ఆడ‌దాని ప్రేమ‌ను.చెప్ప‌డానికి ఏమున్నాయ్‌..

ఆడ‌దాని ప్రేమ‌ను.. చెప్ప‌డానికి ఏమున్నాయ్‌.. ‘8 వసంతాలు’ ట్రైల‌ర్‌ అదిరింది

 

 

 

 

 

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’

రెండేండ్ల క్రితం ‘మ్యాడ్’ (MAD) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈఅ మూవీ జూన్‌20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ ఏప‌థ్యంలో ఇప్ప‌టికే మేక‌ర్స్‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు ఒక దానిని మించి మ‌రోటి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు మ‌రో వారం మాత్ర‌మే ఉండ‌డంతో తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రేమ చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయి త‌రుపు ప్రేమ‌ను తెలిపే చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈకోవ‌లోనే హీరోయన్‌తో చెప్పించిన డైలాగులు మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. మాములుగా మ‌గాడి ప్రేమ‌కు సాక్ష్యాలుగా పాల‌రాతి సౌధాలు, భాగ్య‌ న‌గ‌రాలు ఉన్నాయి గానీ ఆడ‌దాని ప్రేమ‌కు ఏముంది మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అనే హృద్య‌మైన ప‌దాల‌తో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి
చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.

వాగులో పడి మహిళ మృతి.

వాగులో పడి మహిళ మృతి

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం బాలానగర్ మండలంలోని పెద్దాయ పల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో శంకరమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరమ్మ మృతిపై ఎవరిపై అనుమానం లేదని.. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం ఎమ్మెల్యే

నేటి ధాత్రి:

 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వద్ద మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ప్రజా ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామాల్లో ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ స్వరాజ్య సంస్థ అధ్యక్ష  కార్యదర్శులు పప్పుల సుధాకర్ తల్లూరి సలేందర్ కుమార్ కో-ఆర్డినేటర్ వట్టెం రాములమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

పేద మహిళకు అండగా మంత్రి పొంగులేటి…

పేద మహిళకు అండగా మంత్రి పొంగులేటి…

(నేటి ధాత్రి )

 

 

వరంగల్ తూర్పులో జరుగుతున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సులో, ఒక పేద మహిళ రైతు, తన సమస్య చెప్పుకోవడానికి వేదిక పక్కన వేచి ఉండడంతో, అది గమనించిన మంత్రి పొంగులేటి, సదరు మహిళను స్టేజ్ మీదకు పిలిచి, తన పక్కన కూర్చోబెట్టుకొని, మహిళా సమస్యను విని, సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారులకు ఆమె సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇది చూసిన వారందరూ మంత్రిని అభినందించారు. పేద వాళ్లకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి వరంగల్ లో మరోసారి  నిరూపించారు..

ఉల్లంఘించిన మహిళకు భారీ జరిమానా.

బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు భారీ జరిమానా

నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై ఎక్సైజ్ అధికారులు నిరంతర దాడుల్లో
బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై దాడులు
నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జరుపుల రమ గతంలో నాటుసారా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడగా నర్సంపేట తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆమె బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటు సారాను విక్రయిస్తూ పట్టుబడగా ఆమెను అరెస్టు చేసి నర్సంపేట తహసిల్దార్ రాజేష్ ఎదుట హాజరుపరచగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరుపుల రమకు రూ. 50 వేల జరిమానా విధించగా ఆమె చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. బైండోవర్ ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే ఆరు నెలలు వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఎండ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాంబలక్ష్మి (80) వడదెబ్బతో తీవ్ర అస్తవతకు గురై ఉదయం మరణించింది విషయం తెలుసుకున్న. గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజ్ కుమార్ పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతర o మృతురాలి కుటుంబ సభ్యులకుతన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వ్యక్తం చేశారు

మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.!

వనపర్తి లో మృతురాలు కుటుంబాన్ని మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తిలో 23వ వార్డుకు చెందిన శారద విద్యామందిర్ అధినేత ,ఉపాధ్యాయురాలు శ్రీమతి వి.యస్.కళావతి గారు ఇటీవల గుండెపోటుతో మరణించారు ఈ.విషయం తెలుసుకున్న మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మృతు రాలు నివాసానికి వెళ్లి కుమారులు శ్రీను,మురళీ పాండులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు . రావుల వెంట మీడియా ఇంచార్జి నందిమల్ల.అశో క్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,నందిమల్ల. రమేష్, జోహే బ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, తోట.శ్రీను తదితరులు ఉన్నారు

అనారోగ్యానికి గురైన వృద్ధురాలికి సంజీవని అందజేత.

అనారోగ్యానికి గురైన వృద్ధురాలికి సంజీవని అందజేత

 

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

కేంద్ర హోం శాఖా మంత్రి బండి సంజయ్ ఎల్లారెడ్డిపేట మండలంలో వృద్ధురాలికి సంజీవని అందజేసి ఔదార్యాన్ని చాటాడు. వివరాల్లోకెళితే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేష్ తల్లి వజ్రమ్మ కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్న వారి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సంజీవని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి గణేష్, పిట్ల శ్రీశైలం, నంది నరేష్, కిరణ్ నాయక్, చేవూరి మధు, శాగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే ఆగ్రహం.

మహిళపై అత్యాచారం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జడ్చర్ల / నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న..

స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది…

సృజన.ట్రయిని ఎస్సై..

రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్)

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ట్రెయిని ఎస్సై సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అమే మాట్లాడుతూ నేడు పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. చాలా రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో అయినా మహిళలు రాణిస్తున్నారని అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. మహిళలు పురుషులకంటే ఆత్మస్థైర్యంగా శక్తివంతంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే చిన్నచూపు చూడకుండా వారిని కూడా పురుషులతో సమానంగా పెంచి ఉన్నత చదువులు చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తొందరపడి ఆడపిల్లలను చదివిన మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అప్పుడు తిరిగి ఆ సమస్య తల్లిదండ్రుల కు వస్తుందన్నారు. అలా కాకుండా ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం సంపాదించే వరకు పెంచితే వారికి భవిష్యత్తు ఎంతో ఉంటుందని జీవితాంతం సుఖ సంతోషాలతో మెట్టిన ఇంట్లో కూడా ఉంటుందని అన్నారు. దేశంలో నేడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తున్నాయని ఇది మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించడం వల్లనే జరుగుతుందన్నారు. ఆడవారు ఉద్యోగాలనే కాకుండా స్వచ్ఛందంగా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, స్వయం ఉపాధి రంగాల్లో ఎంతో రాణిస్తున్నారని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version