ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..ఎవరూ అదైర్యపడొద్దు
పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు
వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, పత్రాల పంపిణీ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు.
ఉద యం నుండి సాయంత్రం వరకు శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.
మండల పరిధిలోని పలు గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలకు హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక లల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పంద న బాగుంటుందన్నారు.
గత పాలకులు ఎమ్మెల్యే నివాసా లు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిం దని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరంకేటాయిం చిందని, ఆర్థికంగా ఇబ్బందు లు ఉన్నప్పటికీ పేదల సంక్షే మం అజెండాగా పాలన కొనసాగుతుంది గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయా లని, ఎక్కడ లంచాలకు ఆస్కా రం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నా మని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడా లని తాము ప్రయత్నిస్తు న్నామని ఎమ్మెల్యే అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వని ప్రతిపక్ష నాయకులు ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకాల ద్వంసానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవ ర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనుల కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
మేము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు.
బీఆర్ఎస్ గుండా యిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందుకున్న పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతో షంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికా రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు