రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్.!

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్ మృతులకు సంతాపం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది హిందూ బంధువులకు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ ఉగ్రదాడి దారుణమైన దుశ్చర్య గా భావిస్తూ అన్ని కులాలను సమానంగా సోదర భావంగా భావించే ఈ భారత దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇకముందు హిందువుల పైన ఇలాంటి దాడులు జరిగితే ఊరుకోమని తెలియపరుస్తూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన హిందూ బంధువులకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనమందరము బాసటగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి,నరెడ్ల రాఘవరెడ్డి,గుల్లపల్లి నరసింహారెడ్డి,డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్ రెడ్డి, కూతురు వెంకట్ రెడ్డి లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు, దుండ్రా జలజా రెడ్డి, ముసుకు తిరుపతిరెడ్డి, ఏమి రెడ్డి కనక రెడ్డి, జువ్వెంతుల, లక్ష్మారెడ్డి మంద బాల్ రెడ్డి, కోశాధికారి- ఎడ్మల హనుమంత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ – భీమ నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి కరెడ్ల మల్లారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి,బిచ్చల రాజిరెడ్డి, సంతాపం ప్రకటించడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version