విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు.

విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది.

 

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. విజయ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కష్టపడుతూనే ఉన్నాడు. కింగ్డమ్ లాంటి పరాజయం తరువాత కూడా కుర్ర హీరో ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా హిట్

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ- విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే కింగ్డమ్ సినిమా వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరోసారి రీపీట్ కానుందని తెలుస్తోంది. సితారలోనే విజయ్ మరో సినిమాను ఓకే చేశాడట. డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని టాక్ నడుస్తోంది. కాంబో కొత్తగా ఉంది కదా. అవును.. ఈమధ్యనే హరీష్ శంకర్.. ఒక మంచి కథను విజయ్ కు చెప్పడం, అతనికి కూడా నచ్చడంతో ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.

ప్రస్తుతం హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. తమిళ్ మూవీ తేరికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. దీని తరువాత హరీష్. విజయ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా అయినా కొట్టాడా ..? లేక ఇంకేదైనా హిట్ సినిమాకు రీమేక్ నా అనేది తెలియాల్సి ఉంది.

మెగా మాస్‌….

మెగా మాస్‌

చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని…

చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన మాస్‌ బీట్‌కు చిరుతో బాలీవుడ్‌ భామ మౌనీరాయ్‌ స్టెప్పులేశారు. ఈ గీతానికి గణేశ్‌ ఆచార్య నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవితో దిగిన ఫొటోలను మౌనీరాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చిరంజీవి సర్‌తో కలసి డాన్స్‌ చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

(మాస్) సభ విజయవంతం.

(మాస్) సభ విజయవంతం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో,మన ఆలోచన సాధన సమితి (మాస్) సభ అధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య మాట్లాడుతు (మన ఆలోచన సాధన సమితి)ఆలోచన చైతన్యం, చైతన్యమే ఆయుధం, అనే భావాలతో బీసీ ఉద్యమం నవ శకం ఆరంభమైంది అని అన్నారు. అంతేకాకుండా ప్రధాన లక్ష్యమైన రాజ్యాధికారం బీసీల సమైక్యతలో ఉంటుందని జ్యోతిబాపూ పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోని భాగమే బీసీల సమైక్యత అని తెలిపారు.కటకం నర్సింగరావు .దొంత ఆనందం, మంగలి పల్లి శంకర్, రాష్ట్ర శాఖ నుంచి హాజరై బీసీల సమైక్యత కోసం అనర్ఘళంగా ఉపన్యాసం అందించారు. బీసీలు అందరూ ఒకటైతే బీసీలకు రాజ్యాధికారం వస్తే అందరూ సామాజిక ,ఆర్థికంగా, బలపడతారని సభలో తెలిపారు. సిరిసిల్ల కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయడానికి కుల సంఘానికి ఇద్దరు చొప్పున కన్వీనర్లను నియమించాలని సూచనతో పాటు 15న బీసీ సమైక్యత జెండాను సిరిసిల్ల పట్టణంలో చైతన్యవంతంగా ఎగరవేయాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా దొంత దేవదాసు వ్యవహరించారు,గాదమైసయ్య, వెంగళ అంకయ్య,యువ కవి వెంగళ లక్ష్మణ్, తన గానంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య,కోడం నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version