పరిశ్రమ యంత్రాలను తరలిస్తే ఊరుకోం

పరిశ్రమ యంత్రాలను తరలిస్తే ఊరుకోం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదివారం ఉదయం గేటు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాత్రింపగలు పరిశ్రమ గేటు ముందు నెల రోజుల నుండి నిరసన చేస్తున్న యాజమాన్యం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా యంత్రాలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version