ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ రోడ్డు దగ్గర చెత్త దుర్గoదం పందుల స్వైర విహారం…

ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ రోడ్డు దగ్గర చెత్త దుర్గoదం పందుల స్వైర విహారం
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లారీ ధర్మారెడ్డి ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో చెత్త దుర్గంధం పందులు దుర్గoద o చేస్తున్నాయని దుర్గంధం సీజనల్ వాతావరణం సందర్భంగా ఇండ్ల లోకి దోమలు ఈగలు వస్తున్నాయని కాలనీవాసులు దాచ లక్ష్మీనారాయణ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పట్టణ ప్రణాళిక లో భాగంగా అక్కడ ఉన్న దుర్గంధం చెత్తను తొలగించాలని ఆయన కోరార లేనిచో సోమవారం నాడు వనపర్తి మున్సిపల్ అధికారులపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మీనారాయణ విలేకరులకు చెప్పారు

వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం…

వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం

ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని స్థలాన్ని మున్సిపాలిటీ కి స్వాధీనo చేసుకోవాలని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాధవి రమేష్ కు ఆమె నివాసంలో కలిసి వినపత్రం ఇచ్చామని సతీష్ యాదవ్ తెలిపారు కర్నూల్ రోడ్డులో పానగల్ రోడ్డులో రోడ్డు చిన్నదిగా ఉన్నదని తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంతవరకు కూలగొట్టలేదని ఆయన ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ఆదేశాలు పరిగణలోకి తీసుకొని విది విధానాలు రూపొందించి వెంటనే రోడ్ల విస్తరణ పనులు ఆక్రమణాలను కూల గొట్టాలని ఆయన కోరారు అదేవిధంగా వనపర్తి పట్టణంలో పార్కుల స్థలాలు కబ్జాల కు గురయ్యాయని కొంతమంది రోడ్ల పక్కన మోరీలపై షెడ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చారని మోరీలపై రేకుల షెడ్లు వేశారని వాటిని తొలగించాలని ఆయన కోరారు రోడ్ల విస్తరణలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వనపర్తి లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి జరిమానాలు విధించాలని ఆయన కోరారు పాత మార్కెట్ యార్డులో సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ ను టెండర్లు నిర్వహించి అద్దెలకు ఇవ్వాలని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అదేవిధంగా చిన్న కిరాణం వ్యాపారస్తులకు స్వల్ప అద్దె కు ఇవ్వాలని కోరారు కమాన్ చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోడ్డు చిన్నదిగా ఉండడం వల్ల సంత ప్రతి ఆదివారం ఉంటుందని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు పాత మార్కెట్ యార్డ్ సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ కూరగాయల వ్యాపారులకు చిన్న కిరాణా వ్యాపారులకు అక్కడ వ్యాపారం చేసుకొనుటకు షాపులు ఇప్పించాలని ఆయన కోరారు రాజీవ్ చౌక్ నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల వివేకానంద చౌరస్తా నుండి కర్నూల్ రోడ్డు వరకు రోడ్డు సెంటర్ నుండి అటు ఇటు ఎవరికి నష్టం జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆక్రమణలను కొలగొట్టాలని ఆయన చైర్మన్ కి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు అదేవిధంగా మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు పట్టణ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ ను కోరారు చట్టంలో అందరు సమానులేనని అక్రమ ఆక్రమణలపై మున్సిపల్ లో కమిషనర్ తో చర్చించి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదేశాలను పరిగణంలోకి తీసుకొని తొలగించాలని ఆయన కోరారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొత్త గొల్ల శంకర్ వెంకటేశ్ చంద్రశేఖర్ దయనంద్ ముదిరాజ్ రామస్వామి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

ఎరువుల షాపుల తనిఖీలు.

ఎరువుల షాపుల తనిఖీలు.

జిల్లా వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు
మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీరా శ్రీనివాసరావు కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న తో కలిసి తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి డీలరు రైతులకు యూరియా విధిగా యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వారు తెలిపారు, అదేవిధంగా ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు పి ఓ ఎస్ బ్యాలెన్స్, గోదాం బాలన్స్ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కేసముద్రం మండలంలోని తార్యతండ గ్రామ శివారులో వరి పంట క్షేత్రాలను గ్రామ రైతులతో కలిసి సందర్శించడం జరిగింది, ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు మోగి పురుగు మరియు జింక్ లోపాలను గమనించడం జరిగింది, వారు మాట్లాడుతూ అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు కలిపి పిచికారి చేయాలని అదేవిధంగా పొడ తెగులు నివారణకు ప్రొపికొనోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి1 మిల్లీమీటర్, అదేవిధంగా మొగి పురుగు నివారణకు కాట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే పురుగుమందు లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి పిచికారి చేయాలని, సూక్ష్మధాతు అయినా జింకు లోపాన్ని నివారించడానికి చీలేటెడ్ జింకు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు ముడి జింకు కలిపి పిచికారి చేసి పైన తెలిపిన తెగుళ్లు మరియు పురుగులను నివారించవచ్చని వారు సూచించారు, అదేవిధంగా ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ, యాసంగి పంట నమోదు తప్పకుంట చేయించుకోవాలని వారు సూచించారు .
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి.వెంకన్న, మరియు రైతులు మూడవత్ బుజ్జి శంకర్, రాజ్ కుమార్, రవీందర్, పాల్గొన్నారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 17, 31, 32, 33 వార్డులలో చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి,వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.గ్రామ,మండల,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం,అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లలు భద్రత,వ్యవసాయం, విద్య,యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి

వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం…

వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య.

కారేపల్లి నేటిదాత్రి

దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు కూచించుకు పోతుంది అని. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిపోయి సంక్షోభం వైపు పరుగులు తీస్తుందని. ఆదాని అంబానీ లాంటి కుబేరులు మరింత పెరిగిపోతూ సంపన్నులుగా మారిపోతున్నారని. పేదలు మాత్రం కటిక దరిద్రంలోకి నెట్టబడుతున్నారని అర్ధాకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అంటూ దేహరించాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని వ్యవసాయ కూలీలు రైతాంగ కార్మిక వర్గం లాంటి అన్ని వర్గాలపై తన దాడిని ఎక్కిపెట్టిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకే ఎంఎస్ ఖమ్మం డివిజన్ ప్రధమ మహాసభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో అమరుడు లక్ష్మీనరసు నగర్ లో కూరాకుల నరసయ్య అధ్యక్షతన జరిగింది.

మా సభకు ముందుగా డివిజన్ అధ్యక్షులు కూరాకుల నరసయ్య జండా ఆవిష్కరించారు ఈ మహాసభకు ప్రారంభ ఉపన్యాసకులుగా గుమ్మడి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అనేక చట్టాలను మార్చి కొత్తవి చేసి ప్రజలను పీడిస్తుందని. యాట రెండు కోట్ల ఉద్యోగాల మాట అటకెక్కిందని. నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని ప్రజలను దగా చేసిన ప్రధానిగా మోడీ నిలిచారని. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని. భారతదేశం వెలుగు పోతుందని తెగ ప్రచారం చేసుకుంటున్నా భారత పాలకులు ఆకలి సూచికల్లో 127 దేశాల్లో 105వ స్థానంలో ఉన్నదని అంటే మన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని గుమ్మడి నరసయ్య అన్నారు.

ఈ మహాసభలో కార్యదర్శి కే లో పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వివిధ కారణాలతో రైతాంగ కార్మిక పోరాటాలలో అమృతం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య ఉపాధ్యక్షులుగా చల్ల రాజు ప్రధాన కార్యదర్శిగా కే లోతు పాపారావు సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు కోశాధికారిగా ఎస్ కె హుస్సేన్ బి తో పాటు 16 మందిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
మహాసభ కొత్తగా తెచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని.
200 రోజులు పని దినాలు కల్పించాలని.
ఎలాంటి షరతులు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని. 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని మహాసభ తీర్మానించనైనది. మార్చి 24 25 తేదీలలో కామారెడ్డిలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ ఏఐపీకే ఎంఎస్ నాయకులు చల్ల రాజు రావుల నాగయ్య మేక రామనాథం పొట్లపల్లి కృష్ణ కోడం సీతారాములు గుమ్మడి ఎర్రయ్య గుమ్మడి సరోజిని అనసూర్య సీత సమ్మక్క సత్తిరెడ్డి సక్రు రాము రమణ తదితరులు.

గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే…

గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
చిన్నారుల విజయానికి ఘన సత్కారం
ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాంబాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

కొండాపూర్‌లోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు తమ తొలి విద్యా మెట్టును అధిరోహించి పై తరగతులకు వెళ్తున్న తరుణంలో నిర్వహించిన ఈ వేడుక కంటికి పండువగా సాగింది.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్న వయసులోనే ఇటువంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే గొప్ప భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అకాడమిక్ కోఆర్డినేటర్ శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధను కొనియాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రావంతి మరియు పీపీటీ ఇన్‌చార్జ్ నళిని కొండ సమక్షంలో విద్యార్థులకు పట్టాలు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు. తమ పిల్లల తొలి విజయాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వంగా, ఆనందంగా భావించారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలి. రాజకీయ రంగాలలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.

లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలి. రాజకీయ రంగాలలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలంలోని ఖాసింపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు ఉత్సవాలు జరుపుకున్నారు..ఈ కారీక్రమంలో కేక్ కట్ చేసి ఒకరి కొకరు తినిపించుకోవడం జరిగింది. తదనంతరం కరిక్రమంలో పల్గొనడానికి విచ్చేసిన మహిళల్ని ఉద్దేశించి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహిళలకు మద్దతుగా ఎవరు రానక్కరలేదు. వాళ్ళకు ఒక గళం ఉంది. దాని ఉపయోగించు కోడానికి ముందుకు వచ్చినప్పుడు సాధికారత సాధించినట్లే .అన్ని రంగాలలో అడుగు పెట్టాలి ఇంకా మనల్ని వెనకకు లాగుతోంది ఏంటో తెలుసుకోవాలి ?ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం కోరడం, ఏ సమస్య ఎదురైన నిబ్బరంగా ఎదుర్కుంటూ ముందుకు వెళ్ళండి-ప్రతి సవాలూ మనలో ధైర్యాన్ని నింపుతుంది. కొత్త విషయాలు నేర్పుతుంది అంతేకాని నావల్ల ఏమీకాదు. నేనేమీ చేయలేను అని ఊరుకుంటే అక్కడే ఉండిపోతాం అలాగే నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి మన హక్కులు బాధ్యతలను గ్రహిస్తూ, శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగడమే అసలైన మహిళా సాధికారత.ఈ కారీక్రమంలో మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు చంద్రకళ, స్వప్న, ఈశ్వరమ్మ, భాగ్యలక్ష్మి, బుజ్జమ్మ, పారమ్మ, వినోద, భరతమ్మ, సిద్దమ్మ, సువర్ణ, సురేఖ, సంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ 20 వ వార్డులో
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ఉదయ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దేవన్ కౌన్సిలర్లు రాజు నాయక్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులలో ఈరోజు పర్యటించడం జరిగింది సైడ్ కాలువలను డ్రైనేజీలను శుభ్రం చేయడం వార్డులలో చెత్త చెదారం లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు

జమ్మికుంటలో రేపు ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం

జమ్మికుంటలో రేపు ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం

 

 

మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 8న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట శాఖ, రెనోవా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, రక్త పరీక్షలతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్ నిపుణులు ఉచితంగా వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తారు.

అబాది జమ్మికుంట సెయింట్ థామస్ పాఠశాల అధ్యాపకుల…

అబాది జమ్మికుంట సెయింట్ థామస్ పాఠశాల అధ్యాపకుల ఆహ్వానం మేరకు కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట ( నేటి ధాత్రి )

 

 

 

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ మాట్లాడుతూ సెయింట్ థామస్ పాఠశాల ప్రారంభం నుండి చుట్టు పక్కల గ్రామాల పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించి ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతస్థాయికి వెళ్ళేలా విద్యను అభ్యసించిన పాఠశాల అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ గారు కౌన్సిలర్లూ ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవి, చింతల శ్రీనివాస్, పోల్నెనీ అజయ్ , కొలుగూరీ సురేష్ , మంద రాధ.రాజేష్, పోలు దివ్య బిక్షపతి, పోల్నెనీ శిల్పా వేణు పాఠశాల అధ్యాపకులు చరణ్ తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

షార్ట్ సర్క్యూట్తో మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం…

షార్ట్ సర్క్యూట్తో మెడికల్ స్టోర్లో అగ్ని ప్రమాదం

జమ్మికుంట ( నేటి ధాత్రి )

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం
పక్క వీధిలో గల శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్ లో శనివారం రోజున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మెడికల్ స్టోర్ లోని ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగి మెడికల్ స్టోర్ పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం జరిగిన సమయంలో షాపు యజమాని జడల పండరి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రక్కన నివసిస్తున్న వారు షాప్ యజమాని ఇంటి నుంచి మరో తాళపు చెవి తెప్పించి షాప్ తెరిచి ఎగసిపడుతున్న మంటలను బకెట్ల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడం జరిగింది

మెడికల్ స్టోర్ లో మందులు చాలా వరకు దగ్ధం కాగా మిగతా మందులు పనికిరాకుండా పోయాయి షాపులోని ఫర్నిచర్స్ పనికిరాకుండా పోయింది అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టం దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది అని అంటున్న షాప్ యజమాని.

ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు…

ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు

భాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం,సరుకుల వితరణ కార్యక్రమాలు

ప్రజల కష్టాలలో ముందుంటున్న మాజీ కౌన్సిలర్ రజిని నవీన్

పరకాల,నేటిధాత్రి

 

గెలిచినా ఓడినా ప్రజా సేవే తమ లక్ష్యమని,ప్రజలే తమకు దైవమని పరకాల మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరకాల పట్టణంలోని 17వ వార్డు నుండి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం రజినీ నవీన్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క బ్యాలెట్ ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ప్రజల మధ్యనే ఉండి సేవ కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా రజినీ నవీన్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని తెలిపారు.ప్రజల కోసం పని చేయడమే తమ అసలు లక్ష్యమని చెప్పారు. ప్రజలు చూపిన ఆదరణ,విశ్వాసం తనకు మరింత బాధ్యతను కలిగించిందని అన్నారు.గతంలో తాము పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఆయన తెలిపారు.తమ సేవలను గుర్తించిన ప్రజలు రిజర్వేషన్‌లో భాగంగా 17వ వార్డులో పోటీ చేయాలని కోరడంతో పాటు పార్టీ ఆదేశానుసారం ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.అయితే ఎన్నికల్లో కేవలం ఒకే ఓటు తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజలపై ఉన్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.తమకు ఓటు వేసిన వారే కాకుండా ఓటు వేయని ప్రజల కోసం కూడా సమానంగా సేవ చేస్తానని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానని వార్డు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల 17వ వార్డులో మరణించిన కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అవసరమైన సహాయం కూడా అందిస్తున్నారు.ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ప్రజల పట్ల చూపుతున్న ఈ స్పందన చర్చనియమైంది.ప్రజా సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్య ఉండడం ఆయన నాయకత్వ లక్షణాన్ని చూపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ ప్రజా సేవలో వెనుకడుగు వేయకపోవడం అభినందనీయమని వార్డు ప్రజలు చెబుతున్నారు.ప్రజల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి….

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి

అభివృద్ధి సమన్వపర్య వేక్షణ కమిటీ (దిశ) సమావేశం

శాయంపేట నేటిధాత్రి:

హన్మకొండలోని కలెక్టర్ కార్యా లయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వ హించిన జిల్లా అభివృద్ధి సమ న్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడి యంకావ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమా వేశంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావుపాల్గొన్నారు.సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురో గతి, ప్రజ లకు అందుతున్న సేవలపై అధికారులు వివరా లు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకుల మరియు ప్రభుత్వ పాఠశాలలో టాయి లెట్స్ అంతర్గతo లేకుండా ,కోతుల బెడద లేకుండా , కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయా లని, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని, అదే విధంగా మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్య లేకుండా,అభివృద్ధి కార్యక్ర మాలు వేగవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారు లకు తగిన సూచనలు చేశా రు. ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి , కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజిపై , జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు మరియు సంబంధిత విభా గాల అధికారులు పాల్గొన్నా రు.

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర…

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. తనిఖీలో భాగంగా ఆయన పరిశీలించిన
తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్, విద్యార్థుల బోధనాంశాలను అడిగి తెలుసుకున్నారు. గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు.
ఉపాధ్యాయులు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. గోడపై ఉన్న మ్యాథ్స్ చార్టులను
గమనించి, ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు హాస్టల్ వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
పాఠశాల ఆవరణను, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి…

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థుల చదువు స్థాయి, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రత, పోషకాహారం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి, యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు.

దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు.

బెల్టు షాపులతో మందుబాబుల జేబులకు చిల్లు

పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు..

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం..

నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి..

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులు నడుపుతున్నారని ఆరోపణలను జోరుగా జరుగుతున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి.గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నిషేధిత బెల్టు షాపులను ఆసరగా తీసుకున్న మద్యం దుకాణాల యాజమాన్యాలు మద్యాన్ని అధిక ధరలకు బహిర్గతంగా అమ్ముకుంటున్నారని బాహుబాటంగా చెపుతున్నారు.

ఈ వ్యవహారం మొత్తం సంబంధిత ఎక్సైజ్ అధికారులు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు ఆరోపిస్తున్నారు.దుగ్గొండి మండలంలో మూడు మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహించిన టెండర్ లను దక్కించుకొన్న కొందరు వ్యాపారులు దుగ్గొండి మండల కేంద్రంలో ఒక షాపు, గిర్నిబావిలో రెండు దుకాణాలు ఉన్నాయి.ఐతే మద్యం వ్యాపారస్తులు అధిక కాసులకు కకృత్తిపడి సిండికేట్ గా మారి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటున్నారని పలువురు తెలుపుతున్నారు.

ఒక పుల్ బాటిల్ కు రూ.80 అదనపు వసూల్..

దుగ్గొండి మండలం పరిధిలోని ఆయా గ్రామాలను మూడు మద్యం దుకాణాల యాజమాన్యాలు మూడు భాగాలుగా విభజించుకున్నారు.వారు నిర్ణయించుకున్న గ్రామాలకు సంబంధించిన బెల్టు షాపుదారులు వారు నిర్ణయించుకున్న మద్యం దుకాణంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాలని హుకుం జారీచేశారు.బీర్ బాటిల్,ఏదైనా క్వార్టర్ సీసాకు రూ.20 అదనంగా,అలాగే ఫుల్ బాటిల్ కు రూ.80 ఎక్కువ తీసుకొని బెల్టు షాపులకు విక్రహిస్తున్నారు.అలాగే మందు బాటిళ్లకు షాపుల వారిగా ప్రత్యేక స్టిక్కర్లు అంటించడం,మద్యం దుకాణాల యాజమాన్యాలనే ఎక్సైజ్ శాఖ పోలీసుల అవతారంలో బెల్ట్ షాపులపై రైడింగ్స్ చేయడం జరుగుతున్నదని పలువురు మందుబాబులు తెలుపుతున్నారు.గ్రామాల్లో సాధారణ కుటుంబాలు నిత్యం కూలినాలి చేసుకొని మద్యం సేదతీరేందుకు వెళ్లిన మందుబాబులకు అధిక రేట్ల వసూల్ లతో వారి జేబులకు చిల్లు పడుతున్నాయని పలువురు మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మద్యం దుకాణాలలలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాల యాజమాన్యాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.

అధిక ధరల విక్రయాల పట్ల విచారణ చేయడతాం

*దుగ్గొండి మండలం పరిధిలోని నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయాల పట్ల విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి స్పష్టం చేశారు.గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని అన్నారు.

దుగ్గొండి మండలం ఉన్న మూడు మద్యం దుకాణాలల్లో ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరగాలి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో రెండవశనివారం పూజలు.

బ్రహ్మోత్సవాలలో రెండవశనివారం పూజలు.

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని తాళ్ల పూసపల్లి గ్రామంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ శనివారం లక్ష పుష్పాలతోలతో సహస్ర నమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు గంప లక్ష్మణాచార్యులు, గంప శ్రావణ్ కుమారాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామీ వారికి తెలుగు నామ సంవత్సరం ఉగాదికి ముందు నాలుగు శనివారాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామం నుండే కాకుండా మండలం చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి పూజలు నిర్వహిస్తారాన్నారు. గతంలో ఇక్కడ స్వామీ వారి దేవాలయం చుట్టూ ఎడ్ల బండ్లు కూడ తిరిగేవని, నాలుగు వారాలు పండుగ వాతావరణం ఉండేదని, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రజలు కొలుస్తారని అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, పాలకులు దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు,

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించి మండల విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా మరియు ఇతర బాధ్యతలను చేపట్టి ఒకరోజు పాటు పాఠశాల కార్యకలాపాలను నిర్వహించారు. డి ఈ ఓ గా బానోతు సూర్య తేజ, ఎం ఈ ఓ గా గట్ల మనీషా,ప్రధానోపాధ్యాయులుగా గుండెబోయిన సుస్మిత, ఉపాధ్యాయులుగా లకావత్ ఇందు, గుండెల బిందు, బట్టి దివ్య, భూక్య ధీరజ్, నిమ్మల శ్రీ వేణి, మహమ్మద్ రెహనా, మహమ్మద్ రియాజ్, లకావత్ చరణ్, అటెండర్ గా కోడి రాకేష్ విధులు నిర్వర్తించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తరగతులు బోధించడం, అసెంబ్లీ నిర్వహించడం మరియు పాఠశాల వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాధ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికీ చికెన్ కూరతో మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుండు సురేందర్, వీసం నర్సయ్య, వెలమాల భాస్కర్ భాస్కర్, , అప్పాల నాగరాజు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు

వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు సత్కారాలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో భాగంగా రాజకీయంగా మహిళా మణులు, మహిళ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మాట్లాడుతూ… సమావేశంలో మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర గురించి అంతా ఇంతా చెప్పలేము అని అలాగే మహిళల అభివృద్ధి కోసం నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, విద్యా అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై చర్చించారు.
అదే విధంగా మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, మహిళలకు సమాన హక్కులు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏం సి చైర్మన్, టౌన్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ రోజా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, అన్ని మండలాల అధ్యక్షురాలు, జిల్లా కార్యవర్గం టౌన్ కార్యవర్గం అందరూ కూడా కాంగ్రెస్ మహిళా సోదరీమణులు అందరు కూడా పాల్గొనడం జరిగినది.

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగాపెన్నులు ప్యాడ్లుపంపిణీ కార్యక్రమం….

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగాపెన్నులు ప్యాడ్లుపంపిణీ కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు.ప్యాడ్లుపంపిణీ చేశారు.. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీ రామారావు చిరు కానుకగా అందిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా పెన్నులు ప్యాడ్స్ అంద.జేయడంతో పాటు. ముందుగా. టెన్త్ విద్యార్థులకు కేటీ రామారావు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్ష రాసి విజయం సాధించాలని విద్యార్థులందరికీ ఈరోజు మండేపల్లి గ్రామంలో స్థానిక. Z.P.H.S. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పదవ తరగతి వార్షిక పరీక్షలు. రాయ.బోతున్న.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు. బి ఆర్ ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు. ముందుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పెన్నులు. ప్యాడ్స్ లు. పంపించి వారికి అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో . ప్రధానోపాధ్యాయులు వాసు.దేవారావు. దేవేందర్ రావు. మల్లికార్జున్. విమల. ఆంజనేయులు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి.బి ఆర్ ఎస్ నాయకులు. మండేపల్లి మాజీ సర్పంచ్ గడప శివ జ్యోతి. తంగళ్ళపల్లి దేవయ్య. మాజీ ఎంపిటిసి. మాజీ ఉపసర్పంచ్ ధర్మారెడ్డి. నాగరాజు. వార్డు సభ్యుడు. ప్రభుదాస్. మల్లేశం. కిషన్ గౌడ్. రాగి పెళ్లి కృష్ణారెడ్డి. ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version