జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ?

జర్నలిస్ట్ లకు రక్షణేది?

జర్నలిస్ట్ ల పై కొనసాగుతున్న దాడులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలో జర్నలిస్ట్ లపై దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్ట్ లపై అన్యాయాన్ని,తప్పులను ప్రశ్నించడం తప్పు అని సమాజంలో ఉండే దోపిడీ వర్గాలు బెదిరింపులకు దాడులకు తెగబడుతున్నాయి. మంచిర్యాల జిల్లా లో 63వ జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న మెగా కంపెనీ రోడ్ల పై ఓవర్ లోడింగ్ తో నిబంధనలకు విరుద్ధంగా లారీలు నడిపించింది.ప్రజలు తమకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి అని లారీలు ఆపి ధర్నా చేసిన ఫలితం శూన్యం.ఈ సందర్భంగా ప్రొక్లెయిన్ మిషన్ రోడ్ల పై నిలపగా జైపూర్ మండలం కుందారం జర్నలిస్ట్ మార్క శేఖర్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను రోడ్ల పై నిలపకండి అనగా మెగా కంపెనీ సిబ్బంది,క్యూ న్యూస్ జర్నలిస్ట్ శేఖర్ బండి తాళం లాక్కొని దాడి చేశారు.దీనిపై జర్నలిస్ట్ శేఖర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామన్నారు.జర్నలిజం ను తిడుతూ,ప్రజల తరుపున ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడి ఎంత వరకు సబబు అని జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.ఇక్కడ ఒక్క దగ్గరే కాదు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతుందని జర్నలిస్ట్ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.జీతం లేకున్నా కేవలం సమాజ సేవకై ,ప్రజలకు,ప్రభుత్వానికి వారధిలా ఉంటూ పరిపాలనలో ముఖ్యమైన పాత్ర జర్నలిజం పోషిస్తుంది.ఇప్పటికీ నిజాయితీగా పని చేసే జర్నలిస్ట్ లకు కనీసం తమ కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.కనీసం సొంత ఇండ్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ,లోపల చిరిగిన బనియన్లు,బయట మామూలు బట్టలతో,ముఖం మీద చిరునవ్వుతో ప్రజాసేవ లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేస్తున్నా వారి జీవితానికి రక్షణ లేదు.జర్నలిస్ట్ లపై కేసులు వేయడం,చంపడం,దాడులు చేయడం జరుగుతున్నాయి.మరి తన మీద ఆధారపడిన కుటుంబం పరిస్థితి ఏంటి?ప్రజాస్వామ్యం లో 4వ స్థంభంగా ఉన్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి.దాడుల నుండి రక్షణ కల్పించాలి.జర్నలిస్ట్ లకు ప్రత్యేక నిధులు కేటాయించి,ఉపాధి అవకాశాలు కల్పించాలి.ప్రమాదాల్లో చనిపోతున్న జర్నలిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.ఇంటి స్థలాలు ఇవ్వాలి.హాస్పటల్ లలో జర్నలిస్ట్ ల కుటుంబాలకు ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించాలి.ప్రైవేట్ స్కూల్ ల్లో జర్నలిస్ట్ ల పిల్లల కు ఉచిత విద్య అందించాలి. జర్నలిస్టులపై ఎవరైనా దాడులకు దిగబడితే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా, గత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కామగోని శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్,దీకొండ తిరుమల, పొన్నగంటి స్వామి, సత్య కుమార్, వడ్లకొండ పవిత్రన్,గట్ల అమర్,పిట్టల కుమారస్వామి, బుర్ర వేణు గౌడ్, మహాదేవుని జగదీష్, వడ్లకొండ రాజ్ కుమార్, ప్రశాంత్, శోభన్ , సిద్దు ఆకారపు స్వామి, శోభన్, కార్తీక్, నరేష్,కామిశెట్టి రంజిత్, ముత్తోజు కిరణ్, రమేష్,ఆకారపు మోహన్,గాదం రవి,మైలగాని సందేశ్, మహమ్మద్ ఇబ్రహీం, జట్టబోయిన సాంబమూర్తి, పోశాల రాంబాబు, జూలూరి నరేష్, జనగాం ప్రవీణ్, ఈదుల కృష్ణ, , బుద్ధరత్నం, పెండ్యాల రమేష్,ఇమ్రాన్,రానా,సునీల్, పాల్గొన్నారు.

జర్నలిస్టుల అరెస్టులను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోంది

జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము

ఇది మీడియా స్వేచ్ఛపై నేరుగా దాడి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూజే-ఐ)

భూపాలపల్లి నేటిధాత్రి

 

సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేష్,చారి,సుధీర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూజే-ఐ) తీవ్రంగా ఖండిస్తుందని టిఎస్ జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు తెలిపారు.బుధవారం వారు మాట్లాడుతూ
ఈ అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించే చర్యలని అన్నారు.ఈ అరెస్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం,వీడియో స్వేచ్ఛగా రాయొద్దు,ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు,అధికారంలో ఉన్నవారి మీద కథనాలు రాస్తే జైలు తప్పదు అని చెప్పాలనుకుంటున్నట్టుగా ఈ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.ఒక పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు,అందులోని నిజానిజాలపై అధికారులు విచారణ జరిపించాలి.కానీ ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన జర్నలిస్టుల మీదే కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా సమంజసం కాదన్నారు.అనేక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే కథనాలు తయారవుతాయన్నారు.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు, అధికారులు మీద ఆరోపణలు వస్తే,ఆ ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం,తప్పు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కానీ ఆ పని చేయకుండా,జర్నలిస్టుల మీద పడి కేసులు పెట్టడం అంటే,ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడమేనని చెప్పారు.ఏ వ్యక్తిగత ఫిర్యాదు లేకుండా,ఆ కేసులో పేర్లు లేకున్న కేవలం ఒక సంఘం ఫిర్యాదును ఆధారం చేసుకొని జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పూర్తిగా తప్పని, ఇది చట్టం కాదనీ ,ఇది భయపెట్టే ప్రయత్నం అన్నారు.ప్రభుత్వం ఈ కేసు ను వెంటనే ఎత్తివేసి,జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.మీడియా స్వేచ్ఛపై దాడులు ఆపకపోతే పెద్ద జర్నలిస్ట్ ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు కడపాక రవి,పల్నాటి రాజు, మారపేల్లి చంద్ర మౌళి, భూపాల్,జగన్, కారుకూరి సతీష్ హేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version