శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వైద్యుల రాజిరెడ్డి నిరుపేద కుటుంబం రేక్కాఆడితే గాని డొక్కా నిండని పరిస్థితి. నిత్యం కూలి పని చేస్తూ ఇద్దరి కూతుర్ల పెళ్లి చేసి కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు నిజానికి తమకంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని పై అధికారులు వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయని వారు అంటు న్నారు. గ్రామసభలు జరిగినప్పుడు తమ పేర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తమ పేర్లు కనిపించకపోకుండా చేశారని వారు బోరు మంటున్నారు. గ్రామంలో 35 ఇండ్లు వస్తే ముందుగా ఉండాల్సిన తమ పేరు లేకపోవడం ఎంపికలో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనం అంటున్నారు నాకు ఇద్దరు ఆడబిడ్డల పెళ్లి చేసి ఇల్లు లేక గుడిసెలలో నివసించి, ప్రజల సహకారంతో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన సహించే లేదంటూ చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటిముట్టలేనా!
ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం
Indiramma’s committees.
ఎన్నికల్లో చేత గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నారు చేత గుర్తుకు ఓటేసినా మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇద్దరు ఆడబిడ్డలతో కూలి పని చేసుకుని బతుకుతున్న ఊళ్లో నాకంటే పేదవాళ్ళు ఎవరూ లేరు గ్రామంలో 35 మందికి ఇల్లు వస్తే నాలాంటి పేదోడికి మాత్రం రాలేదు ఒకసారి మా గ్రామానికి వచ్చి మేము చెప్పేది నిజము కాదా చూస్తే తెలుస్తుంది
మా పేదరికం కనబడలేదా! శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వైద్యుల రాజిరెడ్డి దంపతులు కూలి పని చేస్తూ ఇద్దరూ కూతురుపెళ్లిళ్లు చేసి జీవనో పాధి సాగడం చాలా ఇబ్బం దిగా మారింది. ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో చాలా కష్టంగా నివసిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా కుటుంబం పట్ల చొరవ చూపి నిరుపేద కుటుంబానికి ఆసరా చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు
అప్పుడున్న పేరు ఇప్పు డేమైనట్లు!
ఇందిరమ్మ ఇండ్లు కోసం అందరిలాగే దరఖాస్తు చేసుకున్నాం గ్రామ సభలో మా పేరు చదివినప్పుడు మాకు ఇల్లు వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మాత్రం లేదంటు న్నారు గ్రామపంచాయతీ ఆఫీసర్లను అడిగితే పైనుంచి పేర్లు వచ్చినాయి మమ్మల్ని ఏమి చేయమంటారు అన్నారు మాకు ఏమి సంబంధం లేదన్నారు గ్రామంలో మాకంటే పేదవారు ఎవరూ లేరు ఆర్థికంగా ఉన్న వాళ్లకు నాయకుల దగ్గర ఉన్నోళ్లకు మాత్రం ఇండ్లు వచ్చినాయి మేము ఏం పాపం చేసిన్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల రాజిరెడ్డి దంపతులు, ప్రకాశ్ రెడ్డి, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) తాజాగా 12 దేశాల పౌరులకు అమెరికాలో ఎంట్రీకి నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటే కఠినమైన ఆంక్షలు ఎదుర్కొవాల్సిందే. ఆఫ్రికా, మధ్య ప్రాశ్చ్య ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్, మయన్మార్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలతో పాటు వెనిజులా, తుర్కమెనిస్తాన్, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, తదితర దేశాలకు కొత్తగా విధించబోయే షరతులు, పరిమితులు వర్తిస్తాయని పేర్కొన్నారు. వీసా ఉన్నవారికి అనుమతి, కొత్త దరఖాస్తులపై కఠిన నియమాలు విధించారు. ఇప్పటికే వీసా ఉన్నవారు అమెరికాలో ప్రవేశించవచ్చు. కానీ పై దేశాల పౌరులు కొత్త వీసా కోసం దరఖాస్తు చేస్తే, వారి దరఖాస్తులను తీవ్రమైన భద్రతా ప్రమాణాలతో సమీక్షించనున్నారు.
అమెరికా భద్రతే ఫస్ట్
నిషేధిత జాబితాలో ఉన్న దేశాలు సరైన స్క్రీనింగ్ వ్యవస్థలను పాటించడం లేదు. వీసా గడువు ముగిసిపోయినా చాలా మంది అమెరికాలోనే ఉండిపోయారు. ఇది దేశ భద్రతకు పెనుముప్పుగా భావిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల కొలరాడో లో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ నిందితుడు ఈజిప్టు పౌరుడని వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే ఉన్నాడని వెల్లడించారు. ఈజిప్ట్ ఈ జాబితాలో లేకపోయినా, అన్ని దేశాలు తమ భద్రతా ప్రమాణాలను పటిష్టంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచిన దేశాలను ఈ నిషేధ జాబితా నుంచి తొలగించే అవకాశముందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. తమ అంతిమ లక్ష్యం అమెరికా పౌరుల రక్షణే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఝరసంగం మండల కేంద్రంలో లో గల అంగడి బజార్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా చెత్తకుండిని ఏర్పాటు చేశారు , ప్రస్తుతం అట్టి చెత్తకుండిలో కొన్ని నెలల నుండి చెత్త మరియు సమీప ఫస్ట్ ఫుడ్ సెంటర్, బేకరి లకు సంబంధించిన వ్యర్థాలను అందులో వేయడం ద్వారా భారీగా దుర్గంధ రావడం కాకుండా ,అట్టి వ్యర్థపదల నుండి నీరు కారి ప్రధాన రహదారి వెంట మురికి నీరు వచి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుంది,కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ అధికారులు ఇట్టి వ్యర్థాలను తీయకుండా కాలయాపన చేస్తున్నారు.అట్టి వ్యర్థ జలాల వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. తక్షణమే అట్టి చెత్తకుండిని వేరే ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…
మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…
మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…
మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…
నేటి ధాత్రి -గార్ల :-
పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు.
మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది.
ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.
మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ.
ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.
1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు.
పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు.
మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు.
జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.
అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు.
ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు.
అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.
50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.
మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది.
ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.
ఆన్ లైన్ జూదంతో అప్పులు.. పీజీ వైద్య విద్యార్థి సూసైడ్
తమిళనాడులోని కొడైకెనాల్ సమీపంలో తన కారులో ఒక యువ వైద్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మృతుడిని దిండిగల్ జిల్లా వేద చంద్రూర్కు చెందిన జోషువా సమ్రాజ్ (29)గా పోలీసులు గుర్తించారు. అతడు రెండో సంవత్సరం పీజీ వైద్య విద్య చదువుతున్నాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. ఆన్లైన్ జూదాల్లో పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన జోషువా ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కారులో అతను ఇంట్రావెనస్ డ్రగ్ తీసుకుని మరణించినట్టు నిర్ధారించారు. జోషువా ఫిలిప్పీన్స్లో మెడిసిన్ పూర్తి చేసి తమిళనాడులోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు.
నాలుగు రోజులుగా జోషువా కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వేదచంద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పూంబారై సమీపంలో ఒక కారు ఆగి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో జోషువా మృతదేహాన్ని కనుగొన్నారు. పక్కనే ఇంట్రావెనస్ డ్రగ్ గుర్తించారు. కారులో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో లభించిన బ్యాంకు లావాదేవీల ఆధారంగా నిందితుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడని, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి ఆధారాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జోషుగా తనకు తానుగా ఇంజక్షన్ చేసుకుని సూసైడ్ కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. గతంలో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంవత్సరం మార్చిలో ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ సీనియర్ సర్జన్ డాక్టర్ జార్జ్ పి. అబ్రహామ్ (74) కూడా తన ఫామ్ హౌస్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది.
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 158వ నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన నగర సంకీర్తన నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ లింగేశ్వర మందిరం వరకు కొనసాగింది. శ్రీ కృష్ణ కీర్తనలు, శ్రీ రామ భజనలు, శ్రీ శివ స్తోత్రాలను ఆలపిస్తూ భక్తులు ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.
కౌండిన్య కళ్యాణ మండపమే లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి.
గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య.
ఘనంగా 3 వ వార్షిక మహాసభ విజయవంతం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట డివిజన్ పరిధిలో కౌండిన్య కళ్యాణ మండపం లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి అడుగులు వేసిందని గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య అన్నారు.గౌడ సంక్షేమ సంస్థ 3 వ వార్షిక మహాసభ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో జరిగింది.500 మంది సభ్యులతో సంస్థ కొనసాగుతున్నదని పేర్కొంటూ ఈ నేపథ్యంలో వార్షిక నివేదికను అధ్యక్షుడు ప్రవేశపెట్టి సంస్థ స్థితిగతులు పట్ల వివరించారు. నర్సంపేట డివిజన్ పరిధిలో గల గౌడ వెల్ఫేర్ సంస్థ గత మూడు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు.అలాగే భవిష్యత్తు కార్యాచరణ పట్ల సభ్యులకు వివరించారు.ఇప్పటి వరకు నర్సంపేట డివిజన్ పరిధిలో గౌడ కులస్తుల ఫంక్షన్ హాల్ ఎదన్నారు. నమ్మకంతో,సమాజ సేవతో ముందుకుపోతున్న గౌడ వెల్ఫేర్ సొసైటిలో ఎలాంటి అపోహలు ఉండవని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గండి నర్సయ్య గౌడ్, బూర అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఐలుమల్లు గౌడ్, సహాయ కార్యదర్శి ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ధిక కార్యదర్శి గండి రాము గౌడ్, రామగిరి సుధాకర్ గౌడ్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, బూర వేణు గౌడ్, రావుల లక్ష్మీ నారాయణ గౌడ్, గందం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,వల్లాల శ్రీహరి గౌడ్,విజయ్ గౌడ్,ముఖ్యులు వేముల సాంబయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, తండ సారంగపాణి గౌడ్, వేముల రవి గౌడ్, గంప రాజేశ్వర్ గౌడ్, పీఈటి శ్రీలత గౌడ్, గౌరవ సభ్యులు గౌడ సంఘ సభ్యులు సర్వ సభ్యులు పాల్గొన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వేంకట స్వామి మాలకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా స్థానం లభించిన విషయం విదితమే. ఈ విషయం పట్ల అంబేడ్కర్ యువజన సంఘం జహిరాబాద్ నియోజకవర్గం అద్యక్షులు డి.శ్రీనివాస్ సోమవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…
నేటి ధాత్రి – గార్ల :-
ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు.
2016లో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం శంకుస్థాపన చేసిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,రోల్లపాడు ప్రాజెక్టును 2018లో సీతారామ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్, రిడిజైన్ చేపించి సీతారామ ప్రాజెక్టును సత్తుపల్లి, అశ్వరావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు అక్రమంగా దారి మల్లించడం జరిగింది.
ఏజెన్సీ గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.
సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లింపు పై, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై తగు విచారణ జరిపించి మొదటి డిపిఆర్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇల్లందు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల బీడు భూములకు సాగునీరు ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
పాఖాలేరు అలిగేరు కలిసేచోట గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ తదితర మండలాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు.
గత ప్రభుత్వాలు అనేకసార్లు సర్వేలు, జీవోలతో కాలం వెళ్ళదీశారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రధాన ఏజెండాగా ఉన్నది.
తెలంగాణ ఏర్పడి 11 ½ సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్ల రూపాయల వ్యయంతో మున్నూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ 1076 జీవో విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ జీవోను పట్టించుకున్న పాపానా పోలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ చేస్తూ, మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.కాకతీయుల కాలం నాటి గార్ల పెద్ద చెరువు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాణాధారం లాంటిది.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టా పాస్ బుక్కులు పొందడం జరిగింది.
అట్టి శిఖం భూములలో బావులు తవ్వడం, పంటలు సాగు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సుమారు రెండువేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.
దీనివల్ల రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు.
అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేయడంతో చెరువు భూములను కొలతలు వేస్తూ వదిలేస్తున్నారు తప్ప, అక్రమ పట్టాలు తీసుకున్న వ్యక్తులపై చర్య తీసుకోవడం గానీ చెరువు శిఖం భూములకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం గానీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గార్ల పెద్ద చెరువు భూములను పరిరక్షించే విధంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగే విధంగా తగిన చర్యలకు ఆదేశించగలరని కోరారు.
పాఖాలేటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల రాంపురం మద్దివంచ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సుమారు 15 తండాల, గ్రామాల ప్రజలు గార్ల మండల కేంద్రానికి చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాఖాలేరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో సుమారు నాలుగు నెలల పాటు రహదారి బంద్ అవుతుంది.
ఆ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర పనుల నిమిత్తం గార్ల మండల కేంద్రానికి రావడానికి బ్రిడ్జి సౌకర్యం లేదు.
అనేక మంది పాఖాలేరులో పడి కొట్టుకుపోయి చని పోయినారు.
పాఖాలేటిపై గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు అనేక ఉద్యమాలను నిర్వహించాయి.
ఫలితంగా గత ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు.
ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంపై ఒక అడుగు కూడా ముందుకు వయలేదు.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గార్ల రాంపురం మద్దివంచ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రజల రహదారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
మున్నేరు నీటిని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు తరలించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2025, మే 17 తారీఖున జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
మున్నేరు నీటిని మున్నేరు పరివాహక ప్రాంత రైతులకు సాగు తాగునీరు ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకుపోవాలి తప్ప ఇక్కడ ప్రాంతాలను ఎండబెట్టి వేరొక ప్రాంతాలకు నీరు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే జీవో నెంబర్ 98 ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుగులోత్ సక్రు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, బీఎస్పీ మండల అధ్యక్షులు బాదావత్ వెంకన్న, టిడిపి మండల కార్యదర్శి కత్తి సత్యం, బిజెపి మండల నాయకులు తోడేటి నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పోతుల నరసింహారావు మొదలాకర్ శివాజీ, శంకర్, బాలాజీ, కేలోత్ బాల, గుండేటి వీరభద్రం, తెల్ల గర్ల నాగేశ్వరరావు, ప్రవీణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..! ఫస్ట్ లుక్ అదుర్స్
తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మక తెలుగు కవి గద్దర్ గౌరవార్థం ఆయన పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అవార్డు నమూనాకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో అడుగు భాగంలో గద్దె ఆపైన చేతిలో ఓ మూవీ రీల్ బాక్స్ ఉండటం మనం గమనించవచ్చు.
కాగా, మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ను వరించింది .
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్డులను కైవసం చేసుకున్నాయి.
చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .
BJP Durgam Ashok.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిర ఇండ్ల లకు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజల అభివృద్ధిలో లో. పేద రాష్ట్రపతిగా అభివృద్ధి.లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగిస్తూ. దేశంలో ఇందిరమ్మ. కన్న కలలు సహకారం చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయిస్తూ. వారి కుటుంబాల కల సహకారం చేస్తున్నారని. అలాగే ఇప్పటివరకు మండలంలో 85 ఇండ్లకు గాను గ్రౌండ్ వర్కింగ్ చేయడం జరుగుతుందని. ఇప్పటివరకు. 45 ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేయడంతో పాటు. ముగ్గు పోసి నూతన గృహాలు ప్రారంభించామని. అలాగే గత ప్రభుత్వాలతో పోల్చితే. ఈ ప్రభుత్వ. హయాంలో. అలాంటి అవినీతికి తావియ్యకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అని. ఇకముందు కూడా గ్రామాలలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై. నిరుపేద కుటుంబాల కలసహకారం చేసుకోవాలని. కుటుంబ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నది అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం మాట్లాడుతూ. ఇప్పటివరకు మండలంలో చాలామందికి ఇందిర ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేయడం జరిగిందని మండలంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం. మహోద్యమంగా మొదలుపెట్టిన. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను. మాకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. సుద్దాల కర్ణాకర్. సామల గణేష్. సత్యనారాయణ రెడ్డి. మచ్చ. మధు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ చియాన్ విక్రమ్ మాత్రం… ‘సారీ… నో’ అనే శాడట!
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని ఎంతోమంది నటీనటులు అనుకుంటారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు… తమకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వస్తుందని హీరోలు, హీరోయిన్లు నమ్ముతారు. ఆయన ఆఫర్ ఇవ్వాలే కానీ.. రెండు మూడేళ్ళ పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికీ బిజీ ఆర్టిస్టులు సిద్థపడతారు. అయితే ఈ మాయ పడకుండా… తమ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకునే నటీనటులూ కొందరు ఉంటారు. రాజమౌళికి రెండు మూడేళ్ళు రాసిచ్చేయడానికి ఆసక్తి చూపించవారి విషయమే ఇది! చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తన కెరీర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టాడు. అప్పట్లో తెలుగులో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలను సైతం చేశాడు. చివరకు తమిళంలో బ్రేక్ వచ్చిన తర్వాత అతని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి గ్రాండ్ గా రిలీజ్ కావడం మొదలైంది. ఒకానొక సమయంలో విక్రమ్ సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వైవిధ్య మైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరిచే విక్రమ్.. మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి సినిమాలో వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
కొంతకాలం క్రితం రాజమౌళి బృందం విక్రమ్ ను కాంటాక్ట్ చేసి, మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ లో పాత్ర చేయమని కోరిందట. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ తెలిసి కూడా విక్రమ్ ఆ ఆఫర్ కు నో చెప్పాడట. ఎందుకంటే… అతని పాత్ర సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో సాగుతుందట! ఇప్పుడు తనకున్న ఇమేజ్ కు అలాంటి పాత్ర చేయడం సబబు కాదని విక్రమ్ భావించాడని సన్నిహితులు చెబుతున్నారు. హీరోగా ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించే విక్రమ్… మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మాత్రం ధైర్యం చేయలేకపోయాడని తెలుస్తోంది. విక్రమ్ ‘నో’ చెప్పిన తర్వాతే చిత్ర బృందం ఆర్. మాధవన్ (R Madhavan) ను అప్రోచ్ అయ్యిందని, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించి, డేట్స్ అడ్జస్ట్ చేశాడని అంటున్నారు. మాధవన్ హీరోగా కొన్ని చిత్రాలు చేసి, హీరోగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాదు… ఇటీవల దర్శకుడిగా మారి మెగాఫోన్ నూ చేతిలోకి తీసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి మూవీలో ఆర్టిస్టుల ఎంపిక కుర్చీల ఆటను తలపిస్తోందని సినిమా రంగానికి చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కె. ఎల్. నారాయణ (K.L. Narayana) దీనిని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరరచన చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం మొదలైంది.
ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు.
ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.
అంతేకాకుండా బహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్.
ఇహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్తేపు, స్థానిక ప్రజాప్రతిఙ్ఞడు లతో కలిసి పనులకు శంకుస్థావన కూడా చేశారు.
రానున్న వానకాలం లోపు బ్రిడ్జి నిర్మాదాని పూర్తి చేస్తామని వారు అప్పట్లో ప్రజలకు భరోసా ఇచ్చారు.
దీంతో ఎన్నో ఏళ్ల అవస్థలకు దేక్ పడుతుందని గ్రామస్థులు బావించారు.
కానీ ఇప్పటికి పసులు ప్రారంభంకాకపోత తో ఈ సారీ కూడా ఇక్కట్లు తప్పడం లేదు. 10 రోజుల క్రితం కురి సేన వర్గానికి వాగు ప్రవాహించడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణి కులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
Government
రాకపోకలకు తప్పని ఇబ్బందులు
ఎన్నో సంవత్సరాల నుంచి ప్మాలవరం వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు వర్ష కాలం వచ్చిదంటే నానా తంటాలు పడుతు న్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా పసులు ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్: ప్రభుత్వమైనా పనుణు వేగవంతంగా చేస్తుందనుకుంటే కాల యాపనికే పరిమితమైందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Government
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా ప్యాంవరం, దేవరంపల్లి గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతాయి.
ప్రతీ ఏటా తిప్పలే..
ఎలా వాగు ఉద్భత్తంగా ప్రవహిస్తుండ మతే రాకపోవకు ఇబ్బందులు పడు తున్నాయి.నీళ్లు తగ్గుముఖం పట్టింతవరకు నిరీక్షణ తప్పడంలేదు తప్పని పరిస్థితల్లో దేవరంపల్లి ఈదులపల్లి మీదుగా చుట్టూ తిరిగి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.
విష్ణు కథానాయకుడిగా ముఖేశ్కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా…
విష్ణు కథానాయకుడిగా ముఖేశ్కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్బాబు మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించమని అడిగిన వెంటనే అంగీకరించిన మా బావ ప్రభా్సకు కృతజ్ఞతలు. ఈ సినిమాను శివుడు ఆశీర్వదించాడు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరెవరు పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. ఈ చిత్ర ప్రయాణం నన్ను చాలా మార్చింది. ‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నా’’ అని మంచు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్ పాల్గొన్నారు.
సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక బోధనా పద్ధతులు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కార్యక్రమాలు, మరియు వీటి ద్వారా పాఠశాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని అత్యంత ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ జి. రమేష్, ఆర్.జె.డి. విజయలక్ష్మి, మల్టీ జోన్-2కు చెందిన 350 మందికి పైగా మండల విద్యాధికారులు హాజరయ్యారు. శ్రీమతి సఫియా సుల్తానా గారి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రమేష్ మరియు ఆర్.జె.డి. విజయలక్ష్మి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎస్.సి.ఈ.ఆర్.టి.సురేష్ బాబు, శ్రీ సురేందర్, మరియు న్యాల్కల్ మండల విద్యాధికారి శ్రీ మారుతి రాథోడ్ కూడా ఆమె కృషిని అభినందించారు.
కార్తీ సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోయింది. ‘సర్దార్’కు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సీక్వెల్ కు సామ్ సీఎస్ ను తొలుత అనుకుని ఇప్పుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నారు.
కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్ (Rajisha Vijayan), రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటించారు. లైలా (Laila) ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘సర్దార్ -2’లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తుండగా, ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవన్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత సామ్ సి.ఎస్.ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ స్థానంలోకి యువన్ శంకర్ రాజా (Yuvan Sakar Raja) వచ్చాడు. చిత్రం ఏమంటే… ‘సర్దార్’ తొలి భాగానికి వీరిద్దరూ కాకుండా జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ సమకూర్చుతున్న ‘సర్దార్ -2’ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ కు ఎ. వెంకటేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.