రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన.

జైపూర్ మండల రెవెన్యూ అధికారి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్సెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి పై ప్రెస్ మీట్ నిర్వహించి అకారణంగా అసత్య,నిరాధార ఆరోపణలు చేసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వారు ఖండించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ఐ తిరుపతి పై అనవసరంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇవన్నీ నిరాధారమైనవని కేవలం కక్ష్య పూర్వకంగా చేసినవని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జైపూర్ ఏసిపి కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టిఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి,సెక్రెటరీ రామ్మోహన్,టీఎన్జీవోఎస్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు ఏ.సుమన్,కార్యదర్శి సిహెచ్.సతీష్,సభ్యులు రవిచందర్,శ్రీనివాస్,లోకుల ప్రశాంత్,అరెల్లి సత్యనారాయణ,పి.సురేష్, బాణాల ఉదయ్ కుమార్,స్వామి,అపర్ణాదేవి, కళాశిల్ప,రజిత,విజయ్, తిరుపతి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version