రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం…

రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం

రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలి

మోంథా తుఫాన్ తో తీవ్రతతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

అధిక వర్షాలు, మోంథా తుఫాన్, యూరియా కొరతలతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకొని పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల వ్యవసాయం అధిక వర్షాలు యూరియా కొరతతో అస్తవ్యస్తంగా మారిందని, పంటల దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో అరాకోరా పంటలు చేతికచ్చే దశలో మోంథా తుఫాన్ తో ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలలో పత్తి మొక్కజొన్న వరి తదితర పంటలు కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి సురేఖ,నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి
అదుపోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, డివిజన్ నాయకులు జన్ను రమేష్ ముర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బీసీల బంద్ కు మద్దతు తెలిపిన ఎస్టిపిపి, బిసి & ఓబిసి ఎంప్లాయిస్ …

బీసీల బంద్ కు మద్దతు తెలిపిన ఎస్టిపిపి, బిసి & ఓబిసి ఎంప్లాయిస్ 
భూపాలపల్లి నేటిధాత్రి 
https://www.youtube.com/live/IRnZGP8GIhg?si=jevx_LSjQLVKuZhw
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీల బంద్ కు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ బిసి& ఓబిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ తమ పూర్తి మద్దతు తెలపడం జరిగిందనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ కెవి శ్రీనివాసరావు  తెలియజేశారు. అలాగే ఎస్సీ  ఎస్టీ అసోసియేషన్ సభ్యులు కూడా బీసీల బంద్ కు పూర్తి సహాయ సహకారాలను అందించడం జరిగింది. 
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ కలసి ఎస్టిపిపి జిఎం. నరసింహారావు కి తమ డిమాండ్లను తెలియజేస్తూ మెమోరాండంను సమర్పించడం జరిగింది. దశాబ్దాలుగా బీసీ వర్గాలకు తగిన రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందడం లేదని దానివల్ల బీసీలు అన్ని రకాలుగా నష్టపోయారని తెలియజేశారు. బీసీ వర్గాలకు తగిన రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నిరంతర కృషి , అనేక ఉద్యమాల ఫలితంగా  ప్రస్తుత గవర్నమెంటు బీసీలకు ఇటీవల బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 9 ని విడుదల చేసిందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నాయకులు కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్నా కూడా రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగాల్లో తగిన విధంగా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా నేటి బంద్ మన బీసీ వర్గాల ఆత్మగౌరవంతో పాటు, దామాషా పద్ధతిన చట్టసభల్లో రాజ్యాంగ పదవులు సాధించడం భవిష్యత్తులో బీసీల రాజ్యమే ధ్యేయంగా ముందుకు కదలాలని కోరడం జరిగింది. 
అలాగే ఈ బీసీల బంద్ కి ఎస్టిపిపి ఎస్సీ మరియు ఎస్టీ అసోసియేషన్లు కూడా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బిసి రిజర్వేషన్ బందుకు మద్దతు సింగరేణి బీసీ అండ్ ఓ బి సి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు  ప్రధాన కార్యదర్శి  రమేష్  ఆదేశానుసారంగా భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు  మురళీమోహన్ కార్యదర్శి కురుట్ల నవీన్ కుమార్  కేటీకే 8 ఇంక్లైన్ గని మేనేజర్ కి 42% శాతం రిజర్వేషన్ కోసం రామన్న చంద్రగిరి శంకర్ రామగిరి శంకర్ కుడుదుల రాయమల్లు శ్రీనివాస్ శంకర్ మిగిలిన బీసీ సభ్యులందరూ పాల్గొని  మెమోరండం  ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో 
బిసి ఒబిసి వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టిపిపి నాయకులు పాల్గొన్నారు
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version