రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం…

రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్

ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవడమే… అరైవ్… అలైన్ ప్రధాన ఉద్దేశం… సిఐ సత్యనారాయణ

కేసముద్రం/ నేటి ధాత్రి

రైతు వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు.జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి
అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఉదేశీస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ,

ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ ప్రధాన ఉద్దేశం”. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం అని అన్నారు.

అతివేగం, మొబైల్ వాడకం, తాగి వాహనం నడపడం ( డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మునిసిపాలిటీ ప్రజలందరూ మన ప్రాణాలకు సంబంధించిన బాధ్యత హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అని అన్నారు.

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి అని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒకరిది బాధ్యత అని అన్నారు.

వేగం కన్నా ప్రాణం ముఖ్యం…అనే సందేశాన్ని అందరికీ తెలియజేశారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టీ.శ్రీనివాస్ స్థానిక ఎస్సై.నరేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీరష్ యాదవ్, కిషోర్, వేముల భారతి, ఉమా, కనుకుల సుభద్ర, విజయ, శరత్ యాదవ్, రాము, కృష్ణ, అరుణ, శారద,అధికారులు, వార్డ్ ఆఫీసర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి…

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పరిమితి పెంచాలని డిమాండ్

విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్

ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు మర్రిపెల్లి మొగిలి

కేసముద్రం/ నేటి ధాత్రి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను విక్రయించిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఎకరాకు కేవలం 26½ క్వింటాళ్ల మొక్కజొన్నలనే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

ఈ ఏడాది ప్రతి రైతుకు ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినప్పటికీ, ప్రభుత్వ కొనుగోలు పరిమితి తక్కువగా ఉండడంతో మిగిలిన మొక్కజొన్నలను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం 40 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను విక్రయించిన రైతులకు ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని మొగిలి తెలిపారు. గత నెల 31న మార్కెట్ ఆవరణలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 400 మంది రైతులు తమ మొక్కజొన్నలను విక్రయించినప్పటికీ, ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. క్వింటాలుకు రూ.2400 ధర వస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులను డబ్బులు అందక తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పారు.

గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులు 15 రోజుల వాయిదాతో చెల్లింపులు చేస్తుంటారని, ఇదే విధంగా ప్రభుత్వం కూడా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. మార్కెట్ నిబంధనల ప్రకారం సరుకు విక్రయించిన రోజే చెక్కు జారీ చేయాలని ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా అదే రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి…

పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ చేసిన రోజే చెల్లించాలి.

హెల్త్ కార్డుల మంజూరీ ప్రక్రియ వేగవంతం చేయాలి.

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

కేసముద్రం/ నేటి ధాత్రి

ఉద్యోగ,ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అన్ని డి. ఏ లను ప్రకటించాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాలలోటిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ అధ్యక్షుతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
మారుతున్న జీవన ప్రమాణాలను, ధరలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డీ.ఏ ను, ఐదు సంవత్సరాలకు ఒకసారి పి ఆర్ సి ని ప్రకటిస్తుందని కానీ ఆర్థిక మాంధ్యాన్ని సాకుగా చూపించి
ఏళ్లు గడిచినా పి.ఆర్.సి మరియు డి.ఏ లను ఇంకా ఆలస్యం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, తక్షణమే వీటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు 30 -35 సంవత్సరాలు విద్యార్థులకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ మొదలైన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని, పెండింగ్ అన్ని రకాల బెనిఫిట్స్ ని తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని, వాటి వినియోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో అయినా అన్ని రకాల నగదు రహిత వైద్యం అందేలా రూపొందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న , వారి జీవితాలను అగమ్యగోచరం చేస్తున్న
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా కార్యదర్శి చీకటి వెంకట్రాం నర్సయ్య, ఉపాధ్యక్షులు కొమ్ము రాజేందర్, అంజన్న,కార్యదర్శులు ఊట్కూరు ప్రణయ్ కుమార్, వీసం నర్సయ్య, మోహనకృష్ణ,, బొల్లెద్దు చందర్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ బి శ్రీనివాస్ అక్కడ మీకు సెల్ కన్వీనర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన ఆర్.ఎం.పి వైద్య బృందం…

మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన ఆర్.ఎం.పి వైద్య బృందం

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ కేసముద్రం మండల శాఖ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సీనియర్ వైద్యులు ఉప్పల ఏకాంతం మేనత్త భద్రమ్మ దశదినకర్మలో కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న నాయకులు జిల్లా కమిటీ కార్యనిర్వహకఅధ్యక్షులు మహమ్మద్ నజీర్ అహ్మద్ మండల కమిటీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ మండల కమిటీ బాధ్యులు పి నాగిరెడ్డి మండల కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు లేగల విజయ్ భాస్కర్ రెడ్డి ఫార్మసిస్ట్ నెహ్రూ నాయక్ ఆర్ఎంపిలు హశం అలీ, సోమేశ్వర్ ,వేణు, శీను, శేషయ్య, భద్రమ్మ చిత్రపటానికి పువ్వులు సమర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.

రైతు కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి…

రైతు కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్ కి సంయుక్త కిసాన్ ,ఎస్, కె ఎం, ధ్వర్యంలో, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ విత్తన చట్టాలు, కార్మిక వ్యతిరేక 4లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలని, అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న ట్రేడ్ డీల్ వల్ల, భారత వ్యవసాయం నిర్వీర్యం అవుతుంది, తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కార్యదర్శి బండ పెళ్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు ఐ కె ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బాల యాకుబ్ రెడ్డి, ఏ ఐ యు కె ఎస్ జిల్లా కార్యదర్శి ఆవుల కట్టయ్య, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు నీరుటి జలంధర్, ఏఐసిటియు జిల్లా కోశాధికారి బొల్లోజు రామ్మోహన్ చారి, రైతుకూలీ సంఘం మండల నాయకులు సపావట్ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు.

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు.

ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు.

కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, స్థానిక తహసిల్దార్ వివేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version