ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుండి వయా రుద్రారం, రంగసాయిపల్లె, దత్తోజిపేట, లక్ష్మీపూర్, గ్రామాల నుండి గుండి గ్రామం వరకు రోడ్ వేయాలని మరియు బస్ రెగ్యులర్ గా నడవాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వెంటనే స్పందించి పంచాయతీరాజ్ డిఈకి మరియు ఆర్టిసి ఆర్ఎమ్ కీ ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించి, సమస్య పరిష్కరించాలని ఆదేశించిన మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి, సర్పంచులు ద్యావ అనంతరెడ్డి, గుడ్ల శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాంరెడ్డి, బీమా ఈశ్వర్, గంటల రవీందర్ రెడ్డి, కట్ల వెంకటేశ్, బండారి పర్సారాములు, పిట్టల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన…

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు వినతి పత్రం అందజేసిన

కాప్రా నేటిధాత్రి

 

ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి ) వెడల్పు పెంపు అవసరం కోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని సోమవారం శామీర్ పేట లో వారి నివాసంలో కలిసిన వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి.
ఈ సందర్భగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ వంతెనను సుమారు 45 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు.
ప్రాంతంలో జనాభా వేగంగా పెరగడం, కొత్త కాలనీలు విస్తరించడంతో ప్రస్తుతం ఈ వంతెన ట్రాఫిక్‌ను మోయలేకపోతోంది. ఇది హబ్సిగూడా నుండి ఈసీఐఎల్‌కు, బోడుప్పల్ నుండి ఈసీఐఎల్‌కు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు దీనిపై ఆధారపడుతున్నారు.
వంతెన వెడల్పు తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు అవసరం.
ఈ పనుల కోసం ప్రత్యేక రైల్వే అభివృద్ధి ప్రణాళిక (ఎస్ ఆర్ డి పి ) కింద నిధులు ఇప్పటికే విడుదలైనట్లు నా దృష్టికి వచ్చింది.
అందువల్ల, దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి ఎన్ ఎఫ్ సి రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపుకు అనుమతి ఇవ్వగలరని మనవి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు..

నిజాంపేట ప్రజావాణిలో ఒక దరఖాస్తు

నిజాంపేట: నేటి ధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నిజాంపేట మండలంలో తాహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజీరెడ్డి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఎంపీవో నరసింహారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల నివృత్తి కోసం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. ఉదయం 10: 30 నుండి 1 వరకు ఉంటుందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version