కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న.

*కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సంజయ్ మల్లాపూర్

మే 22 నేటి ధాత్రి

 

:- గెలిచిన మొదటి పర్యటనలో మార్నింగ్ వాక్ చేసి కాలనీ సమస్యలు తెలుసుకున్న సంజయ్.
ఇచ్చిన మాట ప్రకారం కాలనీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సంజయ్.
మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల విలువగల సిసి రోడ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి. దీనిని స్తానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారము పరిశీలించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నూతనంగా గెలుపొందిన తర్వాత మార్నింగ్ వాక్ లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో మొదట మార్నింగ్ ప్రారంభించి కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు, ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే మంజూరు చేసారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్న లేకున్నా ప్రజల సమస్యలే ఎజెండగా కల్వకుంట్ల సంజయ్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ తనదైన శైలిలో ప్రజల బాగోగులు సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏమి అవసరమో అవి గుర్తించి సమస్యలను పరిష్కరించడమే ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యమని అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని ప్రజల సమస్యని ప్రధాన ఎజెండగా ప్రజల్లో నిత్యం తిరుగుతూ సమస్యల పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు లింగస్వామి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, నాయకులు బద్దినపల్లి ప్రేమ్, డబ్బా రమేష్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, కోడూరి బిక్షపతి, నల్ల రాజేశ్వర్, దళిత రాజు, బిట్టు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయములో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలి ఎమ్మెల్యే చెప్పారు

మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఒక్క బస్తకు రెండు మూడు కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి

గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు

మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నడు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి సెంటర్ల లో ఉన్న వరి ధాన్యాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ధర్మ సమాజ్ పార్టీ గణపురం మండలాధ్యక్షుడు కుర్రి స్వామినాదన్ గార్లు పరిశీలించడం జరిగింది రైతులకు శాశ్వతమైన సిమెంట్ కల్లాలు లేక అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి రైతులు బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో పంట దిగుబడి నీ దృష్టిలో పెట్టుకొని మూడు నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి కాంక్రీట్ సీసీ కల్లాలను నిర్మాణం చేయాలి వేలకోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు కల్లాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఇలానే చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో రైతులందరూ రోడ్లమీద వడ్లు ఎండ పో సుకోవలసిన పరిస్థితి వస్తుంది ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయంలో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలని ఎమ్మెల్యే చెప్పారు మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఒక బస్థకు 2,3 కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి ఇది వాస్తవం గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నాడు అయినా దీన్ని ప్రజా పాలన అంటున్నారు ప్రజలను దోపిడీ చేసే పాలన ప్రజాపాలన ఎట్లా అవుతుంది వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి. అలాగే అధికారాన్ని అండగా చేసుకొని బుర్రకాయల గూడెం నగరంపల్లి గ్రామాల్లో జరిగిన అవకతవకలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం.

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం

 

 

అల్గునూర్ సివోఈ నుండి బాయ్స్ హాస్టల్ పిల్లలను వేరే హాస్టల్ కు తరలించవద్దు -మచ్చ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

 

2007 సంవత్సరంలో ఉత్తర తెలంగాణ విద్యార్థుల కొరకు అత్యుత్తమ విద్యను ఐఐటి మరియు నీట్ పరీక్షల గూర్చి ఆనాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామంలో స్థాపించటం జరిగిందని, గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కోఎడ్యుకేషన్ విధానంలో ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు స్థాపించి ఎన్నో ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరిగింది.

కారణాలేవైనప్పటికీ నేడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ , కోఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్న ఈకళాశాలను కేవలము బాలికలకు మాత్రమే పరిమితం చేస్తూ బాలురకు ఉత్తమ విద్యా విధానాన్ని దూరం చేస్తున్న వైనం కుట్రతో కూడుకున్నదని భావించక తప్పడం లేదు.

ఏకారణం చేతనో ఉత్తర తెలంగాణ బాలురకు ప్రీమియర్ సివోఈ పాఠశాలను దూరం చేస్తూ ఈప్రాంతపు వారికి తీరని అన్యాయము చేస్తున్నారు.

గౌలిదొడ్డిలో మల్టీజోన్ రెండు నందు బాలురకి మరియు బాలికలకు వేరువేరుగా ఉత్తమ విద్యకొరకు సివోఈలను స్థాపించడం జరిగింది.

రాష్ట్రస్థాయి అడ్మిషన్ విధానము ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి ఎంపికగా ఈకరీంనగర్ ఉండేది.

కానీ మేనేజ్మెంట్ అనాలోచిత కారణంగా మల్టీ జోన్ వన్ నందు బాలురకు నేడు సివోఈ విద్యా విధానము దూరమైనది.

గౌలిదొడ్డిలో బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా కళాశాలలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా, కరీంనగర్లో వేరువేరుగా పెట్టినట్లయితే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది మీరు గమనించిన సమస్యలకు పరిష్కారం దొరికినట్లై అందరికీ న్యాయం జరుగుతుంది.

కరీంనగర్ లోని చింతకుంటను బాలికల కోసం మరియు ప్రస్తుత సివోఈ కరీంనగర్ నీ బాలుర కోసము నడిపినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అల్గునూర్ సివోఈ అలానే కోనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version