వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయములో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలి ఎమ్మెల్యే చెప్పారు

మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఒక్క బస్తకు రెండు మూడు కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి

గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు

మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నడు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి సెంటర్ల లో ఉన్న వరి ధాన్యాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ధర్మ సమాజ్ పార్టీ గణపురం మండలాధ్యక్షుడు కుర్రి స్వామినాదన్ గార్లు పరిశీలించడం జరిగింది రైతులకు శాశ్వతమైన సిమెంట్ కల్లాలు లేక అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి రైతులు బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో పంట దిగుబడి నీ దృష్టిలో పెట్టుకొని మూడు నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి కాంక్రీట్ సీసీ కల్లాలను నిర్మాణం చేయాలి వేలకోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు కల్లాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఇలానే చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో రైతులందరూ రోడ్లమీద వడ్లు ఎండ పో సుకోవలసిన పరిస్థితి వస్తుంది ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయంలో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలని ఎమ్మెల్యే చెప్పారు మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఒక బస్థకు 2,3 కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి ఇది వాస్తవం గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నాడు అయినా దీన్ని ప్రజా పాలన అంటున్నారు ప్రజలను దోపిడీ చేసే పాలన ప్రజాపాలన ఎట్లా అవుతుంది వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి. అలాగే అధికారాన్ని అండగా చేసుకొని బుర్రకాయల గూడెం నగరంపల్లి గ్రామాల్లో జరిగిన అవకతవకలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో గురువారము సాయంత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని ఝరాసంగం, కుప్ప నగర్ సిద్ధాపూర్ బొప్పనపల్లి, తదితర గ్రామాలలో మోస్తారు. వర్షం కురిసింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version