మనుషులపై ఆవులు దాడి చేస్తున్నది తిరుపతిలో కాదు.

మనుషులపై ఆవులు దాడి చేస్తున్నది తిరుపతిలో కాదు..

*కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 27:

మనుషులపై ఆవులు దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నది తిరుపతిలో కాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని తెలిపారు.
ఈ వీడియోపై వివరాలు సేకరించగా మహారాష్ట్ర లోని నాసిక్ లో జరిగిందని తెలిసింది. సోషల్ మీడియాలో తిరుపతి నీ ట్యాగ్ చేయడంతో ఇలా.ప్రసారం అవుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో అనునిత్యం నగరంలో తిరుగుతూ ఆవులు, కుక్కలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు..

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

గణపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం
మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలో తాడ్వాయిలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో అక్రమాoగా పైసల్ వసూలు చేస్త్తున్నట్టు ఆధారాలతో వార్తను ప్రచురించిన రిపోర్ట్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని గణపురం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు సమాజంలో బాధ్యతయుతాంగా ప్రజల పక్షనా నిరంతరంగా పనిచేస్తున్న పత్రిక విలేకరులపై దాడి చేయడం సరిఅయింది కాదని అన్నారు దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరరు.ప్రభుత్వంనికి ప్రజలకు వరదిగా వున్నా జర్నలిజంపై అందరు బాధ్యత యూతంగా ఉండాలని అన్నారు.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్

జహీరాబాద్. నేటి ధాత్రి:

తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్ రూరల్ పోలీసులు ఇంటి వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి పదమూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు .

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి..

హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్, చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version