి గేలా పనులు కొనసాగుతున్నాయి.

ఈ పనులు పూర్తయితే నిమ్స్ రోడ్డును ప్రారంభించి రాకపోకలను అధికారికంగా కొనసాగించే అవకాశం ఉంది.

అలాగే నిమ్డ్ అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో కలగనుంది.

ఇదిలా ఉండగా ఇక్కడ వెన్ టెక్నాలజీ, హుండై పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరగగా..

నిర్మాణ ర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ కొనసాగు తుంది.

ఈ రెండు పరిశ్రమలతో ఎలాంటి కాలుష్యం లేనం దున స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

వీటి ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

కాగా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్డ్ ఏర్పాటు చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

హుగెల్లి చౌరస్తా సమీ పంలో జాతీయ రహదారి65, నిమ్డ్ రోడ్లకు ఆనుకుని ఉన్న ఎకరా భూమి ధర ఏకంగా రూ.8కోట్లు పలుకుతుందంటే జహీరాబాద్ ప్రాంతంలో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

అదేవిధంగా బర్దీపూర్, మాచ్నూర్ నిమ్డ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి.

మారుమూల ప్రాంతా ల్లో ఉన్న భూముల ధరలు సైతం విపరీతంగా పెరిగిపో యాయి. సామాన్యుడు ఎకరా భూమి కూడా కొనలేని స్థితిలో ధరలు ఉన్నాయి.

అయితే ముందుచూపు ఉన్న పెట్టుబడిదారులు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ముందుగానే వందల ఎకరాల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాట్లు చేశారు. మండలాలు, మారుమూల గ్రామాల్లో సైతం ఇంకా వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూనే ఉంది.

ఈ వెంచర్లల్లో ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతు న్నారు.

పట్టణాల్లోని ప్లాట్ల ధరలకు దీటుగా మండలాల్లో ప్లాట్ల ధరలు పలుకుతున్నాయి.

ఇదంతా జహీరాబాద్ ప్రాంతానికి నిమ్డ్ రావడం వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా పారిశ్రామికంగా నిమ్డ్ అభివృద్ధి చెందినట్లయితే జహీరాబాద్ ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఎంతైనా ఉంది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ మండలం ఏపిఓ ను బదిలీ చెయ్యాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిఆర్డిఓ పిడి కి వినతి పత్రం

మరిపెడ నేటిధాత్రి.

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిపెడ మండలం ఏపీఓ గా విధులు నిర్వహిస్తున్న మంగమ్మ దీర్ఘకాలికంగా ఒకే చోట గత 13 సంవత్సరాలుగా పనిచేస్తూ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అవకతవకలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో బయటపడటం తన సొంత మండలం లోని తాను దీర్ఘకాలంగా పనిచేయడం వలన రాజకీయ ప్రాబల్యం ఉండటం వలన సాధారణ బదిలీలు జరిగిన కూడా తాను ఇక నుండి బదిలీ కాకుండా మళ్లీ ఇదే చోట యధావిధిగా పోస్టింగ్ లో కొనసాగుతూ వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీలల్లో అందరూ ఏపీఓ లు నాలుగు ఐదు సంవత్సరాలకి ఇతర మండలాలకు బదిలీ అయినారు కానీ మరిపెడ ఏపీవో మాత్రం గత 13 సంవత్సరాల నుండి మరిపెడ మండలం నుండి బదిలీ కాలేదు ఈ మండలం నుండి బదిలీ చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version