బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జహీరాబాద్ మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మహారాజ్ మాట్లాడుతూ, రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
