ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో.!

మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నప్రసాద వితరణ

పరకాల నేటిధాత్రి:

 

పరకాల మండలంలోని
మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం మల్లక్కపేట
లో సోమవారం రోజున విఎస్స్సార్ ఫ్యామిలీ మార్ట్ యాజమాన్యం పరకాల,నర్సంపేట
మరియు దోషిని మహేష్,శ్రీనివాస్ నాగారం లు మహా అన్న ప్రసాద వితరణ హనుమాన్ మాలాధారణ దీక్ష స్వీకరణలో ఉన్న హనుమాన్ స్వాములకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అలాంటి అవకాశాన్ని కల్పించిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ అంబీర్ మహేందర్ కి సహకరించిన ఆలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గోదాం ను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్.

గోదాం ను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

పరకాల వ్యవసాయ మార్కెట్లో 2వేల మెట్రిక్ టన్నుల నిలువ చేసే ధాన్యపు బస్తాల గోదాంను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లు దాసరి బిక్షపతి, బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి,నల్లెల్ల కుమారస్వామి,మేనేజర్ రాజు, హమాలి యూనియన్ గౌరవ అధ్యక్షులు లంకదాసరి అశోక్, మార్కెట్ సిబ్బంది రాజేష్ పెద్ద ఎత్తున హమాలి సంఘంనాయకులు,యూనియన్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.

నేడు హనుమాన్ మాల ధారణ వేసిన.!

నేడు హనుమాన్ మాల ధారణ వేసిన స్వాములకు బిక్ష అన్న ప్రసాదం

బోనాల ఉమా రాజమౌళి రిటైర్డ్ ఉపాధ్యాయులు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో దక్షిణ ముఖ హనుమాన్ టెంపుల్ చెరువు కట్ట వద్ద భిక్ష అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గ్రామంలోని హనుమాన్ భక్తులందరూ గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించగలరని వారు కోరారు
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజమౌళి అన్నారు

ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ గ్రహీత.

ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ గ్రహీత

పత్తిపాక గ్రామ నివాసి రామాంజనేయులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ నివాసికి ఇంపాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డు లభించింది.హైదరాబాద్‌లోని ఎఫ్ టిసిసిఐ హాల్‌లో జరిగిన సమావేశంలో ఇంపాక్ట్ ఇంటర్నే షనల్ రీజియన్ 11-పాత మహబూబునగర్, కర్నూ ల్ ,అనంతపూర్, కర్ణాటక నుండి ఇంఫాక్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణం.

International

ఈ గుర్తింపు నా జీవిత ప్రయాణంలోఒక టీచర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రతిభావంత మైన మోటివేషనల్ స్పీకర్‌గా ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇది కేవలం ప్రారంభ మాత్రమే అని నేను నమ్ముతు న్నాను. అవార్డు గ్రహీతకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గంపా నాగేశ్వర్ రావు ఫౌండర్, ఇంపాక్ట్ ఇంట ర్నేషనల్ నూనే సుదర్శన్, మాధవి, రవీంద్ర ధీర రీజినల్ ప్రెసిడెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయములో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలి ఎమ్మెల్యే చెప్పారు

మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఒక్క బస్తకు రెండు మూడు కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి

గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు

మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నడు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి సెంటర్ల లో ఉన్న వరి ధాన్యాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ధర్మ సమాజ్ పార్టీ గణపురం మండలాధ్యక్షుడు కుర్రి స్వామినాదన్ గార్లు పరిశీలించడం జరిగింది రైతులకు శాశ్వతమైన సిమెంట్ కల్లాలు లేక అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి రైతులు బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో పంట దిగుబడి నీ దృష్టిలో పెట్టుకొని మూడు నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి కాంక్రీట్ సీసీ కల్లాలను నిర్మాణం చేయాలి వేలకోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు కల్లాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఇలానే చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో రైతులందరూ రోడ్లమీద వడ్లు ఎండ పో సుకోవలసిన పరిస్థితి వస్తుంది ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయంలో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలని ఎమ్మెల్యే చెప్పారు మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఒక బస్థకు 2,3 కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి ఇది వాస్తవం గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నాడు అయినా దీన్ని ప్రజా పాలన అంటున్నారు ప్రజలను దోపిడీ చేసే పాలన ప్రజాపాలన ఎట్లా అవుతుంది వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి. అలాగే అధికారాన్ని అండగా చేసుకొని బుర్రకాయల గూడెం నగరంపల్లి గ్రామాల్లో జరిగిన అవకతవకలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం.

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం

 

 

అల్గునూర్ సివోఈ నుండి బాయ్స్ హాస్టల్ పిల్లలను వేరే హాస్టల్ కు తరలించవద్దు -మచ్చ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

 

2007 సంవత్సరంలో ఉత్తర తెలంగాణ విద్యార్థుల కొరకు అత్యుత్తమ విద్యను ఐఐటి మరియు నీట్ పరీక్షల గూర్చి ఆనాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామంలో స్థాపించటం జరిగిందని, గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కోఎడ్యుకేషన్ విధానంలో ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు స్థాపించి ఎన్నో ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరిగింది.

కారణాలేవైనప్పటికీ నేడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ , కోఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్న ఈకళాశాలను కేవలము బాలికలకు మాత్రమే పరిమితం చేస్తూ బాలురకు ఉత్తమ విద్యా విధానాన్ని దూరం చేస్తున్న వైనం కుట్రతో కూడుకున్నదని భావించక తప్పడం లేదు.

ఏకారణం చేతనో ఉత్తర తెలంగాణ బాలురకు ప్రీమియర్ సివోఈ పాఠశాలను దూరం చేస్తూ ఈప్రాంతపు వారికి తీరని అన్యాయము చేస్తున్నారు.

గౌలిదొడ్డిలో మల్టీజోన్ రెండు నందు బాలురకి మరియు బాలికలకు వేరువేరుగా ఉత్తమ విద్యకొరకు సివోఈలను స్థాపించడం జరిగింది.

రాష్ట్రస్థాయి అడ్మిషన్ విధానము ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి ఎంపికగా ఈకరీంనగర్ ఉండేది.

కానీ మేనేజ్మెంట్ అనాలోచిత కారణంగా మల్టీ జోన్ వన్ నందు బాలురకు నేడు సివోఈ విద్యా విధానము దూరమైనది.

గౌలిదొడ్డిలో బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా కళాశాలలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా, కరీంనగర్లో వేరువేరుగా పెట్టినట్లయితే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది మీరు గమనించిన సమస్యలకు పరిష్కారం దొరికినట్లై అందరికీ న్యాయం జరుగుతుంది.

కరీంనగర్ లోని చింతకుంటను బాలికల కోసం మరియు ప్రస్తుత సివోఈ కరీంనగర్ నీ బాలుర కోసము నడిపినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అల్గునూర్ సివోఈ అలానే కోనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రిన్సిపాల్ డా.బి.సంతోష్ డమార్

పరకాల నేటిధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే నాణ్యమని విద్యాబోదన అందుతుందని పరకాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సంతోష్ కుమార్ అన్నారు.అపార అనుభవం మరియు సెట్,నెట్,పిహెచ్డి పిడిఎఫ్ లాంటి విద్యా అర్హలు కలిగిన అజ్ఞ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే ఉంటారనే విషయాన్ని గమనించాలని చెప్పారు.దోస్త్ మొదటి ప్రక్రియ ఈ నెల 21 వతేదీతో ముగుస్తుండని ఇంటర్,డిప్లమ పూర్తి చేసిన విద్యార్థిని,విద్యార్థులు పరకాల మరియు పరిసర గ్రామలలోని వారు దోస్త్ కేంద్రంను సంప్రదించి అడ్మిషన్ పొందాలని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.వివరాలకు కళాశాల దోస్తీ కోఆర్డినేటక్ డా.మల్లయ్య చరిత్ర అధ్యాపకులు,పోస్తే టెక్నికల్ అసిస్టెంట్,కంప్యూటర్ అధ్యాపకులు డాక్టర్.దుప్పటి సంజయ్ కుమార్ లని సంప్రదించాలని తెలిపారు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు *పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పై సోమవారం సంబంధిత అధికారులతో మినీ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో మే, 22 నుంచి మే 29, 2025 వరకు ఇంటర్ తియరీ పరీక్షలు,జూన్ 03 నుండి 12 వరకు (ప్రాక్టికల్) ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని, మొదటి సం.2385 రొండవ సం.1478 మొత్తం 3863 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేయుటకు పోలిస్ స్టేషనలో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని,పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.

జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని, జిల్లాలోని రెవెన్యూ శాఖ నుండి పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని , 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరి అయిన విదంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చేపట్టాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.

అదనపు ఎస్పీ చంద్రయ్య ,ఆర్డీవోలు రాధాబాయి వెంకటేశ్వరావు,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , విద్యా, వైద్య,ఫైర్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు
ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి.

మరిపెడ నూతన తాసిల్దారుగా కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నూతన తాసిల్దారుగా కృష్ణవేణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన సైదులు ఖమ్మం జిల్లా కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రైతుల భూముల కు సంబంధించిన విషయాలు మరియు రెవిన్యూ కు సంబంధించిన విషయాలు ఇతర సమస్యల గురించి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ భూములను కాపాడండి.

ప్రభుత్వ భూములను కాపాడండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం సమర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రి మండలం లో మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి పై అధికారులకు, వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటేశ్వర్లు..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే
బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ
యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి.

సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య గారి 40 వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ పుర ప్రముఖులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్ గా నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య,14 ఏళ్ల వయసులోనే గాంధీ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగిందన్నారు. 1913లో మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగిందన్నారు. 1952లో పార్లమెంట్ సభ్యుడిగా, 1956లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొంది అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య అని తెలిపారు. పార్లమెంటుకు ఒక సామాన్య కార్యకర్తగా సైకిల్ పై వెళ్ళిన ఘనత సుందరయ్యకె దక్కుతుందని అన్నారు. అటు రైతు సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పారా తోలడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి సుందరయ్య గారేనని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రా న్ని సుందరయ్య నగర్ గా నామకరణ చేసుకోవడం మాకు గర్వాంగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు దుబాల వెంకటేశం,బత్తుల రమేష్, సుంచు ప్రకాష్. రాపెల్లి రమేష్,గాలిపెళ్లి సురేష్, కట్ల సతీష్, బొజ్జ శ్రీనివాస్,లింగంపల్లి దేవయ్య,మార్గం లక్ష్మణ్,సూరం వినయ్,ఆడెపు సత్తయ్య,
ఆడెపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు

ఆదర్శ నేతపుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి.

ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి

 

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు

 

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..

 

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు.

పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం దగ్గర సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.

కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు.

సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారని అన్నారు.

సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.

స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.

సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు.

తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుందరయ్య ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడన్నారు.

నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం.

ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లులో ముఖ్యులు సుందరయ్య అని ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడని అన్నారు.

భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమనేత అని చెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.

పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.

పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారని, పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు.

ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు.

చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కంది కొండ రాజు బేంబెలి మలహల్ రావు, కలకోట అనిల్, ఎండీ ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,రుద్రరపు లక్ష్మి నాయకులు జగన్నాధం కార్తీక్, గణిపాక ఇంద్ర,యాక లక్ష్మి, ఎల్లయ్య, సంతోష్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ గాజుల బాలకిష్టయ్య మనవరాలు లక్ష్మి (రమ్యశ్రీ )-భగత్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాలోన్నారు.

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.

విజయవంతమైన 19వ వార్షిక మహాసభ..

10 వ సారి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం 19 వార్షిక మహాసభ సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. 2024 జనవరి నుండి 2025 మార్చి నెల వరకు సంఘంలో జరిగిన లావాదేవీలు,ఆస్తుల వివరాల పట్ల నివేదిక రూపంలో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టారు. పొదుపు సంఘంలో నిర్వహిస్తున్న వివిధ ఖాతాల పట్ల మహాసభలో చర్చించి సంఘం అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలతో చర్చించుకున్నారు.

cooperation

2025 మార్చి నెల వరకు 410 మంది సభ్యులతో రూ. 60 లక్షల 76 వేల 567 నిధులు ఉన్నట్లు గణకుడు ఏడెల్లి మహేందర్ రెడ్డి తెలియజేశారు.ముఖ్య అతిథులుగా హాజరైన సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ సంఘం సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సభ్యుల ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల కుమారస్వామి పేర్కొన్నారు. ఉత్తమ సంఘ సభ్యునిగా ఎన్నికైన వరంగంటి ప్రవీణ్ రెడ్డి, ఉత్తమ పాలకవర్గ సభ్యులు భాషబోయిన రాజు, ఉప్పుల రాజు, బానోతు రమేష్,కందుల శ్రీనివాస్ గౌడ్ లకు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

2025 – 26 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం ఎన్నికల నిర్వహించగా సంఘం అధ్యక్షులుగా కందుల శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా వడ్డేపల్లి మృత్యుంజయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ప్రకటించారు.

cooperation

అధ్యక్షుడిగా 10వ సారి ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..

చంద్రయ్యపల్లి గ్రామంలో సహకార వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్ర పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులుగా వరుసగా పదవసారి ఎన్నికయ్యారు. తన ఎన్నిక పట్ల మరింత బాధ్యత పెరిగిందని అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, భాషబోయిన రాజు, పాక రాజయ్య, సలపాల ప్రభాకర్, భాషబోయిన చరణ్ రాజ్,మామిడి ఐలయ్య,ఉప్పుల రాజు,బానోతు సాంబయ్య,అజ్మీర జితేందర్, సయ్యద్ బషీర్ తోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం కాంగ్రెస్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి తెలిపారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి* నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు చిట్యాల మండల కేంద్రం కార్యకర్తలు నాయకులు జిల్లా, మండల నాయకత్వం సమావేశంలోచిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్* ఏకగ్రీవంగా రెండోసారి జరిగింది. ఈ సందర్భంగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా ఎన్నిక కుసహకరించిన ఎమ్మెల్యేకు జిల్లా నాయకులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల టౌన్ ఎంపీటీసీ లా పరిధి ఇంచార్జ్ లు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు జయశంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలకల రాయకుమురు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు చిలుములరాజమౌళి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తిరెడ్డి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని బిజెపి నాయకులు సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూత న వధూవరులను ఆశీర్వదిం చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందు పట్ల కీర్తి రెడ్డి నూతన దంపతు లను అక్షింతలు వేసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు చదువు రామచంద్రా రెడ్డి మండల అధ్యక్షులు నర హరి శెట్టి రామకృష్ణ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ కానుగుల నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు సుధాకర్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ బిల్లా రాజ్ కుమార్ దేశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి.

జువ్వెంతుల లక్ష్మారెడ్డి కుటుంబనికి
సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం పరామర్శ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘము సంయుక్త కార్యదర్శి బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన జువ్వెంతుల లక్ష్మారెడ్డి ఈరోజు గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి జిల్లా రెడ్డి సంఘము తరపున దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితో పాటుగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంత రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి రామన్నపేట మాజీ సర్పంచ్ కమటం అంజిరెడ్డి,రెడ్డి సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏమి రెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. nimz జి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఝరసంగం మండలంలోని కేంద్రీయ విద్యాలయం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆల్గల్ రోడ్డు, బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version