ఉపాధి హామీ మహిళ కూలీ మృతి….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.