సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు…

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు

◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి..

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల లో పోలింగ్ బూతు ను మార్చ లని మాజీ మున్సిపల్ తిరుమల్ ఒక ప్రకటనలో తెలిపారు.
33 వ వార్డులో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఓటర్లకు ఇబ్బందు లకు గురి అవుతూన్నారని అయన తెలిపారు 2014 లోమున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ మాడల్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ ఉన్నదనిబ్ ఎన్నికల అధికారులు పరిశీలించి వృద్ధులకు వికలాంగులకు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చామని తిరుమల్ తెలిపారు వినతిపత్రం ఇచ్చిన వారిలో దండు యాదగిరి పాల్గొన్నారని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version