30 ఏళ్ళ పెదరాయుడు.

30 ఏళ్ళ పెదరాయుడు…

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు’… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు'(Pedarayudu)… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది…
మోహన్ బాబు (mohanbabu)నటజీవితాన్ని ‘పెదరాయుడు’కు ముందు – ‘పెదరాయుడు’ తరువాత అన్న రీతిలో విడదీయవలసి ఉంటుంది… అంతకు ముందు మోహన్ బాబు వందల చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు… ‘ప్రతిజ్ఞ’తో నటనిర్మాతగా మారి ప్రయాణం సాగించారు… సొంత చిత్రాల నిర్మాణంలో మోహన్ బాబు ఎన్నెన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నారు… ఆయన నటించి నిర్మించిన చిత్రాల్లో కొన్ని అఖండ విజయాలను నమోదు చేశాయి… మరికొన్ని అపజయాల బాట పట్టాయి… ఈ నేపథ్యంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ బంపర్ హిట్ గా నిలచింది… ఆ సినిమా తరువాత మళ్ళీ కొంత నిరాశ! ఆ సమయంలో మోహన్ బాబు నిర్మించి నటించిన ‘పెదరాయుడు’ అనూహ్య విజయం సాధించింది… 1995 జూన్ 15న విడుదలైన ‘పెదరాయుడు’ ముందు పోటీ చిత్రాలు నిలవలేకపోయాయి… ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ రేసు గెలవడమే కాదు ఆల్ టైమ్ హిట్ గానూ ‘పెదరాయుడు’ నిలచింది…
సినిమా థియేటర్‌లు

తమిళంలో శరత్ కుమార్ హీరోగా రూపొందిన ‘నాటామై’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ , దానిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించారు. అలాగే అందులో పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ నటిస్తానని మాటిచ్చారు… అదే తీరున నటించి అలరించారు… యన్టీఆర్, ఏయన్నార్, దాసరి వంటి ప్రముఖుల సమక్షంలో ఆరంభమైన ‘పెదరాయుడు’ సాధించిన ఘనవిజయంతో మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళింది… భానుప్రియ, సౌందర్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు… కోటి సంగీతం సమకూర్చారు… సీతారామశాస్త్రి, భువనచంద్ర, శ్రీహర్ష రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి… ఈ నాటికీ మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా ‘పెదరాయుడు’ నిలచే ఉంది… ఇప్పటికీ ‘పెదరాయుడు’ బుల్లితెరపై కనిపిస్తే జనం ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను.!

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను

డబులో బెడ్ రుములు నిర్మెంచి పేదలకు ఇవ్వాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ;

వనపర్తి పట్టణంలో:

పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక.జిల్లా అధ్యక్షులు
సతీష్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు గత బీ ఆర్ ఎస్ .ప్రభుత్వ ములో కోట్లు రూపాయలు ఖర్చు చేసి
పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది అని దాన్ని వినియోగం లోకి తేవాలనీ సతీష్ ప్రజల తరుపున కోరారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలు. పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు కిరాయలకు ఇచ్చి పేదలు వ్యాపారం చేసుకోవడానికి} వినియోగం లోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి కలెక్టర్ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ వెంట ఎస్సీ ఎస్టీ కమిటీ నాయకులు గంధం నాగరాజు సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version