భూవివాదంలో మహిళను హత్య చేసిన మనోజ్..

భూవివాదంలో మహిళను హత్య చేసిన మనోజ్ అనే రౌడి షీటర్ పై పీడీ యాక్ట్ నమోదు.

నిందుతుడు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి శుక్రవారం రోజున చందుర్తి సి.ఐ ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు కి తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

2023 సం.లో హత్య కేసులో, దొంగతనం , బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా మనోజ్..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మనోజ్ పై 2024 సంవత్సరంలో రౌడి షీట్ ఓపెన్.

నిందుతులు వివరాలు.
1.బొల్లు మనోజ్ s/o స్వామి వయస్సు:20 సంవత్సరాలు

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలానికి చెందిన బొల్లు మనోజ్ అనే వ్యక్తి మహిళ హత్య కేసు తో పాటుగా, హత్య కేసులల్లో, దొంగతనం,బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయగా 2024 సంవత్సరంలో మనోజ్ పై రౌడి షీట్ ఓపెన్ చేసి పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన మనోజ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రానప్పటికి తరచు నేరాలకు పాల్పడుతు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున జిల్లా కలెక్టర్ గారు పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయగా చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి నిందుతుణ్ణి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది.

జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ గారు ఈసందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ పై పాత కేసులలో ఉన్న నెరస్థులపై నిత్యం పోలీస్ నిఘా ఉంటుందని, గతంలో పలు కేసులల్లో నిందుతులగా ఉండి తరచు నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

తల్ల……. రాక్షస?

తల్లీ? రాక్షసి? – 7 నెలల పాపను రూ.35 వేలకే అమ్మాలని ప్రయత్నం చేసిన మహిళ అరెస్టు!

అమెరికాలో ఒక తల్లి చేసిన పశువులాంటి చర్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఇండియానా రాష్ట్రానికి చెందిన మహిళ తన 7 నెలల పసిపాపను లైంగిక దాడికి విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

32 ఏళ్ల మోర్గన్ స్టాప్ అనే మహిళ… ఒక గుర్తు తెలియని వ్యక్తికి తన పాపను లైంగికదాడికి అనుమతిస్తూ రూ.35,000 (అమెరికాలో కరెన్సీలో సుమారు 400 డాలర్లు)కి Snapchat ద్వారా ఒప్పందం చేయాలని ప్రయత్నించింది.
ఆమె మేసేజ్‌లో: “ఇప్పుడే అరటి పోతు చెల్లించండి, మిగతా మొత్తం తర్వాత ఇవ్వండి” అనే డీల్ పెట్టినట్లు తెలిసింది.

Snapchat ద్వారా కుట్ర బహిర్గతం
ఈ డీల్‌ను Snapchat‌లోని యాంటీ అబ్యూస్ సిస్టమ్ గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న FBI అధికారులు 10 రోజుల్లోనే ఆమె ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టారు.

తప్పించుకునే ప్రయత్నం విఫలం
మోర్గన్ స్టాప్ విచారణ సమయంలో తనకు Snapchat ఖాతా లేదని బుకాయించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు స్పష్టంగా చూపించడంతో ఆమెపై Attempted Child Sex Trafficking అనే Level 2 Felony కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఆమె జైలులో కదలలేని పరిస్థితిలో ఉంది. కేసు విచారణ కొనసాగుతోంది.

సమాజంలో అలజడి
ఒక తల్లి తన సొంత బిడ్డను ఇలాంటి ఘాతుకానికి అమ్మేంత నిష్ఠురంగా మారడం పై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ముగింపు:
ఇలాంటి దారుణాలకు సమాజంలో స్థానం ఉండకూడదు. చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్‌లో తెలియజేయండి.
ఇంకా ఇలాంటి నిజ జీవిత వార్తల కోసం మా చానెల్‌ను ఫాలో అవ్వండి.

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం.

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం–ఉదయం ఫౌండేషన్

రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:

మండలం అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ టాబ్లెట్స్ తీసుకుంటుంది.భర్త రాజేశం 6 సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్ లో ఉంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుండి బీడీలు మానేసి మంచం పట్టి , హాస్పిటల్ కి వెళ్ళదామంటే డబ్బులు లేక ఉదయం ఫౌండేషన్ సంప్రదించాగా ఈ రోజు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు.ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ లు పాల్గొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

అతడి నోరు తెరుచుకోవడం లేదు..

అతడి నోరు తెరుచుకోవడం లేదు.. కలిసి చంపేద్దాం రా.. ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.

వివాహేతర సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది (Wife Kills Husband). భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ (Delhi)లో కూడా అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

వరుసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత (Susmita).. అతడి సహాయంతో భర్త కరణ్ దేవ్ (Karan Dev) ను అంతమొందించింది. ఇన్‌స్టాగ్రామ్ ఛాట్ వీరి వ్యవహారాన్ని బయటపెట్టింది. హత్య చేస్తున్న సమయంలో కూడా రాహుల్‌తో సుస్మిత ఛాటింగ్ చేసింది. ఆ ఛాటింగ్ తాజాగా బయటకు వచ్చింది. నిందితురాలు తొలుత తన భర్త కరణ్‌కు భోజనంలో 15 నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. అయినా కరణ్ మరణించలేదు. దీంతో ఆ సమయంలో రాహుల్‌తో సుస్మిత ఛాటింగ్ చేసింది.

‘మాత్రలు వేసుకున్న తర్వాత ఎంతసేపటికి చనిపోతారో ఒకసారి చెక్ చెయి. ఇప్పటికి కరణ్‌కు మాత్రలు ఇచ్చి మూడు గంటలు అయింది. వామిటింగ్స్ కాలేదు. చనిపోలేదు. ఇప్పుడేం చేయాలి’ అని రాహుల్‌కు సుస్మిత మెసేజ్ పంపించింది.

ఆ మెసేజ్‌కు రాహుల్ స్పందిస్తూ.. ‘అది వర్కవుట్ కాకపోతే కరెంట్ షాక్ ఇవ్వు’ అని చెప్పాడు. అతడి కాళ్లు, చేతులను టేప్‌తో కట్టేసి షాక్ ఇవ్వాలని సూచించాడు.

‘అతడు చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు’ అని రాహుల్‌కు సుస్మిత చెప్పింది.

‘ఇంట్లో ఏమేం మాత్రలు ఉన్నాయో అవన్నీ అతడి చేత మింగించు’ అని రాహుల్ రిప్లై ఇచ్చాడు.

‘నేను కరణ్ నోరు తెరవలేకపోతున్నా. అతడి నోట్లో నీళ్లు వేశా. మాత్రలు వేయడానికి మాత్రం కుదరడంలేదు. నువ్వు ఇక్కడకు రా. ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం’ అని సుస్మిత చెప్పింది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి కరణ్‌కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. అనంతరం సుస్మిత అత్తగారి దగ్గరకు వెళ్లి తన భర్త కరణ్‌కు కరెంట్ షాక్ కొట్టినట్టు చెప్పింది. వెంటనే అందరూ కలిసి కరణ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే కరణ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ వద్దని అతడి తండ్రి, రాహుల్ (సహ నిందితుడు), సుస్మిత పట్టుబట్టారు. అయితే పోలీసులు వారి మాటలను వినకుండా పోస్ట్‌మార్టమ్ జరిపించడంతో హత్య విషయం బయటపడింది.

అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.

అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..?

ఓ మహిళ అమెరికాకు వెళ్లింది. ఆ దేశాన్ని చూసి వస్తే సరిపోతుండే.. కానీ చేయకూడని పని చేసి కటకటాల పాలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరాయి దేశంలలో ఇండియా పరువు తీసిందంటూ కొందరు.. డబ్బులు ఇచ్చి తప్పించుకోవాలని అనుకుంది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దేశం కానీ దేశంలో చేయకూడని పని చేస్తూ దొరికిపోయింది భారత్‌కు చెందిన ఓ మహిళ. చివరకు పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యింది. తనపై కేసు నమోదు చేయొద్దని.. అవసరమైతే డబ్బులు ఇస్తానని పోలీసులను ప్రాధేయపడిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ భారతీయ మహిళ అమెరికాను సందర్శించడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని టార్గెట్ స్టోర్‌కు ఆమె వెళ్లింది. అయితే ఆ స్టోర్‌లో ఏకంగా ఆ మహిళ 7గంటలు గడిపింది. ఆ తర్వాత పలు వస్తువులు తీసుకుని.. డబ్బులు కట్టకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1300 డాలర్ల విలువైన వస్తువులను ఆమె దొంగిలించిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ మహిళ గత 7 గంటలుగా స్టోర్‌లోనే తిరుగుతుంది. ఆమె వస్తువులను తీసుకుంటూ, తన ఫోన్‌ను తనిఖీ చేస్తూ చివరకు డబ్బులు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను పట్టుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాం’’ అని సిబ్బంది చెప్పారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. అవసరమైతే డబ్బు చెల్లిస్తానని.. అరెస్ట్ చేయొద్దని మహిళ ప్రాధేయపడింది. భారత్ లోనూ ఇలానే వస్తువులు దొంగలించడానికి పర్మిషన్ ఉందా..?  డబ్బు ఇస్తే వదిలేస్తారా..? అంటూ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమెను ప్రశ్నించింది. పోలీసులు ఆమెపై ఇంకా కేసు నమోదు చేయలేదు.  అదుపులోకి తీసుకుని ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ దేశానికి అతిథిగా వెళ్లి అక్కడి చట్టాలను ఉల్లంఘించే ధైర్యం చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటే.. ఆమె కచ్చితంగా తెలిసే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే డబ్బు చెల్లించి బయటపడదామని ఆ మహిళ అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఒకరు కామెంట్ చేయగా.. పరాయి దేశంలో భారత్‌ పరువు తీసిందని మరొకరు కామెంట్ చేశారు.

మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన..

మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. ఆ తర్వాత ఏమైందంటే..

 

 

 

 

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆ తర్వాత పలు విమాన సర్వీసుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వేళ.. ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

న్యూఢిల్లీ, జూన్ 29: విమానంలో మహిళా సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై ఎయిర్‌పోర్ట్‌లో కేసు నమోదయింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుబాయ్‌ నుంచి జైపూర్‌కు వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఒక ప్రయాణికుడు పీకల దాక మద్యం సేవించాడు. అనంతరం విమాన సిబ్బందిలోని ఒక మహిళతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ.. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. ఈ విమానం గమ్యస్థానం చేరుకున్న తర్వాత.. అంటే జైపూర్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు ఎయిర్ ఇండియా అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

మరోవైపు.. శనివారం అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు తన సహచర ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో నడక మార్గంలో నిలబడి.. మరో ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్తా.. ఘర్షణకు దారి తీసింది. ఈ వ్యవహారంపై విమాన సిబ్బందికి సహచర ప్రయాణికులు సమాచారం అందించారు. దీంతో బాధితుడిని బిజినెస్‌ క్లాస్‌ సీటుకు మార్చారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే.. ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి అప్పగించిన విషయం విదితమే.

మహిళ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం.

మహిళ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం

ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి సురేఖ

హైద‌రాబాద్ నేటిధాత్రి:

 

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి స‌మ‌స్య‌లున్నా త‌న‌ను సంప్ర‌దించాల‌ని సూచించగా, ఆమె మంత్రికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఆడ‌దాని ప్రేమ‌ను.చెప్ప‌డానికి ఏమున్నాయ్‌..

ఆడ‌దాని ప్రేమ‌ను.. చెప్ప‌డానికి ఏమున్నాయ్‌.. ‘8 వసంతాలు’ ట్రైల‌ర్‌ అదిరింది

 

 

 

 

 

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’

రెండేండ్ల క్రితం ‘మ్యాడ్’ (MAD) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈఅ మూవీ జూన్‌20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ ఏప‌థ్యంలో ఇప్ప‌టికే మేక‌ర్స్‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు ఒక దానిని మించి మ‌రోటి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు మ‌రో వారం మాత్ర‌మే ఉండ‌డంతో తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రేమ చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయి త‌రుపు ప్రేమ‌ను తెలిపే చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈకోవ‌లోనే హీరోయన్‌తో చెప్పించిన డైలాగులు మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. మాములుగా మ‌గాడి ప్రేమ‌కు సాక్ష్యాలుగా పాల‌రాతి సౌధాలు, భాగ్య‌ న‌గ‌రాలు ఉన్నాయి గానీ ఆడ‌దాని ప్రేమ‌కు ఏముంది మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అనే హృద్య‌మైన ప‌దాల‌తో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి
చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.

వాగులో పడి మహిళ మృతి.

వాగులో పడి మహిళ మృతి

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం బాలానగర్ మండలంలోని పెద్దాయ పల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో శంకరమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరమ్మ మృతిపై ఎవరిపై అనుమానం లేదని.. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం ఎమ్మెల్యే

నేటి ధాత్రి:

 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వద్ద మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ప్రజా ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామాల్లో ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ స్వరాజ్య సంస్థ అధ్యక్ష  కార్యదర్శులు పప్పుల సుధాకర్ తల్లూరి సలేందర్ కుమార్ కో-ఆర్డినేటర్ వట్టెం రాములమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

పేద మహిళకు అండగా మంత్రి పొంగులేటి…

పేద మహిళకు అండగా మంత్రి పొంగులేటి…

(నేటి ధాత్రి )

 

 

వరంగల్ తూర్పులో జరుగుతున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సులో, ఒక పేద మహిళ రైతు, తన సమస్య చెప్పుకోవడానికి వేదిక పక్కన వేచి ఉండడంతో, అది గమనించిన మంత్రి పొంగులేటి, సదరు మహిళను స్టేజ్ మీదకు పిలిచి, తన పక్కన కూర్చోబెట్టుకొని, మహిళా సమస్యను విని, సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆమె సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇది చూసిన వారందరూ మంత్రిని అభినందించారు. పేద వాళ్లకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి వరంగల్ లో మరోసారి  నిరూపించారు..

ఉల్లంఘించిన మహిళకు భారీ జరిమానా.

బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు భారీ జరిమానా

నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై ఎక్సైజ్ అధికారులు నిరంతర దాడుల్లో
బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై దాడులు
నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జరుపుల రమ గతంలో నాటుసారా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడగా నర్సంపేట తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆమె బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటు సారాను విక్రయిస్తూ పట్టుబడగా ఆమెను అరెస్టు చేసి నర్సంపేట తహసిల్దార్ రాజేష్ ఎదుట హాజరుపరచగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరుపుల రమకు రూ. 50 వేల జరిమానా విధించగా ఆమె చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. బైండోవర్ ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే ఆరు నెలలు వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version