సమస్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్.
మందమర్రి నేటి ధాత్రి
హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.మందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 18వ వార్డు గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లో గత కొంత కాలంగా మురికి కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ఇంచార్జి కాంగ్రెస్ యువ నాయకులు ఎండీ, జావిద్ ఖాన్ గారు పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి, రాజలింగు గారి దృష్టికి తీసుకెళ్లాగా, స్పందించి ఆయన పరిసరాలను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ సిబ్బంది గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లోని మురికి కాలువల పూడికతీత పనులు. నిర్వహించి, రోడ్డుకు ఇరు వైపుల ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం తోపాటు ఏరియాలో చెత్త కుప్పలను సైతం శుభ్రం చేశారు. సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించన మున్సిపల్ కమిషనర్ కు నాయకులకు ఏరియా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు.
