తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా చేశారని,దానివల్ల ఎంతో మానసిక వేదనకు గురయ్యానని,తన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కృంగిపోతున్నారని అన్నారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని,విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేశానని,నేను తప్పు చేసినట్లు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరూపిస్తే నేను అధికారులు చేపట్టే చర్యలకు సహకరిస్తానని అన్నారు.కానీ ఇలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు.

జైపూర్ ఆర్ఐ పై వచ్చిన వార్తకి స్పందించిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్ ఆర్ఐ తిరుపతి పై వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని తహసిల్దార్ వనజా రెడ్డి తన కార్యాలయంలో బుధవారం తెలియజేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మా పరిధిలో ఉంటే తప్పకుండా వెంటనే స్పందిస్తామని,సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము ఏదైనా తప్పు చేసినట్లు అనిపిస్తే తమ పై అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చునని,అందులో నిజం ఉంటే అధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతారని తెలిపారు.తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ తో పాటు మిగతా అధికారులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నామని,ప్రజా సమస్యలను తీర్చడంలో ఒక అడుగు ముందే ఉన్నామని తెలియజేశారు.ఇలా సోషల్ మీడియా ద్వారా అధికారులను అపరాదులుగా చూపిస్తూ,అసత్య ఆరోపణలు,ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన వారిపై తప్పకుండా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ లోగల నిరుపేద కుటుంబానికి చెందిన బుడుగుల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. కన్నీరు మున్నీరు అవుతున్న బాధిత కుటుంబాన్ని ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,25 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సహాయంని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ ఆదేశాలమేరకు ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబ సభ్యులైన భార్య కాంతమ్మ, కొడుకు రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం శివాజీ ,ఆలం శ్రీను, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు,గట్టిపల్లి బాలకృష్ణ మరియు గ్రామస్తులు గట్టిపల్లి సమ్మయ్య ,చౌలం నవీన్ ,చౌలం సుధాకర్, కొట్టెం రాము, బుడుగుల కృష్ణ,
పూనెం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు.

‘ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు’

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆరు మండలాల పాత్రికేయ బృందం 100 వాహనాలతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం త్రివేణి సంగమం శ్రీ సరస్వతి నదిలో స్థానం ఆచరించి.. శ్రీ ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భావాలతో దైవారాధన చేయాలన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని, ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత, ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ, గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది. పలువురు నాయకులు రాజీవ్ జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల,నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు.

కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం బస్వ రాజుపల్లి గ్రామానికి చెందిన కుక్క ముడి పోచమ్మ పోశయ్య కుమారుడు కుక్క ముడి సంపత్ వైద్య రీత్యా కొత్తగూడెం లో నివసిస్తున్నారు ఈయన గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి కుక్కమూడి సంపత్ ను రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక రాజు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు కు సుపరిచితులుగా ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తూ పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు డయాబెటిస్ రోగులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఏర్పాటు చేస్తున్నారు సంపత్ కు ఈ అవార్డు దక్కడం పట్ల బస్వ రాజు పల్లి కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు దక్కిన పురస్కారం గా అభివర్ణించారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని కోరుకున్నారు

రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన.

జైపూర్ మండల రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్సెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి పై ప్రెస్ మీట్ నిర్వహించి అకారణంగా అసత్య,నిరాధార ఆరోపణలు చేసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వారు ఖండించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ఐ తిరుపతి పై అనవసరంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇవన్నీ నిరాధారమైనవని కేవలం కక్ష్య పూర్వకంగా చేసినవని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జైపూర్ ఏసిపి కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టిఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి,సెక్రెటరీ రామ్మోహన్,టీఎన్జీవోఎస్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు ఏ.సుమన్,కార్యదర్శి సిహెచ్.సతీష్,సభ్యులు రవిచందర్,శ్రీనివాస్,లోకుల ప్రశాంత్,అరెల్లి సత్యనారాయణ,పి.సురేష్, బాణాల ఉదయ్ కుమార్,స్వామి,అపర్ణాదేవి, కళాశిల్ప,రజిత,విజయ్, తిరుపతి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీచిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని
అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ అని అన్నారు..
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ
ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని . రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా మహానీయుడికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ,రాజీవ్ గాంధీ ప్రతి పేద వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు .

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య , మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు మండల నాయకులు ఎర్ర సురేష్ , పోలేబోయిన రుక్నారావు , బరపటి వెంకన్న , జట్ల సత్యం , కరకపల్లి నాగేష్ , దంచనాల రాజేంద్రప్రసాద్ , సుర సంతోష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి:

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛారణ 108 కళాశాలతో వాయు పుత్రునికి అభిషేకం నిర్వహించారు.

Hanuman Jayanti

భక్తుల శ్రీరామ నామ స్మరణ నడుమ 108 కళాశాలలోని పంచామృతాలు, పండ్ల రసాలు, వివిధ జలాలు పంచామృతాలతో స్వామి వారికి జరిపించిన అభిషేకం చూసి భక్త జనులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా జరుగుతున్న రామాయణ హోమం ఈరోజుతో ముగిసింది. అంతకుముందు ఆలయం పై భాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి

డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురైనటు వంటి సందర్భాల్లో ఎన్నో కలు గుతున్నాయి మీరు ఆరోగ్యా న్ని పరిరక్షించడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తుల సంఘం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలలో ఏర్పాటుచేసి ఆరోగ్య పరిరక్షణ కొరకై రైతులు ఆరోగ్య పరిరక్షణ కొరకై పాటు పడుతుందని అన్నారు.ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. బుధవారం రోజు మెడికవర్ శరత్ ఐ విజన్ సహకారంతో గ్రామంలో 135 మందికి పరీక్షించగా ఇందులో 35 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేయునట్లు తెలిపారు అదేవిధంగా ఈసీజీ ద్వారా 45 మంది పరీక్షించు కోవడం జరిగింది.ఇంతటి సహాయ సహకారాలు అందిం చిన మెడికవర్ హాస్పిటల్ శరత్ ఐవిజన్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు కర్ర ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కిరణ్ మెడి కవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఎండి సర్జన్ , డాక్టర్ షఫీ, జనరల్ సర్జన్ డాక్టర్ జిన్నత్ రెడ్డి ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమంత్ ,పియు మేనేజర్ గుడమాల మానస చౌదరి, గ్రామ క్షేత్ర కార్యకర్తలు రవిచంద్ర, పోతు సునీల్,వంశీ , ప్రశాంత్  పాల్గొన్నారు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు పనిచేయాలి.

వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధన ప్రకారం వడ్ల కొనుగోలను ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల యజమానులు వ్యవహరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు బుధవారం మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సభ్యులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని అదేవిధంగా ఎలాంటి అవినీతి పాల్పడకుండా రైతు పక్షాన నిలబడి రైతులకు సహకరించాలని కొనుగోలు కేంద్రాల యజమాను లను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ కౌసల్య దేవి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, అధికారులు, స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరు లు పాల్గొన్నారు.

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి :

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరికుంట చెరువు వద్ద అమృత్ మిత్ర 2.0 కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ధరణి సృష్టి మహిళా సమైక్యల సంఘాల మహిళలతో చెట్లు నాటించుట కొరకు అమృత్ మిత్ర 2.0 కిట్లను మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాజేష్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెప్మా డిఎంసి రేణుక,ఏడీఎంసి ఎస్.కె వహీదా టీఎల్ఎఫ్ ఆర్పి లు మాధవి సిఎల్ఆర్బి సుమలతతో పాటు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి కొట్టించడమే నా మహిళల అభివృద్ధి

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో ఉన్న బుర్రకాయల గూడెం ఐకెపి సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో మాజీ ఎంపీటీసీ సాగర్ తన అనుచరులు ముగ్గురు మహిళలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. దాడిలో గాయపడిన ఆకుల రేణుక వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి,మండల అధ్యక్షులు కుర్రి స్వామినాదన్ పరామర్శించడం జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని అధికార పార్టీ అండదండలతోని చట్టం అంటే భయం లేకుండా తనపై కేసు ఉన్నదనే విషయం తెలిసి కూడా మహిళలపై విచక్షణ రైతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పార్టీ ధాన్యం కల్లాలను మహిళలకు కేటాయించి కొట్టించడమేన మహిళళ అభివృద్ధి అంటే ఇట్టి విషయాన్ని అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మాకు పార్టీలు కాదు ప్రజలే ముఖ్యం కనుక అన్యాయం జరిగిన వారి పక్షాన న్యాయం జరిగేంత వరకు ధర్మసమాజ్ పార్టీ తోడుగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తగు న్యాయం జరగని ఎడల బాధితులతో కలసి ధర్నా రాస్తారోకల తో న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేయడం జరిగింది.

కష్టించిన పంట వానపాలు.

— కష్టించిన పంట
వానపాలు
• లారీలు రాక తిప్పలు
• టార్పాలిన్లు అందివ్వని నిర్వాహకులు

నానిన వడ్లను కొనుగోలు చేయాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

రైతు ఆరుకాలం కష్టించి పండించిన పంటకు లాభం లేకుండా పోయిందని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తే వానపాలు అవుతున్నాయన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు లారీల కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు లారీలకు సరిపోడ ధాన్యం బస్తాలు ఉన్నప్పటికీ ఆ ధాన్యం బస్తాలను రైస్ మిల్లు లోకి తరలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Harvest Rains.

 

ఈ అకాల వర్షాలు నేపథ్యంలో చేతికి వచ్చిన పంటను కండ్లముందే నీటిపాలు చేసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. సొసైటీ నిర్వాహకులు రైతులకు ఎలాంటి టార్పాలిలను అందివ్వడం లేదని తమ వద్ద ఉన్న టర్పాలిన్ లు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ నిర్వాహకులు శరవేగంగా కొనుగోలు జరపాలని వేడుకుంటున్నారు. వానకి నానిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకు 20 రూపాయల చొప్పున తాటి పత్రిలకు కిరాయి తెచ్చుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడుగు బలహీన వర్గాల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.

బడుగు బలహీన వర్గాల నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల నాయకుడు నవభారత నిర్మాణ సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కొమురయ్య అన్నారు బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికిపూలమాలవేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ దేశాన్ని టెక్నాలజీ రంగం వైపు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు అభివృద్ధి గురించి గుర్తు చేశారు దేశానికి సాంకేతికతను తీసుకోవచ్చింది సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశం నీ నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పారదోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడాడు

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి.

సభ సక్సెస్ చేద్దాం రండి కదలిరండి

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ముదిరాజ్ సింహ గర్జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయడానికి చేయి చేయి కలుపుదాం కలిసికట్టుగా సమిష్టి కృషితో సభను సక్సెస్ చేద్దామని,మెపా పిలుస్తోంది ప్రతి గడప నుండి సభకు వెళ్దాం,ముదిరాజ్ ల బలం బలగాన్ని చూపిద్దామని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ మన హక్కులను సాధించడానికి,రాజకీయ పార్టీలకు ఓట్లప్పుడే మనం గుర్తుకు వస్తున్నాం,ఆ తర్వాత మనం వారికి గుర్తుకు రావట్లేదని,ముదిరాజ్ లకు అధిక ప్రాధాన్యం ఇవ్వట్లేదని,ముదిరాజ్ లను బిసి ఏ లో చేర్చాలని,మేమెంతో మాకంత రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని 75%సబ్సిడీతో సంక్షేమ పథకాలు ఇవ్వాలని,రాబోయే స్థానిక ఎన్నికలలో ముదిరాజ్ లకు టికెట్స్ కేటాయించాలని తెలిపారు.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ ‌ స్ఫూర్తిదాయకం.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య.

చిట్యాల నేటిధాత్రి:

రాజీవ్ గాంధీ జీవితం అందరికీ
స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు .
చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీ ‌రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ .హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక దృష్టి కలిగిన భారత ప్రధానిగా టెక్నాలజీ. యువతపై .దృష్టి చారించి దేశాన్ని ఆధునిక రంగంలోకి నడిపించారు
ఆయన సామాన్య వ్యక్తి నుండి మహానాయకుడుగా ఎదిగిన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించారు. రాజీవ్ గాంధీ పేరిట స్థాపించబడిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నేటికీ .విద్య ఆరోగ్యం .సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోంది ఆయన విధానాలు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల‌ రాయకోంరు . చిట్యాల ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ . సీనియర్ నాయకులు ‌ సరిగోమ్ముల సదయ్య . చిలుముల రాజమౌళి ‌ బుర్ర మల్లేష్. గుర్రపు తిరుపతి. బుర్ర కరుణాకర్ . ఆరేపల్లి నరసింహారాములు. శనిగరపు మొగిలి. గుర్రపు నరసయ్య.
తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నిజాంపేట నేటి ధాత్రి:

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసారన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు, ఎమ్మార్పీఎస్ గరుగుల శ్రీను, తాడెం వెంకటి, ఋషికేష్ యాదవ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్.

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో పదో తరగతి విద్యార్థి అమూల్య నిన్న వెలువడిన టీజీఆర్ జేసీ ఫలితాలలో.. ఏంఈసీ విభాగంలో స్టేట్ 1 ర్యాంకు సాధించింది. కొత్తకోట చెందిన సువర్ణ మల్లేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కూతురు అమూల్యను బాలానగర్ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. స్టేట్ బ్యాంకు సాధించడంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version