కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం మల్గి డప్పురు గ్రామ శివారులలో కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కేంద్రం వద్ద ఈ నిరసన జరిగింది. పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, కెమికల్ పరిశ్రమల వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలు, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
