ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు.

‘ముక్తేశ్వర స్వామికి ఎమ్మెల్యే పూజలు’

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆరు మండలాల పాత్రికేయ బృందం 100 వాహనాలతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరం త్రివేణి సంగమం శ్రీ సరస్వతి నదిలో స్థానం ఆచరించి.. శ్రీ ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భావాలతో దైవారాధన చేయాలన్నారు.

భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ పూజలు.!

కోట గుళ్ళు దేవాలయంలో భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శనివారం భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, శ్రీ భవాని సహిత గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీఐ నరేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version