ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

బీఎస్పీ పార్టీ నాయకుల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలో ఆన్లైన్లో బుక్ చేసిన రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా 100 రూ” వరకు వసూలు చేస్తున్నారని (రిసిప్ట్ బిల్లు) అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజలను వారి బారి నుండి కాపాడాలని వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు.

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు

ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని  కోరుకుంటున్నాను

వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత.

వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత

వెంటనే సవరించాలని డిమాండ్

నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన ఎంసిపిఐ (యు) నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన లో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఎం సిపిఐ( యు) నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగ సుధా , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఇటీవల కొన్ని గ్రామాలను నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేయగా , ఆ గ్రామాల ఓటర్లను రెండు ,మూడు వార్డుల్లో వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గ్రామాల విలీనం తో ఒకవైపు ప్రజలు ఉపాధి కోల్పోగా ,ఇది చాలదన్నట్టు ప్రజలను మరింత అస్థిరపరిచేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అదే రకంగా పట్టణంలోని జ్యోతిబాసు నగర్ , కారల్ మార్క్స్ కాలనీలో చాలా ఏళ్లుగా సమస్యలు వెంటాడుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు ఘోర వైఫల్యం చెందారన్నారు .ఇప్పటికైనా కాలనీలో అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో దశలవారి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ , పట్టణ నాయకులు భైరబోయిన నరసయ్య ,బెజ్జంకి పుష్పనీలా , జన్ను విజయ తదితరులు పాల్గొన్నారు .

స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ.

స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో సోమవారం స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానంద భారతదేశంలోని యువతకు రోల్ మోడల్, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించుకునే స్థాయిలో మాట్లాడి మెప్పించారు , యువత వివేకానంద చూపించిన మార్గంలో నడవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమన్ గల్ మాజీ జడ్పిటిసి కండే హరిప్రసాద్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మండలంలోని మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
ఐలోనోళ్లకు నచ్చకపోతే అంతే సంగతులు
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి.

ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి రేవన్యూ సదస్సు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి

 

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.

సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

MRO Vijayalakshmi.

 

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా..హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సోమవారం 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

మండల విద్యాధికారి కాలేరు యాదగిరి

2025 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన పెనుగొండ ఉన్నత పాఠశాల విద్యార్థికి సన్మానం:

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల యశ్వంత్ సాయిని మరియు అతని తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల శ్రీను, సరస్వతి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి చిన్నప్పటి నుండి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయుటకు ఈ విద్యార్థి సాధించిన మార్కులే నిదర్శనమని తెలియజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అందుకు మా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉంటాయని తెలియజేశారు. జడ్పిహెచ్ఎస్ పెనుగొండ పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పెనుగొండ పాఠశాలలో అత్యుత్తమమైన విద్యా బోధన మా పిల్లలకు అందుతుందని మా పిల్లల్ని తల్లిదండ్రుల వలె ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో చదువు నేర్పుతున్నారని చెప్పారు. ఈ సన్మాన సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య, హుస్సేన్, వెంకటగిరి, భాస్కర్, సత్యం, రవి, భీముడు, కిషన్, మల్లేశం, విజయ్ చందర్ మరియు అప్పరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేశారు.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున కలెక్టర్ వినతి పత్రం అందజేత

మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో కెసీఆర్ హయాంలో ప్రతిష్టా త్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని నరికి వేసి అక్కడ గ్రామపంచాయతీ భవనం నిర్మించుటకు అధికా రులు సిద్ధమై గ్రామస్తులు వద్ద ని మొరపెట్టుకున్నా కొందరి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.గతంలో గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మార్వో పరిశీలించి నిర్ధారణ చేసిన 0.06 గుంటల కాళీ స్థలం పల్లె ప్రకృతి వనానికి పక్కనే ఉన్నందున గ్రామస్తుల కోరిక మేరకు ఆ స్థలంలోనే నిర్మించాలేతప్ప పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేయకూడ దని గ్రామస్తుల సహకారంతో కలెక్టర్ వినతి పత్రం అందజే సిన మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో జాలిగాపు అశోక్, ఎండి మగ్దున్ పాషా, పోతు రమేష్, పెరుమాండ్ల కుమారస్వామి, సప్పిడి పోషాలు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత(Namrata) , సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.

 

ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు.

ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..ఎవరూ అదైర్యపడొద్దు

పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, పత్రాల పంపిణీ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు.

ఉద యం నుండి సాయంత్రం వరకు శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.

మండల పరిధిలోని పలు గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలకు హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక లల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పంద న బాగుంటుందన్నారు.

గత పాలకులు ఎమ్మెల్యే నివాసా లు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిం దని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరంకేటాయిం చిందని, ఆర్థికంగా ఇబ్బందు లు ఉన్నప్పటికీ పేదల సంక్షే మం అజెండాగా పాలన కొనసాగుతుంది గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయా లని, ఎక్కడ లంచాలకు ఆస్కా రం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నా మని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడా లని తాము ప్రయత్నిస్తు న్నామని ఎమ్మెల్యే అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వని ప్రతిపక్ష నాయకులు ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకాల ద్వంసానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Indiramma’s house

 

 

ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవ ర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనుల కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

మేము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు.

బీఆర్ఎస్ గుండా యిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందుకున్న పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతో షంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికా రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు

విహర యాత్రల పోస్టర్ విడుదల.

విహర యాత్రల పోస్టర్ విడుదల

యాత్రల స్థలాలకు డిలక్స్,ఎక్స్ ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాం

డిపో మేనేజర్ రవిచందర్

పరకాల నేటిధాత్రి

 

టిజియస్ ఆర్టిసి పరకాలడిపో ఆద్వర్యంలో విహరయాత్రల వివరాల పోస్టర్ ను డిపో మేనేజర్ రవిచందర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున విడుదల చేశారు.అరుణాచలం (డీలక్స్),మల్లూరు,భద్రాచలం, పర్ణశాల,ధర్మపురి,బాసర,మల్లూరు,మేడారం,రామప్ప,వేములవాడ,కొండగట్టు,గూడెం గుట్ట(ఎక్స్ ప్రెస్) పై యాత్ర స్థలాలకు బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు.పై స్థలాలకు కాకుండ భక్తులకు అనుకూలమైన ప్రదేశాట విహరయాత్రులకు బస్సులు సమకూరుస్తామని,చార్జీలు మరియు ఇతర వివరాలకు 9666919190 9705479088 సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ కుమారి,అసిస్టెంట్ ఇంజనీర్ రాజశ్రీ పాల్గొన్నారు.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..,

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో.

వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో.

రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన .

అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తూ.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవసరమయ్యే ఆరు అంశాలు అనగా.

తక్కువ యూరియా వాడండి.

సాగు ఖర్చులు తగ్గించండి.

అవసరం మేరకే రసాయనాలు వినియోగించండి.

నెల. తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి రసిదరులు భద్రపరచుకోండి.

కష్టకాలంలో నష్టపరిహాన్ని పొందండి.

సాగు నీటిని ఆదా చేయండి.

భవితరాలకు అందించండి.

పంట మార్పిడి పాటించండి.

సుస్థిర ఆదాయాన్నిపోద్దండి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.

అనే అంశాలపై అవగాహన కల్పించారు వీటితోపాటు వరిలోని వివిధ రకాల నూతన వంగడాలు కూరగాయలు సాగు పంటల్లో చీడపురుగు పీడలు నివారణ చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ ఆర్ సతీష్ మాట్లాడుతూ.

నైట్రోజన్ ఎరువులు మరియు పురుగుల మందులు సరైన నియోగం పచ్చి రొట్టఎరువుల.

ప్రాముఖ్యత మరియు వరి తెగులు. నెక్ బ్లాస్ట్ నివారణ సమగ్ర సస్యరక్షణ. Ipm.

పద్ధతులు నిర్వహించారు.

అలాగే. ఐ సి డి ఎస్. సూపర్వైజర్ శ్రీ నిర్మల దేవి మాట్లాడుతూ చంటి పిల్లల తల్లిదండ్రులు.

పిల్లల ఆహారం మరియు వారి ఆరోగ్యం పై తగినంత జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ వ్యవసాయ అధికారి.

కే సంజీవ్ మరియు ఏఈఓ లు నాణ్యమైన విత్తనాలు వేసేసమయం గురించి రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతుల తెగుళ్లు.

కోతుల బెడద.

మట్టి నమూనాలు.

పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోళ్ల పెంపకం గురించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు ద్వారా పెరటిలో పెంచుకునే విత్తనాలు మరియు జగిత్యాల విత్తనాలను రైతులకు అందజేశారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.పాక్స్.

చైర్మన్ బండి దేవదాస్.

మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి సలీం.

ఏ కరుణాకర్. ఆర్ గౌతం. ఎం మౌనిక. అంగన్వాడి టీచర్. ఎన్ వినోద. విద్యార్థులు. అభిలాష్. రాకేష్. రాళ్ల పేట గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నా

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి.

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి ఈశ్వరప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతా కి సంగమేశ్వర స్వామి దేవాలయములో ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ఈశ్వరప్ప లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో శివ రుద్రప్ప స్వామి గ్రామ పెద్దలు భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

(మాస్) సభ విజయవంతం.

(మాస్) సభ విజయవంతం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో,మన ఆలోచన సాధన సమితి (మాస్) సభ అధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య మాట్లాడుతు (మన ఆలోచన సాధన సమితి)ఆలోచన చైతన్యం, చైతన్యమే ఆయుధం, అనే భావాలతో బీసీ ఉద్యమం నవ శకం ఆరంభమైంది అని అన్నారు. అంతేకాకుండా ప్రధాన లక్ష్యమైన రాజ్యాధికారం బీసీల సమైక్యతలో ఉంటుందని జ్యోతిబాపూ పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోని భాగమే బీసీల సమైక్యత అని తెలిపారు.కటకం నర్సింగరావు .దొంత ఆనందం, మంగలి పల్లి శంకర్, రాష్ట్ర శాఖ నుంచి హాజరై బీసీల సమైక్యత కోసం అనర్ఘళంగా ఉపన్యాసం అందించారు. బీసీలు అందరూ ఒకటైతే బీసీలకు రాజ్యాధికారం వస్తే అందరూ సామాజిక ,ఆర్థికంగా, బలపడతారని సభలో తెలిపారు. సిరిసిల్ల కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయడానికి కుల సంఘానికి ఇద్దరు చొప్పున కన్వీనర్లను నియమించాలని సూచనతో పాటు 15న బీసీ సమైక్యత జెండాను సిరిసిల్ల పట్టణంలో చైతన్యవంతంగా ఎగరవేయాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా దొంత దేవదాసు వ్యవహరించారు,గాదమైసయ్య, వెంగళ అంకయ్య,యువ కవి వెంగళ లక్ష్మణ్, తన గానంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య,కోడం నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version