ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే.!

ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారి మూడు నెలల పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ కోరారు. సోమవారము మండల కేంద్రమైన ఝరాసంగం లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఉపాధిహామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాం. ఈ ఉద్యోగం పైనే మా కుటుంబాలు అన్ని ఆధారపడి జీవిస్తున్నాయని ఆయన తెలిపారు. గత మూడు నెలల నుండి మాకు వేతనాలు అందక కుటుంబాలను పోషించలేక చాలా ఇబ్బందికరంగా మారిందని, తమ పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో ఖర్చులు కుటుంబాలను పోషించలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి తమ కుటుంబాలను అందుకోవాలని ఈశ్వర్ పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ మండలం ఏపిఓ ను బదిలీ చెయ్యాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిఆర్డిఓ పిడి కి వినతి పత్రం

మరిపెడ నేటిధాత్రి.

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిపెడ మండలం ఏపీఓ గా విధులు నిర్వహిస్తున్న మంగమ్మ దీర్ఘకాలికంగా ఒకే చోట గత 13 సంవత్సరాలుగా పనిచేస్తూ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అవకతవకలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో బయటపడటం తన సొంత మండలం లోని తాను దీర్ఘకాలంగా పనిచేయడం వలన రాజకీయ ప్రాబల్యం ఉండటం వలన సాధారణ బదిలీలు జరిగిన కూడా తాను ఇక నుండి బదిలీ కాకుండా మళ్లీ ఇదే చోట యధావిధిగా పోస్టింగ్ లో కొనసాగుతూ వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీలల్లో అందరూ ఏపీఓ లు నాలుగు ఐదు సంవత్సరాలకి ఇతర మండలాలకు బదిలీ అయినారు కానీ మరిపెడ ఏపీవో మాత్రం గత 13 సంవత్సరాల నుండి మరిపెడ మండలం నుండి బదిలీ కాలేదు ఈ మండలం నుండి బదిలీ చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version