రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల

దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్

జడ్చర్ల / నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో మోదీ చంపినట్లు ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుసగా గుర్తుతెలియని వ్యక్తులు కావేరమ్మపేట ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉండడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. తాజాగా మంగళవారం ఉదయం మృతి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా కలిగి ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version