రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

 

జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్

 

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో

ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం

ఒక లౌకిక దేశం భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి క్రైస్తవ సంఘాలు సంస్థలు మరియు సమాజం లో కుల మత పేద ధనిక మేధావి నిరాక్షరాశులనే భేదం లేకుండా అందరి మధ్య నిస్వార్ధంగా వైద్య విద్య మరియు సామాజిక రంగాలలో ప్రభుత్వంతో సమానంగా అఖండ సేవలందిస్తున్నాయి

ఈనాటికి బాధ్యత మైన క్రైస్తవ సమాజం నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉంది స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా క్రైస్తవ సమాజంపై హత్యలు అత్యాచారాలు మాత్రం మారలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన

రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 (1) అధికరణాలను అనుసరించి దేశంలోని పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛను కల్పించింది కానీ కొంతమంది రాజకీయ స్వార్ధపరులు

రాజ్యాంగ చట్టాలను ఉల్లగించి తమ స్వార్థం కోసం మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని అశాంతి యుతంగా మారుస్తున్నారు మొన్న మణిపూర్ ఘటన
లో కూడా ఆడ మగ పిల్ల పాపలు అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేశారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ను హత్య చేసి కొట్టి పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించేవిధముగావ్యవహరిస్తున్నారు.

పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీని పోస్టుమార్టం చేసి రిపోర్టులు న్యాయబద్ధంగా ఈయకపోతే క్రైస్తవ సమాజం శాంతియుతం మానుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక దోషులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టపరమైన శిక్ష పడే విధంగా ఆంధ్ర రాష్ట్ర డిజిపి హోం శాఖ మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గార్లు మానవిక కోణంలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ప్రేమ్ సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్య శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి తాళ్ళపెల్లి ప్రభాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మిడతపల్లి విక్రమ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి గుడెల్లి రవి, ఎర్ర రామచంద్రు, మచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల

దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్

జడ్చర్ల / నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో మోదీ చంపినట్లు ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుసగా గుర్తుతెలియని వ్యక్తులు కావేరమ్మపేట ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉండడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. తాజాగా మంగళవారం ఉదయం మృతి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా కలిగి ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version