మహిళ మెడలో గొలుసు దొంగిలించిన నిందితులు అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆదర్శ నగర్ లో ఈ నెల 22న మహిళను కత్తితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన రెండున్నర తులాల బంగారు గొలుసు, దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సైదా నాయక్ తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని, వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు
