నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నిజాంపేట నేటి ధాత్రి:

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసారన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు, ఎమ్మార్పీఎస్ గరుగుల శ్రీను, తాడెం వెంకటి, ఋషికేష్ యాదవ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version