పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు.

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు

ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని  కోరుకుంటున్నాను

త్రాగునీటి బోర రిపేర్ చేయించిన.

త్రాగునీటి బోర రిపేర్ చేయించిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో నవత ట్రాన్స్ పోర్ట్ దగ్గర 15 వార్డులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ త్రాగునీటి బోరును దగ్గరుండి మున్సిపల్ కార్మికులతో రిపేర్ చేయించారు . బోరు పనిచేయందున 15 వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తెచ్చారు .వెంటనే ఆయన స్పందించి మున్సిపల్ అధికారుల తెలిపి త్రాగునీటి బోరును రిపేరు చేయించారు . ఈ మేరకు 15 వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ బండారు కు ఈమేరకు కొంపల రమేష్ కొంపల సురేష్ బండారు సూరి పాపి శెట్టి శ్రీనివాస్ ఆర్ ఎంపీ డాక్టర్ దానియల్ ఇలియాస్ ప్రజలు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు

25 వార్డులో బోర్ కి మరమ్మత్తు చేయించి నీటి సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్లు మార్క్స్ కాలనీ 25 వ వార్డు లో ఉన్న బోరును మరమ్మత చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని వేసవికాలం సమీపిస్తున్నందున నీటి కొరత లేకుండా చూడాలని అదేవిధంగా 25వ వార్డులో ఉన్న బోర్ రిపేర్ అయి మూడు రోజులు కావస్తుంది కావున దాన్ని మరమ్మత్త చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరిపడా రావడం లేదని వాటి సమయాన్ని కూడా పెంచాలని కోరారు అంతేకాకుండా కాలనీలో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్ సిపిఐ 25 వ వార్డు శాఖ సహాయ కార్యదర్శి యాకూబ్ పాషా, సిపిఐ నాయకులు మట్టి కృష్ణ, నా తర చంద్రయ్య, భాస్కర్, పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version