ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం..

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నేల 23 వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ మాహకాళి దేవాలయం 26 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న తెలిపారు.
మహంకాళి దేవలయము 26 వార్షికోత్సవం సందర్బంగా ఈ నేల 22 మంగళవారం బోనాలు, రంగము, 23 వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి బలిపూజ, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనేల 23 తేదీ నాటికి శ్రీ మహంకాళి దేవలయం స్థాపించి 25 సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు. 26 వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారకి బోనాలు, రంగము, అభిషేకం, భక్తీ గీతా ఆలపనాలు, భజనలు, వివిధ రకలైన సంస్కృత కార్యక్రమాలు అతివైభవంగా జరుప నిశ్చయించినట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంత భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని తన, మన, ధనములతో సేవచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మకాళి మాత కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఆలయ చరిత్ర:-

మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వము బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి జహీరాబాద్ పట్టణం మీదుగా కర్నాటక, మాహరాష్ట్రలకు రైల్వే లైన్ ఎర్పాటు చేశారు. ఆ సందర్భంలో జహీరాబాద్ పట్టణంలో రైల్వే లైన్ నిర్మాణం కోనసాగుతుండగా శ్రీ మహంకాళి ఆలయం వద్దకు రాగనే అట్టి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకు సాగలేదు. అప్పట్లో ఓ పూజరి అక్కడికి‌ వచ్చి మొగుడంపల్లి చౌరస్తా వద్ద శ్రీ మహంకాళి ఆలయం నిర్మించాలని ఇక్కడ అమ్మవారి నివాస స్థాలమని రైల్వే ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూజరి ఆదేశం మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం సమీపంలో నుండి రైల్వే లైన్ పనులు కోనసాగించి పూర్తి చేశారు. 25 సంవత్సరాల క్రితం జహీరాబాద్ పట్టణం గడి మాహీలకు చేందిన ప్రదాన అర్చకులు రాజన్న జహీరాబాద్ పట్టణ పెద్దలు శ్యాం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుబాష్, జహీరాబాద్ మాజీ ఎంపిపి అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరుల సహయ సకారలతో శ్రీ మహంకాళి మాత ఆలయని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయనికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరడంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నాటక, మాహరాష్ట్రల నుండి భక్తులు తరలి వచ్చి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల 65 వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సహయ సహకారలతో దిన దనానికి మహంకాళి ఆలయం అభివృద్ది చేందుతు వస్తుంది..

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి,పీడీఎస్యు, జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని,గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్,పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు రవి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్,నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

◆ వంద కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి.

◆ తీరనున్న వాహనదారుల వెయిటింగ్ కష్టాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టణ పురపాలక సంఘ పరిధిలో ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్… రయ్.. మంటూ పరుగులు పెట్ట నున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి న్యాల్కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మిం చిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఈనెల 23న ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారం భించేందుకు వీలుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, ఇందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు.

ఏడేళ్లకు మోక్షం

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన ఏడు సంవత్సరాలకు పూర్తి చేశారు. ప్రయాణికుల కష్టా లను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నిధులు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణం పనులు 2018 ఆగస్టు 30న చేప ట్టారు. ఆర్అండ్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణం పనులు
చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికిం ద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. పట్టణ ప్రజలతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణి కులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి.

బ్రిడ్జిపై ఎల్ ఈడీ లైట్ల వెలుగులు

రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎస్ఈడీ విద్యుత్ దీపాలను బిగించారు. కిలో మీటరు పొడువునా బిగించిన లైట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డుపై కూడా వెలుతురు ఉండేలా బిగిం చారు. బ్రిడ్జికిరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి దిగువన మొగుడంపల్లి క్రాస్ రోడ్డు నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలను బిగించారు.

దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలి

నూతనంగా ప్రారంభించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలని జహీరాబాద్ ప్రజలందరూ ప్రభుత్వానికి వ డిమాండ్ చేసారు. జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు ప్రజలు అధిక శాతంలో ఉన్నారని, జాతి కుల వర్ణ బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కలగాలని ఆకాంక్షించిన వ్యక్తి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టడమే సమంజసం అని జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. nimz జి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఝరసంగం మండలంలోని కేంద్రీయ విద్యాలయం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆల్గల్ రోడ్డు, బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version