చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్…

చర్లలో చైనా మాంజాపై నిషేధంసీఐ రాజవర్మఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్

 

చైనీస్ మాంజ పై నిషేధం ఉన్నందున ఎవరైనా చైనీస్ మంజా తో పతంగులు అమ్మిన ఎగురవేసిన అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి అత్యంత ప్రమాద కరమైన చైనీస్ మాంజ తో పతంగులు ఎగురవేయడం వల్ల ఆ మంజా తాకి వ్యక్తులు మరణించడం జరుగుతుంది కాబట్టి చర్ల మండలంలో వ్యాపారస్తులు అదేవిధంగా తల్లితండ్రులు పిల్లల విషయంలో జాగర్తగా ఉండి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక…

చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ప్రభుత్వం మరియు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) తయారీ, విక్రయం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడిందని వర్దన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ, చైనా మంజా అత్యంత పదునుగా ఉండటంతో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సైకిల్ ప్రయాణికులు, పాదచారులు తీవ్ర గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు గతంలో అనేక చోట్ల ఈ నైలాన్ మంజా కారణంగా గొంతు కోసుకుపోయిన ఘటనలు ప్రాణ నష్టం సంభవించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే చైనా మంజా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ లైన్లకు చుట్టుకుపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని, కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు దీంతో ప్రజలకు ఆర్థిక నష్టం ప్రాణాపాయం కూడా ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చైనా మంజా వాడకుండా కట్టడి చేయాలని, పండుగలు సెలవుల సమయంలో పిల్లలు సురక్షితమైన కాగితపు మంజా మాత్రమే ఉపయోగించేలా చూడాలని సూచించారు. అలాగే వ్యాపారులు ఎవరైనా నిషేధిత మంజాను విక్రయిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సాయిబాబు కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు…

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ హెచ్చరిక.మందమర్రి,సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ సూచించారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిషేధిత చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
** ప్రాణాంతకమైన దారం: చైనా మాంజా గొంతుకు తగిలితే కోసుకుపోయే ప్రమాదం ఉందని, గతంలో ఇలాంటి ఎన్నో విషాద ఘటనలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.
* పక్షుల మరణాలు: పర్యావరణానికి మేలు చేసే పక్షులు ఈ దారానికి చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* అమ్మేవారిపై నిఘా: పట్టణంలోని ఫ్యాన్సీ జనరల్ స్టోర్లలో నిషేధిత మాంజా విక్రయిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
* తల్లిదండ్రుల బాధ్యత: పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు వారు ఏ రకమైన దారం వాడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ. మిలన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరు పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు, వ్యాపారులకు చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version