రన్ పర్ బిసి సోషల్ జస్టీస్ విజయవంతం
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రన్ పర్( పరుగు) ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ కూడలి వరకు కొనసాగిన ఈ రన్ (పరుగు) జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ కమిటీ పట్టణ అధ్యక్షుడు సకినాలు శంకర్ ఆధ్వర్యంలో బీసీ బాంధవులు ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయడం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రావలసిన హక్కులకై న్యాయపోరాటం రాజకీయ పోరాటం చేయకుంటే రేపటి తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్లకు అవుతామని, బీసీ ఉద్యమాన్ని అణగదొక్కలనీ మన స్వరాన్ని అణిచివేయడానికి పన్నుతున్న బీసీ వ్యతిరేకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మౌనంగా ఉండకుండా ఎదిరించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బీసీ బిల్ పై పార్లమెంట్లో చర్చ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరణ చేసి 9వ, షెడ్యూల్లో చేర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాలలో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ బిసి జస్టీస్ ఉద్యమ బీసీ జేఏసీ పిలుపుమేరకు కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నేరేళ్ల వెంకటేష్, మందమర్రి పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ బాబు, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, ఏదుల పురం రాజు, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, మడ్డి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జమాల్పూర్ నర్సోజి, మునిశెట్టి సత్యనారాయణ, పొలు సంపత్, మేడ గోని శంకర్, పోలు కుమార్, రాజలింగు, చింతల రమేష్, సిహెచ్. మహేందర్, మేడి రాజు, సముద్రాల శ్రీనివాస్, ఒడ్నాల ప్రభాకర్, ప్రసాద్, మందమర్రి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు రామ్ చందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
