ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వర్దన్నపేట (నేటిధాత్రి):
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గ
మొదటగా వారి నివాస గ్రామమైన కట్ర్యాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై తదనంతరం ఇల్లంద గ్రామంలోని వారి అధికారిక కార్యాలయమైన వద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు నిర్వహించబడిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఎగురవేసి మువ్వన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమములో PACS చైర్మన్ కన్నయ్య,వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు ,ఎండి ఖాజామియా,ఎండి మహమూద్, బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,అంగోత్ నాను నాయక్,మల్యాల దేవేందర్,కాటబోయిన సంపత్,బండి సంపత్ గౌడ్,అల్ల కొమురయ్య,పబ్బతి సంపత్,పుల్లూరి దామోదర్,కర్ర మాలతి రెడ్డి,మార్కెట్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు,సూపర్ వైజర్ బి వెంకన్న ,మార్కెట్ సిబంది లు పాల్గొన్నారు.