పంచవటి సరస్వతి దేవస్థానంలో వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం

*పంచవటి సరస్వతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండలంలోని పంచవటి సరస్వతి దేవస్థానంలో జనవరి 23 నుండి 25, 2026 వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది.

జనవరి 24న స్వామివారి కళ్యాణం, 25న రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. 63 గ్రామాలకు పైగా బోనాల ఊరేగింపు, పల్లకీ సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన కృప పొందాలని కోరడం జరిగింది.

మహబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ శ్రీగోదా రంగనాథ కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు

ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్

వైభోగంగా శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

శ్రీ భూ నీలా సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలలో నేడు శ్రీగోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబాద్ శాసన సభ్యులు డా” భూక్యా మురళీనాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు వెంకన్న, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్,మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,సతీష్,దేవస్థాన ధర్మకర్తలు వోలం రాజేశ్వర్ రావు,కృష్ణమూర్తి,చిదురాల వసంతరావు,తేరాల సమ్మయ్య కళ్యాణం లో దేవస్థాన అధ్యక్షులు వోలంమురళీ కోశాధికారి కోయగూరి యాకూబ్ రెడ్డి,సెక్రటరీ బచ్చు పరమేశ్వర్ ,బాణాల నాగరాజు శ్రీరాం సంతోష్ పోకల శ్రీనివాస్,కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి,తరాల వీరేష్ యాదవ్, కత్తెరసాల శ్రీనివాస్, కాటం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం…

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. దేవాలయంలో ఉదయం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి మేల్కొలుపు పూజ, గణపతి పూజ, రుద్రాభిషేకము, అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, మహా మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు అమృత గుండాల్లో స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించారు.

శివపార్వతులకు ప్రత్యేక రుద్రేభిషేకాలు నిర్వహించి ముడుపులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు. కొందరు మహిళలు గండ దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ ఏ చంద్రశేఖర్ శివరుద్రప్ప కార్యనిర్వహణాధికారి

 

అర్చక బృందం పూర్తి ఏర్పాట్లు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం సౌకర్యం సైతం ఏర్పాటు చేశారు.శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం లో ఝరాసంగం మాజీ జడ్పీ చైర్మన్ సునీత పటేల్ హనుమంత్ రావు పటేల్ ఆలయ కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ పటేల్ కార్యనిర్వాహణ అదీకారి శివ రుద్రప్ప మండల అర్చక బృందం మరియు ఆలయ సిబ్బంది అధర్వంలో నేడు 5/ 11 / 2025 కార్తీకమాసం కల్యాణమహోత్సవం అమృతగుందంలో గంగ హారతి మరియు దీప రాధన మహోత్సవ క్రాయక్రమము నిర్వహించడం జరిగింది
ఇట్టి కార్యక్రమం లో సమస్త భక్తులు అంత పాల్గొని తీర్త ప్రసాదలు స్వేకరించరు.

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 4, 5, 6,7 తేదీలలో నిర్వహించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి,శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహారాజ్ బోనాల పండుగ,కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాని గౌడ సంఘం కమిటీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,సంఘం పెద్దలు సారయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్ ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి శ్రీను గౌడ్, గాధగోని సాంబయ్య గౌడ్, బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్,గండు లింగయ్య గౌడ్ ,గౌడ పెద్దలు పాల్గొన్నారు.

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.!

నేడు అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
చిల్పూర్( జనగామ) నేటిధాత్రి
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు( బుధవారం) శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారిని బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ చిల్పూరు గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం శేషాద్రి నిలయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు రంగాచార్యులు, రవీందర్ శర్మ, కృష్ణమాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version