ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు *పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పై సోమవారం సంబంధిత అధికారులతో మినీ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో మే, 22 నుంచి మే 29, 2025 వరకు ఇంటర్ తియరీ పరీక్షలు,జూన్ 03 నుండి 12 వరకు (ప్రాక్టికల్) ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని, మొదటి సం.2385 రొండవ సం.1478 మొత్తం 3863 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేయుటకు పోలిస్ స్టేషనలో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని,పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.

జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని, జిల్లాలోని రెవెన్యూ శాఖ నుండి పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని , 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరి అయిన విదంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చేపట్టాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.

అదనపు ఎస్పీ చంద్రయ్య ,ఆర్డీవోలు రాధాబాయి వెంకటేశ్వరావు,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , విద్యా, వైద్య,ఫైర్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు
ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version