చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ…

 చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ

 

చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

 రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ పరిపాలనకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చే ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్ చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన మాత్రమే కేంద్ర పరిశీలనలో ఉందని, అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని వివరించింది.
చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదనగా ఉంది. అయితే దీనిని పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తాజా వివరణ ఇచ్చింది. చండీగఢ్ పరిపాలనా నిర్మాణంలో మార్పులు చేసే ఆలోచన ఏదీ తమకు లేదని పేర్కొంది. చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హరియాణాతో దాని సంబంధాల్లో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదని పేర్కొంది. చండీగఢ్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చింది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది.

కాగా, ప్రస్తుతం ఆర్టికల్ 240 కింద కేంద్రపాలిత ప్రాంతాలుగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి ఉన్నాయి. ప్రస్తుతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా గవర్నర్ ఉన్నారు.

పరకాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం…

పరకాలలో బీసీల ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం శీతకాల సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి

ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ

పరకాల,నేటిధాత్రి

 

బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని పట్టణంలోని బస్టాండ్ కూడలివద్ద బిసి.జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు.ఈ దీక్ష శిబిరాన్ని ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేసి బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం నిమిత్తమై గవర్నర్ కు పంపగా గవర్నర్ ఆబిల్లును పెండింగ్ పెట్టి కాలయాపన చేసిన కూడా మరి ఒక ఛాలెంజిగా తీసుకొని జీవో విడుదల చేయడం జరిగిందని రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావలసిన హక్కు మరి రిజర్వేషన్లకు ఆ చట్టాన్ని ఉక్కు కవచం మాదిరి చేయాలంటే పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు కేటాయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఆముదాలపేల్లి మల్లేష్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పద్మశాలి సంఘం నాయకులు పోరండ్ల సంతోష్,సమన్వయ కమిటీ సభ్యులు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,సీతారాంపూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నల్లెల్ల అనిల్ కుమార్,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోడెల శ్రీనివాస్,గౌడ సంఘం అధ్యక్షులు బండి సదానందం గౌడ్,కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మార్కర్ రఘుపతి గౌడ్,రజక సంఘం అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి,వడ్ల సంఘం నాయకులు బాలాజీ స్వామి,కామరెడ్డిపల్లె బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోడెల సతీష్,ముదిరాజ్ సంఘం నాయకులు దామ అనిల్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొమ్మాటి సతీష్,రాయపర్తి శ్రీధర్,బిసి జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version