వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు.

మరిపెడలో ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు

యువత ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి

– చేతి వృత్తులవారు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.

– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటిధాత్రి.

 

యువత ఉద్యోగాల సాధన పైనే కాకుండా వ్యాపారాల నిర్వహణపై కూడా దృష్టి సారించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.బుధవారం మరిపెడ పట్టణ కేంద్రంలో చోడోజు వీరభద్రా చారి నూతనంగా ఏర్పాటుచేసుకున్న ఉడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు కేంద్రమైన మరిపెడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందనన్నారు. పట్టణంలో యువత సరైన ప్రణాళికతో వ్యాపార రంగంలోకి దిగితే సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు.వ్యాపారాల నిర్వహణతోనే త్వరగా ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక రకాలైన వ్యాపార సంస్థలు పట్టణంలో నెలకొని ఉన్నాయని,నూతనంగా ఏర్పాటైన శ్రీ వీరభద్ర ఉడ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ వినియోగదారుల ఆదరణ పొంది వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా చేతి వృత్తుల వారు టెక్నాలజీ ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బీఆర్ ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్, మాసబత్తిని సతీష్,రేఖ వెంకటేశ్వర్లు,పానుగోతు వెంకన్న, కత్రోజు వెంకటాచారి,మాజీ ఎంపీటీసీ శ్రీరాముల రాములు,కట్టోజు అంజయ్య,రాగి సైదాచారి,బుచ్చయ్య,సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
వనపర్తి నేటిదాత్రి :

రాష్ట్రంలో
రైతులు పండిచి న వడ్లు కొనుగోలులో
రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ సాగునీళ్ళు రావడం లేదని రాకున్నా రైతులు కష్టపడి పండించుకున్న వడ్లు వెంటనే కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని నిరంజన్ అన్నారు యాసంగి పంటలో ఎటువంటి తేమగాని,తరుగుకాని ఉండదు అధికారులు తేమ ఉందని కొన్నిరోజులు,తాలు ఉందని గన్ని బ్యాగులు లేవని ,లారీలు రాలేదని రైతులను ఇబ్బందిపెట్ట డమూ పై మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా రైతులు తరుగు కోల్పోవడం తో పాటు తేమ,తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదురుకుంటున్నారని అన్నారు. రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని బ్యాగులు నింపి ట్రాన్స్పోర్ట్ వరకు ఆగాలివస్తుందని వారికి సరిఅయిన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని అన్నారు
మంత్రులు,అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేయాలని మాజి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతులకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను రైతులు వదులు కొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసా పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఇమ్రాన్,నారాయణ నాయక్, మాజీద్,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version