గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి
జమ్మికుంట ( నేటి ధాత్రి)
జమ్మికుంట మండలం జగ్గయ్య పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు (45) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలంలో నీటి పరిశీలిస్తున్న క్రమంలో గుండెపోటు కు గురయ్యాడు. పొలంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
