సుందరయ్య నగర్ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య గారి 40 వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ పుర ప్రముఖులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు లీడర్ గా నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఒకరైన మహోన్నతమైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య,14 ఏళ్ల వయసులోనే గాంధీ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఉప్పు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగిందన్నారు. 1913లో మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగిందన్నారు. 1952లో పార్లమెంట్ సభ్యుడిగా, 1956లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొంది అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్య అని తెలిపారు. పార్లమెంటుకు ఒక సామాన్య కార్యకర్తగా సైకిల్ పై వెళ్ళిన ఘనత సుందరయ్యకె దక్కుతుందని అన్నారు. అటు రైతు సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పారా తోలడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి సుందరయ్య గారేనని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రా న్ని సుందరయ్య నగర్ గా నామకరణ చేసుకోవడం మాకు గర్వాంగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు దుబాల వెంకటేశం,బత్తుల రమేష్, సుంచు ప్రకాష్. రాపెల్లి రమేష్,గాలిపెళ్లి సురేష్, కట్ల సతీష్, బొజ్జ శ్రీనివాస్,లింగంపల్లి దేవయ్య,మార్గం లక్ష్మణ్,సూరం వినయ్,ఆడెపు సత్తయ్య,
ఆడెపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు