రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య
◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.