జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం
నిజాంపేట, నేటి ధాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా ,హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ ప్రింటింగ్ మరియు ప్యాకేజ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. భారత రాష్ట్రపతి మరియు హర్యానా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా గోషిక వెంకటేష్ మాట్లాడుతూ , హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని తన కృషికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మొదట డిప్లొమా, జి జె యు నుండి బి. టెక్ , ఎం. టెక్ చేసాను. దీని తరువాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసాను మరియు కొన్ని సంవత్సరాల తరువాత – నాకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నా డిగ్రీ మరియు పతకాన్ని స్వీకరించడానికి జి జె యు హిసార్ హర్యానాకు పిలువబడిందన్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు
జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల సమస్యలను ఎమ్మెల్సీ అంజిరెడ్డికి దృష్టికి బుధవారం తీసుకువచ్చారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలపై కక్షపూరిత దోరణి వుందని, వెంటనే ఫీజు రీయింబర్స్ చెల్లించేలా కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్సీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి వెంటనే రియంబర్స్ మెంట్ వచ్చేలా కృషి చేస్తా అని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
TPCC President Mahesh Kumar Goud.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ కార్యక్రమం లో మండల యువ నాయకులు అశ్విని పాటిల్ ఉన్నారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామయంపేట మండల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు ఆర్థిక సాయం అందజేశారు. భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి కాంటా రెడ్డి తిరుపతిరెడ్డి రూ.5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ మైస గౌడు, బాలయ్య, మల్లేశం,విజయభాస్కర్ రెడ్డి, కాట్రాల బిక్షపతి, రాజేందర్ గుప్త, మాజీ ఉపసర్పంచ్ స్రవంతి రాజేందర్, బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే నత్త నడకగా సాగుతున్న రోడ్డు పనులు: సిపిఎం జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : కొరటికల్,శిర్దపల్లి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ రోడ్డు పనులు నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంచండూరు మండల పరిధిలోని శిర్దపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోడ్డును రెండుసార్లు శంకుస్థాపన చేసి రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయకపోవడంతోప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యఉందని, ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ ఆవేదనను సిపిఎం నాయకులకువెలిబుచ్చారు. గతంలో ఈ గ్రామానికి బస్సు వచ్చేదని, కరోనా కారణంగా ఆర్టీసీ బస్సు బంద్ చేశారని గ్రామ ప్రజలు సర్వే బృందానికి తెలియజేశారని ఆయన అన్నారు. ఉదయంనల్లగొండ నుండివయా గూడపూర్,కొరటికల్,శిర్దపల్లికి ఉదయం 8 గంటలకు చేరుకునే విధంగాచండూరుకు,అదేవిధంగాచండూరు నుండి శిర్దపల్లి, కొరటికల్, గూడపూర్, నల్లగొండకు పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైనసోలిపురం,తాస్కానిగూడెం,బోడంగిపర్తి, దుబ్బకాల్వ, ఈ గ్రామాలకు బీటీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.ఈ గ్రామంలో సుమారుగాపింఛన్ల కోసం60 మంది, రేషన్ కార్డుల కోసం120 మంది, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120 మందిదరఖాస్తు చేసుకున్నట్లు,ఇందులో భూమిలేనినిరుపేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అదే విధంగా చొరవ తీసుకోవాలనిఆయన అన్నారు.ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమం కు మంచి స్పందన వస్తుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొరటికల్,శిర్దపల్లి, తాస్కాని గూడెం రోడ్డు మరమ్మతు పనులుత్వరగా పూర్తి చేయాలని,అదేవిధంగా ప్రజలు ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ,సిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,ఈరటి వెంకటయ్య,బల్లెం స్వామి, గ్రామ ప్రజలురామ్ రెడ్డి, చంద్రారెడ్డి,లింగస్వామి,రామస్వామి,నిర్మల,అశ్విని తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో ఆది జగద్గురు రేణుక చార్యుల జయంతి సందర్భంగా శ్రీ రేవణసిద్దేశ్వర దేవాలయంలో ఉదయం ధ్వజారోహణం గణపతి పూజ స్వస్తి పుణ్యా వచనము శ్రీ రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము బిల్వార్చన పూజ మహా మంగళహారతి నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాతృశ్రీ మఠం శివలీలమ్మ రాచయ్య స్వామి మరియు తాజా మాజీ సర్పంచ్ బసవరాజ్ పటేల్ నాగేష్ పాటిల్ నాగరాజ్ పటేల్ లింగం గౌడ్ పండరినాథ్ రాజేశ్వర్ నవీన్ కుమార్ వెంకట సాయి సమస్త భక్తులు పాల్గొన్నారు. మరియు వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది పడకుండా అన్నదాన నీటి సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని కార్యక్రమలు నిర్వహించడం జరిగింది.
స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.
#బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వనికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి పడుతుంది.
#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.
Activists should work with the aim of winning local elections.
నల్లబెల్లి , నేటి ధాత్రి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 66 మోసాలతో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళాదిస్తూన్నా ప్రభుత్వనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.గత 2 నెలల క్రితం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేడు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ఇండ్ల కోసం ముగ్గులు పోసి ప్రజలను మోసం చేస్తున్నా ప్రభుత్వనికి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పి బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.పార్టీలో చేరిన వారు దొమ్మటి శ్రీను గౌడ్, బచ్చాలు, బత్తినీ మల్లికార్జున గౌడ్, కుమారస్వామి గౌడ్ , కక్కెర్ల సమ్మయ్య గౌడ్ , ఈరగోని లింగయ్య చేరారు కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరి చిరంజీవి,బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి , నాయకులు వల్లే పార్వతలు , పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి ) ,ధర్మారం క్రాంతికుమార్ ,బోట్ల ప్రతాప్ ,పులి రజినీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్
జహీరాబాద్. నేటి ధాత్రి:
తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్ రూరల్ పోలీసులు ఇంటి వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి పదమూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు .
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
పాత బాగ్దాద్ మసీదులో తరావీహ్లో ఖురాన్ పూర్తి చేసినందుకు ఇమామ్ మరియు ముజ్జిన్లకు అభినందనలు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నగరంలోని పురాతన మరియు చారిత్రాత్మకమైన బాగ్దాదీ మసీదులో, హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ మందిరం లోపల ఉన్న తరావీహ్ ప్రార్థనల సమయంలో ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ ప్రతిరోజూ మూడు అధ్యాయాలను పఠిస్తూ మొత్తం ఖురాన్ షరీఫ్ను పఠించే అధికారాన్ని పొందారు. హజ్రత్ సయ్యద్ షా అజీజుద్దీన్ ఖాద్రీ సాహిబ్ ఖిబ్లా మరియు సయ్యద్ షా హుస్సాముద్దీన్ ఖాద్రీ ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్, హఫీజ్ ముహమ్మద్ షకీల్ నూరి మరియు బాగ్దాదీ మసీదు డిప్యూటీ ముజ్జిన్ ముహమ్మద్ ఖైరుద్దీన్ లపై పూల వర్షం కురిపించి, వారికి అభినందనలు మరియు నైవేద్యాలను అందించారు. ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ పవిత్ర ఖురాన్ పారాయణంతో అభినందన కార్యక్రమం ప్రారంభమైంది. రిటైర్డ్ ఏఎస్ఐ ముహమ్మద్ జిలానీ నాత్ షరీఫ్ పారాయణం చేశారు. మసీదులో సింహరాశి కూడా పంపిణీ చేయబడింది. ఇది షామ్ జహీరాబాద్లోని ఒక పెద్ద మరియు ప్రత్యేకమైన మసీదు అని గమనించాలి, ఇక్కడ మసీదులోని ఎక్కువ మంది ఆరాధకులు ఉంటారు మరియు తరావీహ్ ప్రార్థనల సమయంలో వెయ్యి మందికి పైగా ఆరాధకులు వినయం మరియు భక్తితో పవిత్ర ఖురాన్ వింటారు. మరియు రంజాన్ మాసంలో, తరావీహ్ సమయంలో ఖురాన్ యొక్క మూడు పారాయణలు ఏర్పాటు చేయబడతాయి. ఈ సత్కార కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఓం, ఖతీబ్ ఈద్గా మరియు హఫీజ్ ముబిన్ అహ్మద్ ఖాస్మి, ముహమ్మద్ మోర్, మియా సికందర్ ఆసిద్ షకీర్, ఉస్తాద్ ముహమ్మద్ హషీం, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ రిషాద్ డానిష్ హుస్సేన్ రఫీక్ అన్సారీ, ఆరిఫ్ టోరి ముహమ్మద్ బాబా నిష్, ముహమ్మద్ అజీమ్ బారిల్, షానవాజ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ మరియు మసీదు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శకత్వ బాధ్యతలను సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నిర్వర్తించారు.
వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు
పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు
కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు
అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం
ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి
పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా యంత్రాంగానికి అంతటి ప్రాధాన్యత. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన వివిధ రకాల సేవలు ఈ యంత్రాంగం ద్వారానే జరుగుతాయి. అధికారంలో వున్న పార్టీ తన హామీలను సక్రమంగా అమలు చేయడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేది ఈ ప్రభుత్వ అధికారులే! మరోమాట లో చెప్పాలంటే ప్రజాసేవలో అధికార్లది అత్యంత కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రభుత్వం తన పాలనా శైలిని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేది ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేసేది అధికార యంత్రాంగమే. ఇంతటి కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నందువల్లనే అడుగడుగునా అవినీతికి ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించేది,అధికారపార్టీని అప్రతిష్టపాలు చేసేది కూడా ఈ అవినీతి మాత్రమే! ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు రిటైరయ్యే వరకు తమ తమ స్థానాల్లో కొనసాగుతారు. అదే ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే! అందువల్ల పాలనలోని ప్రతి అంశాన్ని మంత్రులకు వివరించడం ద్వారా, సదరు పార్టీ తన హామీలను చట్టబద్ధమైన రీతిలో అమలు చేసేలా సలహాలు ఇచ్చి దిక్సూచిగా వ్యవహరించేది ఉన్నతాధికార్లు.
ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషించే పాలనా యంత్రాంగంలోకి అవినీతి వేరుపురుగు ప్రవేశిస్తే, సర్వం భ్రష్టమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి కుప్ప కూలే అవకాశముంది. అందువల్ల ఈ పాలనా యంత్రాంగం ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలో, ని బంధనల మేరకు పనిచేయించగలిగే ఫ్రేమ్వర్క్ ఒకటి రూపొందించబడి వుంటుంది. కానీ అవినీతి పెచ్చరిల్లినప్పుడు, ఈ ఫ్రేమ్వర్క్ పనిచేయడంలేదు. ప్రభుత్వాలు మారేకొద్దీ ఈ అధికార యంత్రాంగంలో చాలామంది బలంగా వేళ్లూనుకుపోయి, అవినీతి మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడటం వర్తమాన చరిత్ర. ఇది రానురాను మరింత వికృతరూపం దాలుస్తున్నట్టు తెలంగాణలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యంగా దిగువస్థాయి అధికార్లు ఏదశకు చేరుకున్నారంటే, అవసరమైతే తమ అక్రమ సంపాదన దన్నుతో మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేయించి, వారి పదవులకే ఎసరుపెట్టే స్థాయికి ఎదగడం వర్తమాన వైచిత్రి!
ప్రజాసంబంధాలకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొందరు నిజాయతీ పరులైన అధికార్లు లేకపోలేదు. కానీ వీరిశాతం చాలా తక్కువ. అవినీతి అధికార్లు సంపాదన ఎక్కువగా ఉండే పోస్టులకు వెళ్లడానికి అవసరమైనంత చెల్లించడానికిఎంతమాత్రం సంకోచించడంలేదు. రానురాను ఇదొక వేలంపాటగా మారిపోయింది. అంటే ఉ ద్యోగులే తమకు కావలసిన పోస్టులకోసం పై అధికార్లకు పెద్దమొత్తాల్లో లంచాలు సమర్పించుకొని ఆ పోస్టులో నియామకమైతే, ప్రజలను ఏ స్థాయిలో పీడిరచుకు తింటారో అర్థం చేసుకోవ చ్చు. ఒకప్పుడు లంచం అంటే చాటుమాటుగా, భయంగా తీసుకునే పద్ధతికి ఎనాడో కాలం చె ల్లింది. ఇప్పుడంతా బహిరంగమే. ఒక్కొక్క పనికి ఇంత మొత్తం అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పై అధికార్లకు అప్పటికే నజనారానాలు చెల్లించి పోస్టులోకి రావడంవల్ల ఎవ రూ అడగరనే ధైర్యం పెరిగిపోయింది. తాము లంచంగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు లాభార్జన వసూళ్ల రూపంలో సంపాదించాలన్న యావ బాగా ముదిరింది. ఈ కారణంగానే కొన్ని శాఖల్లో దిగువస్థాయి ఉద్యోగుల ఆస్తులు వందలకోట్లకు చేరుతున్నాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అధికార్లకు పట్టుబడినా వీరిలో భయం ఏకోశానా కనిపించంలేదు. తాము సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చుచేసి కేసులనుంచి బయటపడి తిరిగి పోస్టుల్లో చేరుతున్నారు. ఎ.సి.బి.కి రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఉద్యోగులు కోర్టుకెళ్లి ఏదోరకంగా తిరిగి తమ పోస్టుల్లో కొనసాగుతున్నారు.
ఇటీవల ఎ.సి.బి.కి పట్టుబడిన అధికార్లు తమపై కేసులు నిరూపణ అయ్యే వరకు పోస్టుల్లోనే కొనసాగించాలని, నేరం నిరూపణ అయితే అప్పుడే కఠిన శిక్ష విధించవచ్చునని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం వారిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈవిధంగా పట్టుబడి సస్పెండ్ అయిన అధి కార్లను, కేసు పూర్తయ్యేవరకు పోస్టులోకి తీసుకోదు. కానీ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సదరుశాఖ మంత్రివద్దకు తీసుకెళ్లి, తమకు తిరిగి పోస్టుల్లోకి తీసుకోవాలని ఇటీవల అటువంటి అధికార్లు సంబంధిత శాఖ మంత్రివద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు మం త్రి ససేమిరా అనడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో మంత్రి నిజాయతీగా పనిచేయమంటూ హితోక్తులు పలకడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు లం చాల రూపంలో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్న ఈ అధికార్లకు ఇప్పుడు కేవలం జీతం రాళ్లతోనే బతకాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. తప్పుడు మార్గాల్లో వచ్చే అధికాదాయంద్వారా విలాసాలకు, ఆస్తులు సమకూర్చుకోవడానికి అలవాటుపడిన అధికార్లు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా వున్నారు. విచిత్రమేమంటే సదరు మంత్రివర్యులు, ఈ అధికార్ల అవినీతిబాగోతంపై ఒక పత్రికలో వచ్చిన వార్తలను చూపించి, నిజాయతీగా పనిచేసుకోవాలని కోరడం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
వెంటనే వారు తమకు అనుకూల మీడియా వ్యక్తుల వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరిస్తే, యూనియన్ నేతల వద్దకు వెళ్లి సదరు వార్తలను ఖండిరచమని కోరమని సలహా ఇవ్వడంతో వారు అదేవిధంగా తమ యూనియన్ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇక వార్తలు రాసిన పత్రిక విలేకర్లు త మను రూ.20లక్షలు డిమాండ్ చేయగా తాము అంగీకరించకపోవడంతో, తప్పుడు వార్తలు రాసినట్టు ఈ అధికార్లు తమకు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం, ప్రసారం చేయ డం మొదలుపెట్టారు. ఆవిధంగా తమకు అనుకూలంగా పనిచేసిన మీడియాకు కొంత ముట్టజె ప్పారు. పనిలోపనిగా ఇదే మీడియా సహాయంతో తమకు హితవు చెప్పిన మంత్రికి వ్యతిరేకంగా వార్తలను వండటం మొదలుపెట్టారు. ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడటమే కాకుండా, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ అధికార్లు తాము సంపాదించిన పాపపు సొమ్ముతో, మంత్రులనే ఏకంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారంటే వారి ఆర్థిక మూలాలు ఎంత బలంగా వున్నాయో అర్థమవుతుంది.
అవినీతి సంపాదన ఒకస్థాయి దాటిన తర్వాత, పార్టీ టిక్కెట్లకోసం రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటనలో ఒక అధికారి ఒక ప్రముఖ పార్టీ నేత వ ద్దకు వెళ్లి తనకు పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూ, రూ.25కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చేందుకు ముందుకు రావడమే కాదు, ఎన్నికల్లో తన ఖర్చు తానే పెట్టుకుంటానని ఆఫర్ ఇచ్చాడంటే ఆయన అవినీతి సంపాదన ఏస్థాయిలో ఉన్నదో చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పటి వరంగల్ జిల్లాకుచెందిన ఒక చిన్నస్థాయి ఉద్యోగి తన కుమార్తెకు ఏకంగా రూ.5కోట్లు కట్నం చెల్లించాడంటే అవినీతి సంపాదన ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే జిల్లాకు చెందినఒక రెవెన్యూ అధికారి కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా ఇదే సమయంలో రూ.7కోట్ల విలువైన ఆయన ఆక్రమ ఆస్తులు జప్తుకు గురయ్యాయి. పెళ్లి ఆగిపోతుందని అంతా భయపడ్డారు. కానీ పిల్ల తరపువారు మాత్రం, ‘జప్తు అయింది ఏడుకోట్లే కదా! ఇంకా చాలా కోట్ల ఆస్తి వుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి సుఖపడుతుంది’ అంటూ వివాహా న్ని చక్కగా జరిపించేశారు. అవినీతి ఇస్తున్న భరోసాకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఒకరకంగా చెప్పాలంటే అవినీతి ‘చట్టబద్ధతను’ సంతరించుకున్నదనుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. రెవెన్యూశాఖలో లంచాలు మరిగిన అధికార్లు పహణీల్లో పేర్లు మార్చడానికి కూడా వెనుకాడటంలేదు. పట్టేదారు పాస్పుస్తకం కావాలంటే ఎకరానికి రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈమొత్తం మరింత ఎక్కువ వుంటోంది. రెండెకరాలున్న రైతు రెండు లక్ష లు లంచంగా ఇవ్వగలడా? కానీ తప్పడంలేదు. లంచం ఇవ్వు…సేవను పొందు అనేరీతిలో ప్ర భుత్వ సేవలు తయారయ్యాయి. దీన్నే ‘అవినీతిలో నీతి’ అని సరిపుచ్చుకోవాలో తెలియని దుస్థితి! వచ్చేకాలంలో ఈ అవినీతి మరింత జడలువిప్పి కొత్త పోకడలతో ప్రజలను ‘అలరించ’వచ్చు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు ఫీజుకు రె ట్టింపు చెల్లిస్తే తప్ప పనులు జరగడంలేదు. అంటే చెల్లించే రెట్టింపు మొత్తం అధికార్లు పంచుకోవడానికి సరిపోతోంది.
మరి ఇంతటి విచ్చలవిడి అవినీతికి అంతం పలకలేమా? అంటే ఇందుకు ఒక్కటే మార్గం! కీలక మైన ప్రజాసంబంధాల శాఖల్లో పోస్టులకు ఉద్యోగ భద్రత వుండకూడదు! చిన్న అవినీతి లేదా తప్పు జరిగినా తక్షణం ఉద్యోగం వూడుతుందన్న భయం వుండాలి. అవినీతికి సంబంధించిన వి చారణలో బాధితులు చెప్పే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాయతీ అధికార్లకు ప్రోత్సాహం, తగిన అండదండలు అందించాలి! ఉద్యోగ యూనియన్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు! యూనియన్లు గుదిబండలు తప్ప ప్రజాసేవకు పనికిరావు!
ప్రైవేటు సంస్థలు విజయవంతమవుతున్నాయంటే పై అంశాలను పాటించడమే ప్రధాన కారణం.కానీ మన వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందంటే, ఈ లంచం అనే భూతం, ఓటు వేసేదగ్గరి నుంచి మొదలై పై స్థాయి వరకు ఊడలు పాకిపోయింది. రాజకీయమే పెట్టుబడిగా మారినప్పు డు అవినీతి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజాయతీగా వుండేవాడు ఎందుకూ కొరగా కుండా పోయే రోజులివి! కానీ నిజాయతీగా వ్యవహరించే అధికార్లు ‘నిప్పు’లాగా ఎప్పుడూ వెలుగుతూనే వుంటారు. వారికి సమాజంలో వుండే గౌరవం, అవినీతి అధికార్లకు వుండదు. డబ్బు విలాసవంతమైన జీవితాన్నిస్తుంది కానీ, నైతికతతో కూడిన ప్రశాంతతను మాత్రం ఇవ్వదు! అవినీతిలో మునిగిన వారి జీవితం ‘మీటరు’ సక్రమంగా పనిచేయని ఆటో ప్రయాణం వంటిది. వేగంగా పెరుగుతూ, ఒక్కసారిగా పడిపోతుంది! ఇక లేవడం కష్టం!
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. . ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు..శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు
కల్వకుర్తి /నేటి ధాత్రి.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో వెలసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు దేవాలయంలో హుండీ లెక్కింపు ఉంటుందని.. భక్తులు, గ్రామప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు అందరూ పాల్గొనాలని కోరారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంప ల్లి గ్రామంలో రైతుల పంట పొలాలకు నీరు కోసం పోరుబాట మహా ధర్నాను నిర్వహించడం జరిగింది కచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్ట్ చేరువలో ఉన్న ఇక్కడి రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడు తున్న కనీసం కనీకరం చూపించని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో రైతులు,బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతోఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపు హౌస్ సీఈ అశోక్ కుమార్ ప్రాజెక్ట్ వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్ట్ లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన తరువాతే పైకి ధర్మసాగర్ కి నీటిని పంపిణీ చేయాలని, అలా కాదని ఇక్కడి రైతులు రైతులు కాదన్నట్టు,వారే రైతులు అన్నట్టు ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే,చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు. నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటిని విడుదల బంధు పెట్టడం వల్లే ఈ సమస్య ఏర్పడింది.మా డిమాండ్ ఒక్కటే ఇక్కడి రైతులకు సాగు, తాగు నీటిని విడుదల చేసిన తరువాత కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకొని తరువాత పైకి నీటిని పంపు చేయాలి.నీటి మట్టం పెరిగే వరకు మోటార్లు బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.
Water
రైతే రాజు అన్న బీఆర్ఎస్ పార్టీ
అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న నా తెలంగాణ రాష్ట్రాన్ని అనాలోచిత పరిపాలన అసమర్థత వల్ల, చేతకానితనం వల్ల ఈ రోజు రైతులు ఎంతో ఆందోళనతో తీవ్రమైన నిరాశ నిస్పహల మధ్య రైతులు ఉన్నారు.అందుకే ఈ రోజు రైతుల పక్షాన,ప్రజల పక్షాన చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనాలోచిత పరిపాలన అని ఎందుకు అన్నమంటే జనవరి నెలలో దాదాపు నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటి పంపిణీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన 4 నుండి 5 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం,స్పందించ కపోవడంతో అక్కడి వర్కర్స్ జీతాలు ఇవ్వకపోవడం వల్ల పంపింగ్ బంధు చేయడంతో ఈ సమస్య ఏర్పడింది. రైతులకు సంబంధించిన విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం
ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, పైనుండే పొలాలకు నీళ్లు పోతాయి ఇక్కడి పంట పొలాలు ఎండగొడితే మాత్రం ఎకరాకు రూ.50000/- ల నష్ట పరిహారం ఈ ప్రభుత్వం బేషరతుగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దీక్ష చేస్తూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ సందర్భంలో ఇక్కడికి ఇరిగేషన్ ఈఈ ఇక్కడికి వచ్చి 6 రోజుల లోపుల 15 అడుగుల నీటిమట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఒకవేళ కనుక 15 అడుగుల నీటిమట్టం రాకుండా ఇక్కడి పంట పొలాలు ఎండగోడితే మాత్రం రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం.అవసరం అయితే మేమే తాళాలు పగలగొట్టి, మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.
Water
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు పంటలు సమృద్ధిగా పండాయి
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారం రోజులకు ఒక్కసారి చలివాగు నీటిమట్టం పై అధికారులతో మాట్లాడి నీటి మట్టం తగ్గితే మోటార్లు బంధు పెట్టించి నీటి మట్టం పెరిగిన తరువాత పంపింగ్ చేయమని అధికారులకు చెప్పేది వాళ్ళు కూడా అదే విధంగా సహకరించేవారు. పర్యవేక్షణ లోపమా,నాయకత్వ లోపమా, చేతకాని తనమో తెలియదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.మాకే ఉద్దేశ్యం లేదు,రైతుల సమస్యలపై రాజకీయం చేసే అవసరం లేదు.రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చలివాగు ఆయకట్టు వెంట చిట్యాల, రేగొండ, మొగుళ్ళపల్లి, టేకుమట్ల వరకు వారి పంట పొట్ట దశలో ఉంది, అందరూ కూడా రైతులే,ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకొని చలివాగు తూము ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాం. డిబిఎం38 ద్వారా రావలసిన నీటి యొక్క వాట మాకు రావడం లేదు,పైనున్న వారే ఎక్కువ వాడుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగు తుంది. డిబిఎం 38 ద్వారా గొరికొత్తపల్లి వరకే నీళ్ళ వస్తున్నాయి.నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక్క పర్యవేక్షణ పెట్టి పోలీసు అధికారులు,మా ప్రజాప్రతినిధుల సహాయంతో చిట్యాల,టేకుమట్ల వరకు నీటిని తీసుకెళ్ళి చిన్న చిన్న చెరువులని నింపి మత్తడి స్థాయి వరకు తీసుకెళ్ళం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాయంపేట, గోరికొత్తపల్లి, రేగొండ,చిట్యాల, మొగుళ్ళపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంతకుముందు పాలమూరు యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, మేఘా రెడ్డి, కుర్వ తిరుపతయ్య, గూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు. 1947లోనే బోధన్ లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్ ప్రకటించి మూసివేసారన్నారు. దీంతో సుమారు 15 వేల ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మగారాలను అర్థంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు, వారి పిల్లల సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట చక్కర కర్మగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో రైతులతో కలిసి పార్టీలకతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్మాగారం మూతపడడంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించిన ఘనత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దక్కుతుందన్నారు. ఒకటి కోరుట్ల నియోజకవర్గంలో, మరొకటి జక్రాన్ పల్లిలో మంజూరు చేయించామని. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చక్కర కర్మగారాన్ని తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ధర్నా కార్యక్రమ కన్వీనర్, రాష్ట్ర నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, నరేష్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేపీ నాయకులు, రైతు సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, పంచిరి విజయ్, రాజ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బింగి వెంకటేష్, దొనికెల నవీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బొడ్ల నరేష్, గుగ్గిళ్ళ తుకారం గౌడ్, బొడ్ల ఆనంద్, పన్నాల రాఘవరెడ్డి, బొడ్ల గౌతమ్, జక్కుల జగదీష్, సదాశివ్, మహేష్, బొమ్మెల శంకర్, జుంగల ఆనంద్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, సుంచు రణధీర్, రాజారెడ్డి, కొయ్యల లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, చెట్లపల్లి సాగర్, కలాల సాయిచందు, ఇట్యాల నవీన్, కుడుకల రఘు, కలిగోట శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చిల్పూర్( జనగామ) నేటిధాత్రి చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు( బుధవారం) శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారిని బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ చిల్పూరు గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం శేషాద్రి నిలయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు రంగాచార్యులు, రవీందర్ శర్మ, కృష్ణమాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం సమన్వయ కమిటీ ఇంచార్జిగా బరిగెల ఏలీయా నియామకం
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-
అయినవోలు మండల్ ఎంఆర్పిఎస్. ఎంఎస్పి అనుబంధ సంగాల అధ్యక్షులు చింత అశోక్ మాదిగ, ఇసురం బాబు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొక్కల నారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా వర్గీకరణలో కమిషనర్ ఇచ్చిన రిపోర్టును సరిదిద్దుకొని ఏబిసిడిలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు మరియు ఉపకులాలకు రావలసిన వాటా జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసి అధికారికంగా వర్గీకరణ ప్రకటించాలని కోరారు. అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ను నిలిపివేసి వర్గీకరణ అయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. ఐనవోలు మండల సమన్వయ కమిటీ ఇన్చార్జి గా నందనం గ్రామానికి చెందిన బరిగల ఏలియాను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. రేపటినుండి జరిగే కార్యక్రమాలను మరియ ఉద్యమ నిర్మాణాలను విజయవంతం చేయుటకు ఈ కమిటీ పనిచేస్తుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల సీనియర్ నాయకులు బర్ల బాబు,కట్కూరి రమేష,సింగారపు చంద్రమౌళి,మరుపట్ల దేవదాస్, బరిగేల ఆరోగ్యం,ఆరూరి కుమారస్వామి, బొక్కల అనిల్ మాదిగ. మాదాసి కరుణాకర్ ఆకులపల్లి సాగర్, జలగం ఎల్ల కుమార్, ఆకులపల్లి రాజు,కట్కూరి అరుణ్ మాదిగలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన రైతు 11-03-2025 మంగళవారం రోజున శాంతినగర్ గ్రామం నుండీ మోత్కూరి సారయ్య అనునతడు తనాకొడుకు ఐనా మోత్కూరి కుమారస్వామి వయస్సు 35 సంలు అనునతడికి వివాహం జరిగి ఒక కొడుకు కూతురు సంతానం, తనకు గల 3 ఎకరాల భూమి లొ గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక పెట్టిన పెట్టుబడి ఎల్లకా చేసిన అప్పులు పెరిగి వాటిని ఎలా తీర్చాలానే బాధతో మనస్తాపం చెంది తన చేను వద్దకు పోయి మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని దరఖాస్తూ ఇవ్వగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నాము అని 2వ ఎస్సై ఈశ్వరయ్యతెలిపారు,
బస్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మాజీ కౌన్సిలర్ కొమరవెల్లి అనిత సుధాకర్ రెడ్డి
నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ 7వ వార్డు ఎస్వి నగర్ మెయిన్ రోడ్ విజయ హాస్పిటల్ గేట్ ప్రక్కన సుమారు 25 సంవత్సరాల నుండి ఉన్న బస్టాండ్ ను స్థానిక మున్సిపాలిటీ నుండి కానీ సంబంధిత ఏ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యంగా రాత్రికి రాత్రే తొలగించిన విజయ హాస్పిటల్ యాజమాన్యం ఇట్టి విషయంపై స్థానిక కాలనీ వాసుల ద్వారా సమాచారం అందుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బస్సు స్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని బస్సు స్టాండ్ ను యాద తదంగా పునర్నిర్మించాలని ముందే వేసవి కాలం కావడంతో నిలువ నీడ లేక స్కూల్ పిల్లలు,కాలేజ్ విద్యార్థులు, మహిళలు, వయో వృద్ధుల బాధలు చెప్పలేనివి అని. తక్షణమే బస్సు స్టాండ్ నిర్మించని యెడల వచ్చే ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ ప్రజలం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతామణి అలాగే సిడిఎంఏ ఉన్నతధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, వీరా రెడ్డి, పంజలా నర్సింహా గౌడ్, మర్రి కొండల్ రెడ్డి,దుడికి ప్రభు కిరణ్, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.