ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అదేవిదంగా వేశాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకెట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంక్ ఏర్పాటు చేయగా నల్లా తిప్పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన ఇప్పకాయల మనస్విని మొదటి బహుమతి రూ. 5016,పొట్ల రజని ద్వితీయ బహుమతి రూ. 3016/-,నల్ల మౌనిక తృతీయ బహుమతి రూ. 2016/- లను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజలందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.
ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఇదే స్పూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు.
మన ప్రతిభను,మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఈ రోజు ముగ్గుల పోటీల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు, ఐదో తరగతి చిన్నారులు, డిగ్రీ చదువుతున్న యువతులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ తరం ఆ తరం మధ్య ఏర్పడిన ఈ కలయిక మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పండుగలతో అనుబంధాలు బలపడతాయి: మోటే ధర్మారావు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమైందని ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతులు దింపాలని సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని ఈ ఏడాది పొడుగునా ఇంటింటా సిరులు కాంతులు విరిసిల్లాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

భారత సంస్కృతికి సంక్రాంతి ప్రతీక: చిత్తూరు ఎంపీ

*సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక భారత దేశం…

*ప్రకృతిని ఆరాధించే పండుగే సంక్రాంతి…

*ఆచార వ్యవహారాలను ఆరాధించే గొప్ప సియం చంద్రబాబు నాయుడు…

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…

*తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

చిత్తూరు (నేటిధాత్రి:

 

 

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం ప్రతీక అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనమన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకుంటూ.. “సంక్రాంతి” పండుగ వైశిష్ట్యాన్ని భావితరాలకు తెలియజేస్తున్న
స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఏ.పి. సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐ.టి.శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు,
తెలుగు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ మూడు రోజుల సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఈ సంక్రాంతి అందరిలోనూ నూతన వెలుగులు తీసుకొస్తుందనీ ఆయన కాంక్షించారు.
మానవునిలో నూతన ఉత్తేజాన్ని నింపేవి పండుగలన్నారు.ఆధ్యాత్మికంగాను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడంలోనూ, అలాగే మనిషి మూలాలు, ఉనికిని ఈ పండులు ప్రతిబింబిస్తాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

తంగళ్ళపల్లిలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తూ. శుభోదయం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరగగా దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్. తమిళనాడు. తెలంగాణలో. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవడం. జరుగుతుందని .ముందుగా భోగి పండుగ రోజున ప్రతి మనిషి. తలంటు స్నానం చేయాలని చిన్నపిల్లలకు భోగి పండ్లతో.స్నానం చేయించాలని కుటుంబానికి పట్టిన నరదృష్టి తీసివేయడానికి భోగి మంటలు మండించాలని ఇంటిముందు మధ్యలో రంగులు వేసి మధ్యలోభోగి పండ్లను గొబ్బెమ్మలను పెట్టాలని దానివలన గోవు ప్రత్యేకత తెలుపుతుందని భోగి మంటలు కాలిన తర్వాత బూడిదను చిన్న పిల్లలకు బొట్టు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మాట్లాడుతూ ముందస్తుగా ఇట్టి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మమ్మల్ని సిబ్బందిని పిలవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పండగలను పిల్లల మధ్య జరపకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెబుతూ రెండవ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం దాంట్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మూలంగా పండగ జరుపుకోవడం జరుగుతుందని శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం మూలంగా మంచి ఫలితం వస్తుందని చరిత్ర చెబుతుందని పితృదేవతలకు సంబంధించిన శ్లోకం చదివినట్లయితే పితృ దేవతలకు సంబంధించిన పండుగలు ఒకటి దీపావళి రెండవది దసరా మూడవది అమావాస్య పే త్రమాస్య ఈరోజుల్లో పితృదేవతలను పూజించినట్లయితే కుటుంబానికి అనుగ్రహం వలన మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతూ ఇలాంటి సంక్రాంతి సంబరాలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రంగోలి కార్యక్రమంలో బహుమతులు మా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మూడవరోజు అయినటువంటి కనుమ రోజున గోవులను సంరక్షించడం జరుగుతుంది ఆరోజు గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమ లాంటివి శరీరానికి రాసి వాటికి కొత్త దుస్తులు కప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న పేర్లు పెట్టి వాటిని పిలవడం జరుగుతుంది దేశాన్ని సైనికులు ఏ విధంగా రక్షిస్తారో మనము కూడా రైతుల రక్షించుకునే బాధ్యత అందరి పైన ఉంది ఎందుకనగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు మనందరికీ అన్నం పెట్టలేకపోవడం జరుగుతుందని అప్పుడు పెద్ద ప్రళయం వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆలోచించి మనము వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా పాఠశాల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అది కూడా పిల్లల మధ్యల దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక తంగళ్ళపల్లి మండల ఎస్సై ఉపేంద్ర చారి సిబ్బందితో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సంబరాల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి. ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ. పి ఈ టి అజయ్ కుమార్. కంప్యూటర్ శ్రీనివాస్. సిరిసిల్ల బ్రాంచ్ పాఠశాల ఇన్చార్జి లావణ్య. అకాడమిక్ ఇన్చార్జి సాయి ప్రియ . విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ముందస్తు సంక్రాంతి సంబరాలు…

ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

మండలంలోని వర్ష కొండలో మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించడం జరిగింది ఈ పండుగ వేడుకలకు గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ ఉప సర్పంచ్ తుమ్మల జయ,సామెల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు
భోగి పండుగ సందర్భంగా భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించి, చిన్నారులకు భోగి పళ్ళను పోయడం ద్వారా పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు
సంక్రాంతి పండుగ సందర్భంలో విద్యార్థులతో కలిసి రంగురంగుల గాలి పాటలను ఎగురవేసి, ఆనందాన్ని పంచుకున్నారు
కనుమ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవులను, లేగ దూడలను పూజించడం ద్వారా రైతు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ విధంగా సంప్రదాయాలు, సంస్కృతి, ఆనందం కలిసిన సంక్రాంతి వేడుకలను విజయవంతంగా ముగించారు
ఈ సంబరాలు విద్యార్థుల్లో పండుగల పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంపొందించాయి.
మరొక్కసారి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు అచ్చం విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version