దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

హనుమకొండ:నేటిధాత్రి

 

తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగార నికి చెందిన బౌతు అన్నపూర్ణ సోమవారం ప్రజావాణిలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి:

 

హన్మకొండ గుండ్లసింగారంలోని జై భవాని కాలనీలో జీసస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ముఖ్య అతిథులు జీసస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు బ్రదర్ వంశీ, వైస్ ప్రెసిడెంట్ సాల్మన్ పాల్గొన్నారు.
చర్చి సభ్యులు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వంశీ మరియు సాల్మన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version