పాఠశాలను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి సునీల్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేగొండ మండల ప్రత్యేక అధికారి ఏ. సునీల్ కుమార్ ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.
ఆర్ బాలుర పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలో కూరగాయల స్టాక్ రిజిస్టర్ను,
కూరగాయల తాజాదనంను పరిశీలించారు.
విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
వంటగది, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.